బిల్డప్ బాబాయ్!

Publish Date:Jul 30, 2025

Advertisement

కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్. మద్యం కుంభకోణం కేసులో  పీకల్లోతు కూరుకుపోయిన జగన్  రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా..  అబ్బే మనకున్న పరపతి  ముందు  కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.  

మద్యం కుంభకోణం కేసులో  సిట్ దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరువ అవుతోంది. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్.. సీట్ తో పాటు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు  ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఏపీ వరకు అంతా తన వెంటే ఉన్నారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. 

 అసలు విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగంతో పాటు,  లక్షలల మంది అనారోగ్యానికి కారణమని,  లక్షలాది మంది గత ప్రభుత్వంలో,నకిలీ మందు తాగి అనారోగ్యం పాలయ్యారనీ,   వేల మంది జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా  అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారనీ జనం బహటంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాలపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నది. కానీ ఇంకొంతమంది వైసీపీ నేతలూ,  మాజీ మంత్రులు అసలు  పిచ్చిమందు, మంచి మందు ఉంటాయా? అంటూ వితండ వాదం చేస్తున్నారు.  సరే అ విషయాన్ని పక్కన పెడితే..  ఇప్పుడు తాజాగా అదే మద్యం కుంభకోణం కేసులో  ఆర్థిక అవినీతి జరిగిందని ,ప్రజల ప్రాణాలతో చెలగాట మాడారని  సిట్ బృందం పక్కా ఆధారాలతో,   నివేదిక తయారుచేసి, ఈ కేసుతో ప్రమేయం ఉన్న   ఒక్కొక్కరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెడుతోంది. ఇక ఈ కేసులో తరువాతి అరెస్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు చేస్తున్నారు.  రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోబోయేదని మాజీ సీఎం జగన్ అని దాదాపుగా అందరూ నిర్ధారణకు వచ్చేశారు.  ఈ విషయాన్ని బెంగుళూరు ప్యాలెస్ నుంచి నిశితంగా  గమనిస్తున్న మాజీ సీఎం జగన్ , ఎక్కడా తగ్గేదేలే అంటూ రివర్స్ పొలిటికల్  గేమ్ ప్లాన్ చేశారంటున్నారు.  ఆ ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి  బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని.. ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లి కలిశారు. అంతే కాకుండా జగన్ తాను గవర్నర్ తో భేటీ అయిన విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా కల్పించారు.  దీంతొ జగన్ ఎందుకు పనిమాలా గవర్నర్ తో భేటీ అయ్యారు? ఈ భేటీలో ఆయన గవర్నర్ తో  చర్చించిన అంశం ఏమిటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. అంతే కాదు.. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  ఇలా జరగాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. అంటే ఆయన తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుందని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి.  

ఎందుకంటే తనను అరెస్టు చేయాలంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద విషయం కాదు...  ఓ పక్కన లిక్కర్ కేసు లో  సిట్ అధికారులు కూడా దూకుడు పెంచారు... కాబట్టి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ప్రమేయాన్ని నిరూపించే కొన్ని ఆధారాలు దొరికే ఉంటాయి.   ఇంకొన్నిటి  కోసం సిట్ దర్యాప్తు చేస్తుండి ఉంటుంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేస్తారని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా..    ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని టాక్... అందుకే గవర్నర్ ను కలిసి..  అక్కడ ఏదో జరిగిందన్న బిల్డప్ ఇచ్చి..  ఓ పక్కన ప్రభుత్వానికి మరో పక్కన అధికారులకు ఒత్తిడి పెరిగేలా జగన్ వ్యూహం రచించారనేది పరిశీలకుల విశ్లేషణ.  అందుకే సందర్భం ఉన్నా లేకున్నా, అసలు లోపల ఏం జరిగిందో ? ఏం జరగలేదో తెలియకుండా గవర్నర్ తో  భేటీ అని ఓ పెద్ద వ్యవహారాన్ని తెరమీదకి తీసుకొచ్చారు.  అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి   గవర్నర్ కలిశారు.. అయితే  గవర్నర్ ఆయనకు చేయ గలిగిన  సహాయం ఏంటి?  రాజ్యాంగ పదవిలో  గవర్నర్.. ఆర్థిక నేరాలు, ఇతర అభియోగాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న,  వ్యక్తిని కాపాడగలరా? తనకున్న విశిష్ట, విచక్షణ అధికారాలు ఉపయోగించి, కేసుల్లో ఉన్నా సరే ఒకమాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయొద్దని చెప్పగలరా?  అంటే అదేమీ జరిగే పని కాదంటున్నాయి రాజకీయవర్గాలు.   

అయితే మరి జగన్  గవర్నర్ ఎందుకు కలిశారు? కలిశారు సరే.. ఆ విషయంలో మీడియా అటెన్షన్ ను డ్రా చేసేలా ఎందుకు వ్యవహరించారు?.. అన్న ప్రశ్నకు,  అదే అసలు కామెడీ అంటున్నారు పరిశీలకులు. తన వెనుక ఏదో శక్తి ఉందనీ,  ఓ పక్కన కేంద్రం,  మరో పక్కన గవర్నర్ జగన్ కు రక్షణగా నిలుస్తారనీ..  రేపు జగన్ ను సిట్ అధికారులు,  అరెస్టు చేస్తే , తెర వెనక పెద్దోళ్ళంతా  జగన్ కు  మద్దతు పలుకుతారన్న బిల్డన్ ఇవ్వడానికే.. అలా బిల్డప్ ఇవ్వడం ద్వారా సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు తన నాయకత్వంపై విశ్వాసం సడలిపోకుండా ఉండాలన్న భావనతోనే  జగన్ గవర్నర్ భేటీ విషయం అంతగా ప్రచారంలోకి వచ్చేలా చేశారని అంటున్నారు.   అందుకే తన వ్యూహంలో భాగంగా, గవర్నర్ ను , ఆరోగ్య కుశల, ప్రశ్నలు వేస్తానంటూ అపాయింట్మెంట్ అడిగి ,ఓ గంట పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసి,  తెర వెనక ఏదో మంత్రాంగం జరిపినట్లుగా బిల్డ్ అప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

లేదంటే ఎవరైనా నేత ఓ గవర్నర్ దగ్గరికి వెళ్లి, తనపై కేసులు పెడుతున్నారని తనను కాపాడాలని అడిగే ప్రయత్నం.. కాదు కాదు ధైర్యం చేస్తారా?  అంటున్నారు. ఢిల్లీ వెళ్లి రావటం,  గవర్నర్ కలవడం ఇలాంటివన్నీజగన్  పొలిటికల్ డ్రామాలో భాగమే అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఏంటో,ఆ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో? 

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.