అబ‌ద్ధాల ఆస్కార్ జ‌గ‌న్‌దే.. శాలువా క‌ప్పి స‌న్మానించాల్సిందే!

Publish Date:Nov 29, 2024

Advertisement

నేను రాష్ట్రానికి మంచి చేశా.. త‌క్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశా.. అందుకు నాకు శాలువా క‌ప్పి స‌న్మానం చేయాలి.. గొప్ప‌గా పొగ‌డాలి.. అలా చేయ‌కుండా నాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిటి..? ఇవీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్య‌లు. ఒక‌ విధంగా చెప్పాలంటే.. మీడియా ముందు ఆయ‌న‌ క‌న్నీరు పెట్టుకున్నంత‌ ప‌నిచేశారు. దీంతో అయ్యో పాపం.. జ‌గ‌న్ ను ఇంత‌లా ఇబ్బంది పెడుతున్నారా అని ప్ర‌జ‌లు అనుకునేంత‌లా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న నాట‌కాన్ని మీడియా ముఖంగా పండించేశారు. వాస్త‌వంగా చెప్పాలంటే.. జ‌గ‌న్ కు ఇలాంటి వ్య‌వ‌హారాల్లో చాలా అనుభ‌వ‌మే ఉంది. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలోనూ మాయ‌మాట‌ల‌తో త‌న ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకున్నారు. అయ్యో జ‌గ‌న్‌.. అయ్యో పాపం జ‌గ‌న్ అంటూ ప్ర‌జ‌లు   వైసీపీని అధికారంలోకి తెచ్చారు. ఆ త‌రువాత అర్ధ‌మైంది జ‌గ‌న్ అస‌లు రంగు. బాబాయ్ హ‌త్య కేసులో జ‌గ‌న్ ప్ర‌మేయంకూడా ఉంద‌న్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూర‌డంతో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి బుద్ధి చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు.. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌లకు ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నామ‌ని క‌న్నీరు పెట్టినంత ప‌నిచేశారంటే అయ్యో పాపం అంటూ నిజానిజాలు తెలుసుకోకుండా వారి వైపుకు వెళ్లిపోతారు. వారిలోని ఆ వీక్‌నెస్ నే జ‌గ‌న్ గట్టిగా ప‌ట్టుకున్నాడు. అదానీ వ్య‌వ‌హారంలో త‌న ప్రేమ‌యం ఉన్న‌ట్లు ఆధారాల‌తో రుజువు అయిన తరువాత కూడా జ‌గ‌న్   న‌న్ను ఇబ్బంది పెడుతున్నారు.. న‌న్ను విమ‌ర్శిస్తున్నారు అంటూ ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందే ప్ర‌య‌త్నం చేశారు.  

అస‌లు విష‌యంలోకి వెళితే..  గౌత‌మ్‌ అదానీ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చకు కారణమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సెకితో ఒప్పందంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అదానీ నుంచి రూ.1,750 కోట్ల లంచం అందిందని ఎఫ్‌బీఐ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ అమెరికాలో కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించాయి. ఈ విష‌యంపై గ‌త వారం రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  కూట‌మి పార్టీల నేత‌లు జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం తాను  మంచి ప‌నే చేశాను, అందుకు నన్న  స‌న్మానించాలి అంటూ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న‌వారు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి.. అమెరికా సంస్థ‌ల నివేదిక‌ల్లో తన పేరు ఎక్కడ ఉందో చేపమంటూ   మీడియా ముఖంగా జ‌గ‌న్‌ ప్ర‌శ్నించారు.  దీంతో.. త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నం  చేస్తున్నారని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. ఎందుకంటే.. సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ (ఎస్ఈసీ) నివేదిక చూస్తే జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న ఉంద‌ని ఎవ‌రికైనా అర్ధ‌మ‌వుతుంది. కానీ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేలా.. కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న‌పై బుర‌ద జ‌ల్లేందుకు ఇలా చేస్తుంద‌న్న‌ట్లుగా క్రియేట్ చేసేలా మీడియా ముఖంగా జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేశారు. అదే విష‌యాన్ని త‌న సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ప‌దేప‌దే ప్ర‌చారం చేయించారు. అయితే, ఎప్ప‌టికైనా నిజ‌మే గెలుస్తుంద‌ని జ‌గ‌న్ ఇంకా గుర్తించ‌కపోవటం ఆయన అవివేకమే అని చెప్పాలి.

ఎస్ఈసీ నివేదిక‌లో ఏముంద‌న్నది ఒక సారి ప‌రిశీలిస్తే.. అదానీ విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి పాయింట్ల వారిగా నివేదిక‌లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 80వ పాయింట్ నుంచి 84వ పాయింట్ వ‌ర‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మేయం గురించి ప్ర‌స్తావించారు. అంటే ఇక్క‌డ జ‌గ‌న్ పేరును మెన్ష‌న్ చేయ‌లేదు.. కేవ‌లం ఏపీ ముఖ్య‌మంత్రి అని మాత్ర‌మే మెన్ష‌న్ చేశారు. 2021 ఆగ‌స్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిని గౌత‌మ్ అదానీ వ్య‌క్తిగ‌తంగా క‌లిశాకే విద్యుత్ స‌ర‌ఫ‌రా ఒప్పందం ముందుకు క‌దిలింద‌ని స్ప‌ష్టంగా వివ‌రించారు. లంచం సొమ్ము సుమారు 200 మిలియ‌న్ డాల‌ర్లుగా.. అదానీ గ్రీన్స్ అంత‌ర్గ‌త రికార్డుల ద్వారా తెలుస్తోంద‌ని పేర్కొంది. ముఖ్య‌మంత్రిని క‌లిసి లంచం ఇస్తామ‌ని మాట ఇచ్చాకే సెకి ద్వారా అదానీ గ్రీన్‌, అజూర్ నుంచి విద్యుత్ కొంటామ‌ని స‌మాచారం ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. ఆ త‌రువాత సెకి ఆఫ‌ర్‌ను అంగీక‌రిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని తేల్చిచెప్పింది.

అయితే, ఇక్క‌డ ఆశ్చ‌ర్య క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో తన పేరు ఎక్కడా లేదని చెప్పుకున్నారు.  అంతేకాదు.. తనపేరు ఉన్న‌ట్లు త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్న మీడియా సంస్థ‌ల‌పైన ప‌రువు న‌ష్టం దావా వేస్తానంటూ హెచ్చ‌రిక‌లు  జారీ చేశాడు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లను చూసి వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. 2021లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో అదానీ భేటీ అయ్యారని అంద‌రికీ తెలిసిన విష‌యమే. అమెరికా సంస్థ‌ల నివేదిక‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అని ప్ర‌స్తావించారు. అప్ప‌ట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాదా ? తాను ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవిలో లేను అని జగన్ ప్రజలకు చెప్పదలచుకున్ానరా?   ఇంతగా బ‌రి తెగించి జ‌గ‌న్ పచ్చి అబ‌ద్దాలు అడుతుండ‌టంతో వైసీపీ నేత‌లు సైతం చీద‌రించుకుంటున్నారు. జ‌గ‌న్ త‌న‌తీ రును మార్చుకోక‌పోతే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లే అంటున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.