మావిగన్.. పేరు ప్రచారానికే జగన్ పరిమితం.. వ్యూహమేంటో గందరగోళం.!

Publish Date:Jul 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ రాజధాని అని ప్రకటించడం రాజకీయాలలో సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది.  అయితే ఎవరూ మెచ్చని, ఎవరికీ నచ్చని మావిగన్ నినాదం ప్రతిపాదన వెనుక జగన్ వ్యూహం ఏమిటన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.  

మచిలీపట్నంలోని తొలి రెండు అక్షరాలు ఎమ్ఏ,  విజయవాడ లోని తొలి రెండు అక్షరాలు విఐ,  గుంటూరులోని తొలి మూడు అక్షరాలు జియుఎన్ లను తీసుకుని ఈ మూడు నగరాల కలయికే   మావిగన్ అంటున్నారు జగన్.  జగన్ గతంలో  జపించిన మూడు రాజధానుల జపానికి, అప్పటి ఆయన సిద్ధాంతానికి ఇప్పుడు ఆయన చెబుతున్న మావిగన్ కు  పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ మూడు రాజధానులు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మూడు ప్రాంతాలూ  వేర్వేరుగా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన మూడు నగరాల కలయిక రాజధాని అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ గతంలో తాను చెప్పిన వికేంద్రీకరణకు తిలోదకాలిచ్చేసి.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి  కొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చారు. అయితే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన.. మూడు రాజధానులని గతంలో ఆయన చెప్పిన దాని కంటే గందరగోళంగా, ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ప్రతిపాదిత మావిగన్ లో సచివాలయం ఎక్కడ ఉంటుంది? హైకోర్టు ఎక్కడ నిర్మిస్తారు? అసెంబ్లీ ఎక్కడ?   అన్నదానిపై జగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలా వివరాల జోలికి ఏ మాత్రం పోలేదు. ఈ మూడు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలు కనుక రాజధానిని చేసేస్తే అమరావతి అభివృద్ధి చేయనవసరంలేదు కదా అన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. 

అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. మరి జగన్ అధికారంలోకి వస్తే అమరావతిలో  ఉన్న  ఆ భవనాలనే వినియోగిస్తారా? లేక గతంలోలాగే అమరావతిని నిర్వీర్యం చేస్తారా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ ప్రశ్నలకు పరిశీలకులు భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు. ఇందుకు గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుపెట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు.  

అందుకే జగన్.. మావిగన్ విషయంలో  తన వ్యూహాన్ని మూడేళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటి వరకూ వెల్లడించే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఎందుకంటే.. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువస్తామని చెబితే.. అమరావతికి ప్రత్యామ్నాయం మావిగన్ అంటూ జగన్ చెప్పిన మాటలు అబద్ధాలు అవుతాయి. అలా కాకుండా, వాటిని వినియోగించం, పాడు పెడతాం, పక్కన పెడతాం అని జగన్ ప్రకటిస్తే..  ప్రజలు ఇప్పటి నుంచే జగన్ ను పక్కన పెట్టేయడం మొదలెడతారు. విఫలమైన మూడు రాజధానుల సిద్ధాంతాన్నే జగన్ పట్టుకు వెళాడుతున్నారన్న అభిప్రాయం ప్రజలలోకి బలంగా వెడుతుంది.  అందుకే.. జగన్ మావిగన్ ఏమిటో, ఆయన వ్యూహం ఏమిటో మరో మూడేళ్ల వరకూ వెళ్లడించకుండా.. మావిగన్ అన్న పేరును ప్రచారంలో ఉంచడానికే పరిమితమౌతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Teluguone, AP Capital Issue, Amaravati vs MAVIGUN, YS Jagan Mohan Reddy

By
en-us Political News

  
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.