అబ‌ద్ధాల ఆస్కార్ జ‌గ‌న్‌దే.. శాలువా క‌ప్పి స‌న్మానించాల్సిందే!

Publish Date:Nov 29, 2024

Advertisement

నేను రాష్ట్రానికి మంచి చేశా.. త‌క్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశా.. అందుకు నాకు శాలువా క‌ప్పి స‌న్మానం చేయాలి.. గొప్ప‌గా పొగ‌డాలి.. అలా చేయ‌కుండా నాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిటి..? ఇవీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్య‌లు. ఒక‌ విధంగా చెప్పాలంటే.. మీడియా ముందు ఆయ‌న‌ క‌న్నీరు పెట్టుకున్నంత‌ ప‌నిచేశారు. దీంతో అయ్యో పాపం.. జ‌గ‌న్ ను ఇంత‌లా ఇబ్బంది పెడుతున్నారా అని ప్ర‌జ‌లు అనుకునేంత‌లా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న నాట‌కాన్ని మీడియా ముఖంగా పండించేశారు. వాస్త‌వంగా చెప్పాలంటే.. జ‌గ‌న్ కు ఇలాంటి వ్య‌వ‌హారాల్లో చాలా అనుభ‌వ‌మే ఉంది. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలోనూ మాయ‌మాట‌ల‌తో త‌న ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకున్నారు. అయ్యో జ‌గ‌న్‌.. అయ్యో పాపం జ‌గ‌న్ అంటూ ప్ర‌జ‌లు   వైసీపీని అధికారంలోకి తెచ్చారు. ఆ త‌రువాత అర్ధ‌మైంది జ‌గ‌న్ అస‌లు రంగు. బాబాయ్ హ‌త్య కేసులో జ‌గ‌న్ ప్ర‌మేయంకూడా ఉంద‌న్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూర‌డంతో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి బుద్ధి చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు.. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌లకు ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నామ‌ని క‌న్నీరు పెట్టినంత ప‌నిచేశారంటే అయ్యో పాపం అంటూ నిజానిజాలు తెలుసుకోకుండా వారి వైపుకు వెళ్లిపోతారు. వారిలోని ఆ వీక్‌నెస్ నే జ‌గ‌న్ గట్టిగా ప‌ట్టుకున్నాడు. అదానీ వ్య‌వ‌హారంలో త‌న ప్రేమ‌యం ఉన్న‌ట్లు ఆధారాల‌తో రుజువు అయిన తరువాత కూడా జ‌గ‌న్   న‌న్ను ఇబ్బంది పెడుతున్నారు.. న‌న్ను విమ‌ర్శిస్తున్నారు అంటూ ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేశారు.  

అస‌లు విష‌యంలోకి వెళితే..  గౌత‌మ్‌ అదానీ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సెకితో ఒప్పందంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అదానీ నుంచి రూ.1,750 కోట్ల లంచం అందిందని ఎఫ్‌బీఐ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ అమెరికాలో కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించాయి. ఈ విష‌యంపై గ‌త వారం రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  కూట‌మి పార్టీల నేత‌లు జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం తాను  మంచి ప‌నే చేశాను, అందుకు నన్న  స‌న్మానించాలి అంటూ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న‌వారు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. అమెరికా సంస్థ‌ల నివేదిక‌ల్లో తన పేరు ఎక్కడ ఉందో చేపమంటూ   మీడియా ముఖంగా జ‌గ‌న్‌ ప్ర‌శ్నించారు.  దీంతో.. త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నం  చేస్తున్నారని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. ఎందుకంటే.. సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ (ఎస్ఈసీ) నివేదిక చూస్తే జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న ఉంద‌ని ఎవ‌రికైనా అర్ధ‌మ‌వుతుంది. కానీ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా.. కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌పై బుర‌ద జ‌ల్లేందుకు ఇలా చేస్తుంద‌న్న‌ట్లుగా క్రియేట్ చేసేలా మీడియా ముఖంగా జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేశారు. అదే విష‌యాన్ని త‌న సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ప‌దేప‌దే ప్ర‌చారం చేయించారు. అయితే, ఎప్ప‌టికైనా నిజ‌మే గెలుస్తుంద‌ని జ‌గ‌న్ ఇంకా గుర్తించ‌కపోవటం ఆయన అవివేకమే అని చెప్పాలి.

ఎస్ఈసీ నివేదిక‌లో ఏముంద‌న్నది ఒక సారి ప‌రిశీలిస్తే.. అదానీ విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి పాయింట్ల వారిగా నివేదిక‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వ‌ర‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయం గురించి ప్ర‌స్తావించారు. అంటే ఇక్క‌డ జ‌గ‌న్ పేరును మెన్ష‌న్ చేయ‌లేదు.. కేవ‌లం ఏపీ ముఖ్య‌మంత్రి అని మాత్ర‌మే మెన్ష‌న్ చేశారు. 2021 ఆగ‌స్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని గౌత‌మ్ అదానీ వ్య‌క్తిగ‌తంగా క‌లిశాకే విద్యుత్ స‌ర‌ఫ‌రా ఒప్పందం ముందుకు క‌దిలింద‌ని స్ప‌ష్టంగా వివ‌రించారు. లంచం సొమ్ము సుమారు 200 మిలియ‌న్ డాల‌ర్లుగా.. అదానీ గ్రీన్స్ అంత‌ర్గ‌త రికార్డుల ద్వారా తెలుస్తోంద‌ని పేర్కొంది. ముఖ్య‌మంత్రిని క‌లిసి లంచం ఇస్తామ‌ని మాట ఇచ్చాకే సెకి ద్వారా అదానీ గ్రీన్‌, అజూర్ నుంచి విద్యుత్ కొంటామ‌ని స‌మాచారం ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఆ త‌రువాత సెకి ఆఫ‌ర్‌ను అంగీక‌రిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని తేల్చిచెప్పింది.

అయితే, ఇక్క‌డ ఆశ్చ‌ర్య క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో తన పేరు ఎక్కడా లేదని చెప్పుకున్నారు.  అంతేకాదు.. తనపేరు ఉన్న‌ట్లు త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్న మీడియా సంస్థ‌ల‌పైన ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటూ హెచ్చ‌రిక‌లు  జారీ చేశాడు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లను చూసి వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 2021లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అదానీ భేటీ అయ్యారని అంద‌రికీ తెలిసిన విష‌యమే. అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అని ప్ర‌స్తావించారు. అప్ప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాదా ? తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో లేను అని జగన్ ప్రజలకు చెప్పదలచుకున్ానరా?   ఇంతగా బ‌రి తెగించి జ‌గ‌న్ పచ్చి అబ‌ద్దాలు అడుతుండ‌టంతో వైసీపీ నేత‌లు సైతం చీద‌రించుకుంటున్నారు. జ‌గ‌న్ త‌న‌తీ రును మార్చుకోక‌పోతే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లే అంటున్నారు. 

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.