కుటుంబం విశ్వసనీయత కోల్పోయిన జగన్.. బాబుపై నెపం నెట్టి ఏం ప్రయోజనం!

Publish Date:Feb 3, 2024

Advertisement

2019 ఎన్నికల సమయంలో అందరి వాడుగా ఉన్న జగన్.. అధికారం చేజిక్కించుకుని ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో అంటే 2024 ఎన్నికల సమయానికి వచ్చే సరికి కేవలం జగన్ గా మిగిలిపోయారు. అవును వైఎస్ కుటుంబం ఆయనకు దూరం అయిపోయింది. సొంత తల్లి, చెల్లే కాదు.. ఆయన బంధుగణం కూడా దాదాపుగా జగన్ కు దూరమైపోయింది. సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, సొంత పిన్ని కూడా ఆయనకు దూరమయ్యారు. వీరందరి అండతోనే జగన్  గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకోగలిగారు. నాడు కుటుంబంలో అందరి వాడుగా ఉన్న జగన్ ఇప్పుడు ఒంటరివాడుగా, అంటే ఏకాకిగా మిగిలిపోయారు. తన సుందర ముదనష్ట పాలనతో ప్రజలకు దూరమైన జగన్ తన అహంకారంతో కుటుంబాన్నీ దూరం చేసుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు సోదహరణంగా విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ మాత్రం తన వాళ్లే తనకు దూరం కావడానికీ, తనకు వ్యతిరేకంగా గళమెత్తడానికి కారణం తాను ఎంత మాత్రం కాదని చెప్పుకుంటున్నారు. తన పార్టీకి చెందిన సామాజిక మాధ్యమంలో, తన సొంత మీడియాలో అందుకు అనుగుణంగా కథనాలు వండి వారుస్తున్నారు.  

 గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేశారు.   రాజన్న రాజ్యం తీసుకు రావడం కోసం.. తన కుమారుడుకి ఒక్క చాన్స్ ఇవ్వండంటూ అంత వరకూ ఎన్నడూ రాజకీయాలలో ప్రవేశం లేని ఆయన తల్లి విజయమ్మ ప్రజల్లోకి వెళ్లీ మరీ విజ్జప్తి చేశారు. అలాగే  జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం తాను జగనన్న వదిలిన బాణాన్నంటూ  షర్మిల పాదయాత్రే కాదు.. బై బై బాబు అంటూ బస్సు యాత్ర కూడా చేశారు. బయటకు వచ్చి ప్రచారం చేయకపోయినా వైఎస్ వివేకా కుమార్తె కూడా జగన్ పక్కనే నిలబడ్డారు. తన సోదరుడు జగన్ సీఎం అయితేనే తన తండ్రి వివేకా హంతకులకు శిక్షపడుతుందని విశ్వసించారు. అంతే కాకుండా నాటి ఎన్నికలలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా జగన్ విజయం కోసం వ్యూహాలు రచించారు. ఎత్తుగడలు వేశారు. అయితే ఇప్పుడు ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి నాడు తన విజయానికి తోడ్పడిన వీరెవరూ జగన్ తో లేరు.  

అలాగే నాడు జగన్ కు సానుభూతి వెల్లువెత్తి విజయం సాధించేందుకు దోహదపడిన వివేహా హత్య కేసు, విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి కేసులు ఇప్పుడు రివర్స్ లో ఆయనకే ఎదురు తిరిగాయి. రెండు కేసుల్లోనూ కూడా జగన్ సీఎంగా వ్యవహరిస్తున్న తీరు ఆయన మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది.  ఆ రెండు కేసుల విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యానికి జగన్ తీరే కారణమని జనం కూడా నమ్ముతున్నారు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాని అంటున్నారు.  అన్నిటి కంటే ముఖ్యంగా వివేకా హత్య విషయంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని నిర్ద్వంద్వంగా తేలిపోవడమే కాకుండా, తీవ్ర ఆరోపణలకు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవడం కూడా జగన్ పై అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ కారణాల వల్లే జగన్ సొంత కుటుంబీకులకు కూడా కాని వాడుగా మారిపోయారు. 

ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథ్య బాధ్యతలు చేపట్టి సొంత అన్న దుర్మార్గాలపై గళం ఎత్తారు. అలాగే మరో సోదరి, సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత.. కడప గడ్డపై అన్న నిలబెట్టే లోక్ సభ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా రంగంలోకి దిగడం దాదాపు ఖరారైంది. అలాగే పిస్ని వైఎస్ సౌభాగ్యమ్మ కూడా ప్రచార రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ తాను ఒంటరి కావడానికి కారణం విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణమని చాటడం ద్వారా.. తమ ఫ్యామిలీలో ఏకాకిని అయిపోయానని స్వయంగా చెప్పుకుంటున్నారు. జగన్ తల్లీ, చెల్లీ, పిన్నీ, సోదరి ఇలా అందరూ ఆయనను వదిలేసి వెళ్లిపోయారు, వాళ్లు అందరూ చంద్రబాబ చెప్పినట్లు చేస్తున్నారు. ఆయన ఆడమన్నట్లు ఆడుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వండి వారుస్తున్న కథనాలు ఇప్పటికే పాతాళానికి చేరిన జగన్ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. 

By
en-us Political News

  
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.