స్వంత పార్టీకే ఎసరు పెట్టుకొంటున్న జననేత

Publish Date:Dec 22, 2014

Advertisement

 

ఆంద్రప్రదేశ్ శాసనసభలో నిన్నరాజధాని అభివృద్ధి మండలి బిల్లు పేరిట అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, చివరికి తిట్లు తోపులాటల వరకు సభలో జరగకూడనివన్నీజరిగాయి కానీ బిల్లుపై లోతుగా చర్చ మాత్రం జరుగకుండానే ఆమోదం ముద్ర పడింది. అందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డినే నిందించక తప్పదు. ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద రాజధాని నిర్మిస్తానని సభలో ప్రకటించినప్పుడు దానిని ఆయన స్వాగతించారు. కానీ ఆయన ఇప్పుడు చెపుతున్నట్లుగా రాజధానిని దొనకొండ లేదా వినుకొండ వద్ద పెట్టుకోమని ఆనాడు సూచించలేదు. ఆ తరువాత తూళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి భూసేకరణకు సిద్దమవుతున్నప్పుడు, కృష్ణా జిల్లాలో బలహీనంగా ఉన్న తన వైకాపాను బలోపేతం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సున్నితమయిన ఈ అంశంపై కూడా రాజకీయాలు చేస్తూ భూసేకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఆటంకాలు సృష్టించవచ్చో అన్నీ సృష్టించారు.

 

ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందంటూ సభలో చాలా రాద్దాంతం చేసిన జగన్, బిల్లుపై లోతుగా చర్చించి, అందులో లోటుపాట్లు ఏమయినా ఉంటే సరిచేసేందుకు ప్రయత్నించకపోగా, తనకు అధికారం దక్కనీయకుండా చేసారనే దుగ్ధతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందించడానికే ప్రాధాన్యం ఇవ్వడం చాలా దురదృష్టకరం. అసలు బిల్లులో లోపాలపై చర్చించకుండా, రాజధానిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయకుండా బిల్లును ఎందుకు వ్యతికించారంటే, భూములు పోగొట్టుకొంటున్న రైతుల సానుభూతి పొంది తద్వారా జిల్లాలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనం కనబడటం లేదు.

 

అయితే ఆయన ఆ ప్రయత్నమూ దైర్యంగా చేయలేకపోయారనే చెప్పవచ్చును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు “ఆ ప్రాంతంలో రాజధాని నిర్మించడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా?” అని అడిగిన ప్రశ్నకు ఆయన అవునని కానీ కాదని గానీ సూటిగా జవాబు చెప్పలేకపోయారు. కానీ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తోందంటూ పదేపదే సభలో నొక్కి చెప్పారు. రైతులకు న్యాయం జరగాలంటే బిల్లులో తను గమనించిన లోపాలను వివరించి దానిపై సభలో చర్చించి వాటిని సవరించేందుకు గట్టిగా కృషిచేయడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. కానీ ఆ సాకుతో అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెడుదామని ప్రయత్నాలు చేసి చివరకు ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక తనే దోషిగా మిగిలారు.

 

జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఇటువంటి ప్రయత్నాల వలననే ఆ పార్టీ మరింత దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన జిల్లాలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు రాజధాని నిర్మాణానికి ఈవిధంగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తే అక్కడ పార్టీ బలపడుతుందో లేదో తెలియదు కానీ మిగిలిన అన్ని జిల్లాలలో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. రాజధాని నిర్మాణానికి ఆయన అడ్డుపడుతుండటం చూస్తున్న రాష్ట్ర ప్రజలు ఆయనపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడతారనట్లు ఈ విషయాన్ని ఆయన చెవిలో వేసేందుకు వైకాపా నేతలు వెనుకాడుతున్నారు. అందువల్ల ఆయన తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వితండవాదం చేస్తూ పార్టీకి శల్య సారధ్యం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ల సలహా సంప్రదింపులు చేయకుండా ఆయన తనకు తోచినట్లుగా పార్టీని నడిపించుకొంటూ పోతున్నారు. ఆ విధంగా వ్యవహరించడం వలననే  ఆయనను నమ్ముకొన్న తెలంగాణాలో పార్టీ నేతలు ఇంతకు ముందు రోడ్డున పడ్డారు. ఆంధ్రాలో వైకాపా నేతలకు కూడా మున్ముందు అదే పరిస్థితి ఎదురయినా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.