ఏబీవీపై కేసు సరే.. జగన్, విజయసాయిలను ఏం చేయాలి?

Publish Date:Jan 23, 2025

Advertisement

కిందపడ్డా మాదే పై చేయి. మేం ఎవర్నైనా ఏదైనా అంటాం.. మమ్మల్ని అంటే మాత్రం సహించం. మేము ఏం చేసినా ఏం మాట్లాడినా, చివరికి బూతులు తిట్టినా తప్పు కాదు..  అదే మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అది తప్పు. క్షమించరాని నేరం. ఇదీ మొదటి నుంచీ వైసీపీ నేతల తీరు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిస‌హా ఆ పార్టీ నేత‌లు ఎవ‌రినైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టొచ్చు. కులాల పేరుతో బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప‌లానా కులాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి వెలివేయాల‌ని అనొచ్చు . వారు ఏద‌న్నా క‌రెక్ట్ అంటూ స‌మ‌ర్ధించుకుంటారు. కానీ, వారి  వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శిస్తే మాత్రం త‌ట్టుకోలేరు. వారి సొంత‌ మీడియా , పార్టీ సోష‌ల్ మీడియా ద్వారా అదే ప‌నిగా అస‌త్యాల‌తో త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తుంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను, ఏపీలోని క‌మ్మ‌ సామాజిక వ‌ర్గాన్ని పురుగుల్లా చూసిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్షంలోనూ అదే త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తున్నారు. తాను చేసిన త‌ప్పుల‌ను ఎత్తిచూపిన వారికి శిక్షలు  వేయాలంటూ సొంత మీడియా ద్వారా రోత రాత‌లు రాయిస్తున్నారు. ఇంత‌కీ  అస‌లేం జ‌రిగింది.. కుల ప్ర‌స్తావ‌న ఇప్పుడెందుకు తేవాల్సి వ‌చ్చిందీ అంటే..

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీలో 2019 నుంచి 2024 వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.  ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటినుంచి ఏపీలోని క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని రాష్ట్రం నుంచి వెలివేయ‌డ‌మే ల‌క్ష్యం అన్న‌ట్లుగా  ప‌నిచేశారు. ఈ ప్ర‌క్రియ ఐదేళ్ల పాటు సాగింది. ఇది ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌ ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిన విష‌య‌మే. అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఏపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారుల‌పై జ‌గ‌న్ చిన్న‌చూపు చూస్తూ వ‌చ్చారు. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు అధికారుల‌పై కేసులు పెట్టించారు. క‌రోనా కార‌ణంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అప్ప‌టి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ అడ్డుకుంటే.. క‌మ్మ సామాజిక వ‌ర్గం కుట్ర చేస్తుందంటూ ప్ర‌చారం చేయించారు. మ‌రీ దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. క‌రోనా స‌మ‌యంలో భార‌త్ బ‌యోటెక్ క‌రోనా వ్యాక్సిన్ క‌నుక్కుంటే దానిపైనా వారి పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. అది క‌రోనా వ్యాక్సిన్ కాదు.. క‌మ్మ వ్యాక్సిన్ అంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం వారి నీచబుద్ధికి పరాకాష్ట‌. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావునైతే ముప్పుతిప్ప‌లు పెట్టారు. కేవ‌లం క‌మ్మ కులానికి చెందిన వ్యక్తి అన్నఅక్క‌స్సుతోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. ఇది బహిరంగ ర హస్యమే.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుపై విమ‌ర్శ‌లు సైతం వ‌చ్చాయి. కానీ, అధికార బ‌లంతో అంద‌రి నోర్లు మూయించారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికితోడు ఆ పార్టీ కీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధికారంలో ఉన్నంత‌కాలం ప్ర‌తీరోజూ ఉద‌యం, సాయంత్రం క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని తిట్ట‌డ‌మే ఆయ‌న ప‌నిగా పెట్టుకున్నారు. ఏపీలో క‌మ్మోళ్లు ఎవ‌రూ బిజినెస్ లు చేసుకోవ‌ద్దు.. ఆ సామాజిక వ‌ర్గంవారు మీడియా సంస్థ‌లు న‌డ‌పొద్దు.. అస‌లు వారు రాష్ట్రంలో ఉండొద్దు అన్న‌ట్లుగా ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. వీరి వెకిలి చేష్ట‌ల‌ను భ‌రించ‌లేని ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ది చెప్పారు. వైసీపీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ఇవ్వకుండా..  మీ నిర్వాకం ఐదేళ్లు భరించాం. ఇక చాలు అంటూ ఓటుతో గుణపాఠం చెప్పారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు అనేక‌ సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ, ఏ సామాజిక వ‌ర్గాన్ని ఆయ‌న విమ‌ర్శించలేదు. చంద్ర‌బాబు హ‌యాంలో అన్ని సామాజిక వ‌ర్గాల వారికి మేలు జ‌రిగింది. అన్ని సామాజిక వ‌ర్గాల వారికి కీల‌క ప‌ద‌వులు ద‌క్కాయి. కానీ  జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా  ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో  క‌క్షా రాజ‌కీయాలు కొన‌సాగాయి. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. జ‌గ‌న్ క‌మ్మ సామాజిక వ‌ర్గంపై ఏవిధంగా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించారో పూసగుచ్చినట్లు వివ‌రించారు. వైసీపీ హయాంలో  తనకు జరిగిన అన్యాయాన్నీ, అవమానాలను వివరించారు.  

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ సొంత మీడియా  తనకు మాత్రమే సాధ్యమైన వక్రభాష్యంతో హైలైట్ చేసింది. నిజాల‌ను ఒప్పుకోకుండా ఏబీపై విమ‌ర్శ‌ల దాడిచేసింది. అలాగే, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్యాఖ్య‌లు చూసి ఎవ‌రైనా దాడుల‌కు దౌర్జ‌న్యాల‌కు దిగితే ప‌రిస్థితి ఏంటి అంటూ  బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీనికితో డు పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌నే డిమాండ్ ను కూడా  లేవ‌నెత్తింది. అయితే, జ‌గ‌న్ మీడియా గుర్తించాల్సిన అస‌లు విష‌యం మాత్రం ఇప్ప‌టికీ గుర్తించ‌డం లేదు. దీంతో వైసీపీ మీడియా తీరును  గురువింద సామెత‌ను గుర్తు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జ‌గ‌న్ మీడియా అన్న‌ట్లు కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసులు పెడితే.. మరి జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి, ఆ పార్టీలోని కొంద‌రి నేత‌ల‌పై ఎన్ని కేసులు పెట్టాలి..?  ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై కేసు పెట్టాల్సి వస్తే..గతంలో జగన్, విజయసాయి, ఇతర వైసీనీ నేతల వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలకు వారిని ఉరి తీయాల్సి ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా జరుగుతోంది.  కుల ప్ర‌స్తావ‌న తెచ్చిన ఏబీపై కేసులు పెట్టాల‌ని కోరిన జ‌గ‌న్ మీడియా.. మ‌రి జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డిపై ఏఏ కేసులు పెట్టాలో కూడా చెప్పాలంటూ నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.