తొందరపడి ఓ కోయిలా ముందే కూస్తోందా?.. ప్లీనరీ వేదికగా జగన్ అభ్యర్థుల ప్రకటన

Publish Date:Jun 21, 2022

Advertisement

వైసీపీ ప్లీనరీ వేదికగా జగన్ సంచలన ప్రకటన చేయబోతున్నారా? అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే ఆ సంచలన ప్రకటనా అంటే పార్టీ శ్రేణులు ఔననే అంటున్నాయి. ఒక వైపు ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటూనే.. మరో వైపు విపక్షాలపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు, ప్రణాళికలకు పదును పెడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్లీనరీ వేదికగా సంచలన ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల బరిలో నిలిపే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను పార్టీ ప్లీనరీ వేదికగా జగన్ ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

నిజానికి జగన్ ఈ ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పార్టీ పదవులు ఖరారు చేయడంతో పాటు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎమ్మెల్యేలను జనంలోకి పంపారు. అది విఫలమయ్యేసరికి సామాజిక న్యాయభేరి అంటూ మంత్రుల బస్సుయాత్ర చేయించారు. అదీ విఫలమైనా జగన్ తగ్గేదేలే? అన్నట్లుగా పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.

మళ్లీ అధికారమే లక్ష్యంగా  ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ జగన్ సింగిల్ పాయింట్ అజెండాతో ఎన్నికలకు, కొత్త ఎత్తులతో కదులుతున్నారు.  ఇప్పుడెలా ఉన్నా.. ఎన్నికల సమయానికి జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ- జనసేన ఏకం అవుతాయని వైసీపీ భావిస్తోంది. ఎన్నికలకు తాము సిద్ధమని చెబుతూనే.. వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించి, ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో కూడా  ఇడుపులపాయ వేదికగా ఒకేసారి ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాను జగన్ ప్రకటించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై పలు కోణాల్లో నియోజకవర్గాల్లోని ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు.

ప్రజలు, పార్టీ పట్ల వారి పనితీరు, వచ్చిన నివేదికల ఆధారంగా మార్కులు కేటాయిస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని టిక్కెట్ల ఖరారులో తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల భోగట్టా.  ఎన్నికలకు ఆరు నుంచి 10 నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించేందుకు జగన్  ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారనీ,  తద్వారా అభ్యర్ధులను ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గర చేసి,   ఎన్నికల సమయానికి వారు ప్రజలతో   మమేకం అయ్యేలా చూడాలన్నదే జగన్ వ్యూహమని అంటున్నారు. దీంతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచటంతో పాటు టిక్కెట్లు ఎవరికో తేల్చేయటం ద్వారా అభ్యర్ధులకు ప్రచారానికి, ప్రజలకు దగ్గరవ్వటానికి తగినంత సమయం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు.

ఈ సారి టిక్కెట్లు ఇవ్వలేకపోయే వారికి ముందుగానే స్పష్టత  ఇచ్చి వారి సేవలను ఎన్నికల వేళ పార్టీకి వినియోగించుకోవటం, పార్టీ అధికారంలోకి వస్తే కీలక బాధ్యతలు ఇచ్చేలా ముందస్తు హామీ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు   వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్లీనరీ వేదికగా వచ్చే ఎన్నికలపైన కీలక ప్రకటనతో పాటు 2019 ఎన్నికల హామీలు, 2024లో చేయబోయే కార్యక్రమాలపైన ముందుగానే జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

 అయితే 2019 ఎన్నికలలో జగన్ పార్టీ విపక్షంలో ఉందనీ, అప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆ పార్టీ అధికారం చేపట్టలేదనీ.. అందుకే అభ్యర్థుల జాబితాను ఒకే సారి ముందుగానే ప్రకటించినా అసమ్మతి, అసంతృప్తి బెడద పెద్దగా లేదనీ, ఇప్పుడలా కాదనీ, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణతో పార్టీలో భగ్గు మన్న అసమ్మతిని గమనిస్తే.. ప్లీనరీ వేదికగా జగన్ అభ్యర్థుల జాబితా ప్రకటించడమంటూ జరిగితే.. పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా ఎగసి పడటం ఖాయమనీ.. అప్పుడు ముందే కూసిన కోయిలలా జగన్ చిక్కుల్లో పడటం ఖాయమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తి బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పార్ల‌మెంటు హాలులో గురువారం ఉదయం క‌లిసిన లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.