Publish Date:Dec 27, 2019
ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన చోట మౌనదీక్ష చేపట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేశారు కన్నా.సీడ్ క్యాపిటల్ ఇక్కడే ఉండాలన్న తమ విధానం తెలియజేశామని.. మళ్లీ గంట గంటకు విధానాన్ని తెలియ జేయటానికి తానేమి చంద్రబాబునాయుడు,జగన్ మోహన్ రెడ్డిని కాదని ఆయన మండిపడ్డారు.తమ పార్టీ విధానాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరిస్తామన్న ఆయన తెలియజేశారు.
గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాజధాని రైతులను మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా క్యాపిటల్ ను అమ్మేసి కుట్ర చేస్తోందని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మనారాయణ. చంద్రబాబు నాయుడు రాజధాని భూములను స్వర్గంగా చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని కాలయాపన చేశారన్నారు. అవినీతికి అనుకూలంగా లేదని.. ముంపు ప్రాంతం అని చూపించి ఏకంగా రాజధానిని అమ్మటానికే కుట్ర చేస్తున్నట్లు కన్నా ఆరోపించారు.
క్యాబినెట్ నిర్ణయం తీసుకోకముందే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఆయన స్పందించారు. కుట్ర పూరితమైన ఆలోచనతో భేటి జరుగుతుందన్నారు. క్యాపిటల్ ఉండగా దీని పై జీఎన్ రావ్ కమిటీ వేయడం.. ఆ కమిటి పూర్తయ్యి నిర్ణయం రాక ముందే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడతారని విజయసాయి ప్రకటనలు చేయడంపై ఆయన మండిపడ్డారు. కాబినెట్ మీటింగ్ నిర్ణయాలు రాక ముందే నిన్న వాళ్ల పార్టీ ఎంపీ విశాఖపట్నంలో పండగలు చేసుకోటం ఇవన్నీ చూస్తుంటే ఒక కుట్రపూరితమైన చర్యలు తప్ప అంతకు మించి ఏమి జరగట్లేదని కన్నా మండిపడ్డారు.క్యాబినెట్ నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-inteligence-on-babu-25-92620.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.