ఏప్రిల్ నెలకోసం జగన్ ఎదురుచూపులు

Publish Date:Mar 6, 2013

Advertisement

 

అక్రమాస్తులకేసులో అరెస్ట్ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్. జగన్ మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడివలె బెయిలు కోసం అనేక సార్లు ప్రయత్నించినపటికీ, సీబీఐ ఎప్పటికప్పుడు సైంధవుడిలా అడ్డుపడుతుండటంతో, తొమ్మిది నెలలు గడిచినా ఆయనకీ ఇంతవరకు బెయిలు భాగ్యం దొరకలేదు. అయితే, పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల గత కొన్ని రోజులుగా త్వరలో అన్న బయటకి వచ్చేస్తున్నాడంటూ కొంచెం నమ్మకంగానే చెపుతున్నారు.

 

జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి రావడానికి మరెంతో కాలం పట్టదని ఆయన పార్టీ నేతలు కూడా చాల గట్టిగానే చెపుతున్నారు. అయితే, వారు అంత ధృడంగా విస్వసించడానికిగల కారణాలు ఏమిటంటే, గతంలో జగన్ మోహన్ రెడ్డి బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషను వేసినప్పుడు, రాష్ట్ర కోర్టుల్లో తేల్చుకోవలసిన అంశాన్ని తన వద్దకు తీసుకురావద్దని హెచ్చరిస్తూనే, ఒకవేళ సీబీఐ గనుక ఇప్పట్లో విచారణ పూర్తిచేయలేదని తాము భావించినట్లయితే అప్పుడు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని జగన్ మోహన్ రెడ్డి లాయర్లకు హామీ ఇచ్చింది. అంతే గాకుండా, సీబీఐను త్వరగా విచారణ పూర్తిచేయడం మంచిదని హెచ్చరించింది. అదే సమయంలో మార్చి నెలలోగా విచారణ పూర్తిచేయడానికి ప్రయత్నించామని సీబీఐ ను కోరింది.

 

ఇటీవల సిబీఐ నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, బహుశః అదే కారణంతో జగన్ లాయర్లు తీవ్రంగా వ్యతిరేఖించి ఉంటారు. వచ్చేనెలలోగా సిబీఐ విచారణ ఎలాగు పూర్తిచేయలేదు కనుక, ఇప్పుడు దానిని అభియోగాపత్రం నమోదు చేయనిచ్చినట్లయితే, అప్పుడు బెయిలు కోరెందుకు సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతోనే వారు సిబీఐను అడ్డుకొని ఉండవచ్చును. బహుశః వారు జగన్ మోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఏప్రిల్ నెలలో బెయిలు వస్తుందని భరోసా ఈయడం వల్లనే, షర్మిలతో సహా ఆ పార్టీ నేతలందరూ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదల అవుతాడని నమ్మకంగా ప్రజలకి చెపుతున్నారనుకోవచ్చును.

 

అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా ఏప్రిల్ నెల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సారి కూడా బెయిలు దొరకకపోతే జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశ తప్పదు. తత్ఫలితంగా, ఆయన ఆగ్రహావేశాలకి సహజంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే బలయిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గనుక బెయిలుపై విడుదల అయినట్లయితే, జగన్ మోహన్ రెడ్డి కొంచెం సర్ధుకొనే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మరి కొద్ది రోజులు అవకాశం దక్కే అవకాశం ఉంటుంది.

By
en-us Political News

  
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.