మళ్లీ గెలిపిస్తే ఆర్నెళ్లలో అద్దం లాంటి రోడ్లు.. జగన్ హామీ జనం నమ్మేస్తారనే?

Publish Date:Feb 26, 2024

Advertisement

జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఇవ్వడానికి వేరే హామీలేవీ లేవు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్దానాలలో  పూర్తిగా నెరవేర్చిన హామీ ఒక్కటీ లేకపోవడమే. ఇప్పుడు ఆయన మరో చాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన గత ఐదేళ్లలో హామీల అమలులో విఫలమయ్యాను.. ఈ సారి ఎన్నుకుంటే ఆ హామీలన్నిటినీ ఆరంటే ఆరు నెలల్లో నెరవేర్చి చూపుతాను అంటూ కొత్త పాట మొదలు పెట్టడానికి రెడీ అయిపోయారు. 

సరే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించడం కంటే ముందు.. ఈ ఐదేళ్లలో ఆయన హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల వారు సైతం సెటైర్లు వేసేంత దుస్థితిలో  ఏపీలో రోడ్ల పరిస్థితి ఉంది. గుంతలలో పడి ఎన్ని ఆర్టీసీ బస్సుల చక్రాలు ఊడి రోడ్ల పక్కకు దౌడు తీశాయో లెక్క లేదు. ఎన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బంది బస్సులను నడపలేం అంటూ చేతులెత్తేశారో చెప్పడం కూడా సాధ్యం కాదు. రోడ్ల దుస్థితి కారణంగా జరిగిన ప్రమాదాలలో మరణించిన వారు, క్షతగాత్రులైన వారి సంఖ్య లెక్కపెట్టడమే సాధ్యం కాదు. 

రోడ్లు బ్రహాండంగా ఉన్నాయని ప్రభుత్వం ఎంతగా సొంత బాకా ఊదుకుందామని ప్రయత్నించినా ఫలితం లేని విధంగా సామాజిక మాధ్యమంలో రోడ్ల దుస్థితిపై వీడియోలు ప్రత్యక్ష సాక్షాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రతి ఐదారు నెలలకూ రాష్ట్రంలో రోడ్లపై సమీక్ష చేసే జగన్ ప్రతి సమీక్షలోనూ,  ఆరు నెలల్లో రాష్ట్రం అంతటా గుంతలు లేని రోడ్లే ఉండాలంటూ ఆదేశాలు ఇవ్వడం, అంతే మళ్లీ ఆరు నెలల వరకూ ఆ ఊసే ఎత్తక పోవడం రివాజుగా మారిపోయింది. ఇక ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎవరినీ మభ్య పెట్టడానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది. వచ్చే ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే సమయం ఆసన్నమైపోయింది. ఆ తరువాత సమీక్షలు చేయడానికి వీలుండదు. ఇప్పటికిప్పుడు సమీక్షలు పెట్టుకుని రోడ్లు బాగు చేసేశామనో, చేసేస్తామనో చెప్పినా జనం నమ్మేందుకు సిద్ధంగా లేరు. దీంతో జగన్ వాస్తవాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సారి విఫలమయ్యాను, కానీ మరో చాన్స్ ఇచ్చి చూడండి ఆరు నెలల్లో గుంతలు లేని నున్నటి రోడ్లు నిర్మించి చూపిస్తానని జనాన్ని నమ్మించేయడానికి రెడీ అయిపోయారు. అలా చెబితే నమ్ముతారన్న వెర్రినమ్మకం ఆయనలో ఎక్కడ నుంచి వచ్చిందా అని పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సారి నున్నటి రోడ్లు అంశాన్ని మేనిఫెస్టోలో పెడతానని చెబుతున్నారు. అసలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకే ఈ ఐదునెలల్లో దిక్కూ దివాణం లేదనీ, అటువంటిది వచ్చే ఎన్నికలలో రోడ్ల ను అద్దంలా చేస్తాను అంటే మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రన జనం ఎలా నమ్ముతారని పరిశీలకులు అంటున్నారు. గత ఐదేళ్లలో రోడ్ల లీటర్ పెట్టోల్, డిజిల్ పై అదనంగా రోడ్ల నిర్వహణ కోసం అని రూపాయి చొప్పున అదనంగా వసూలు చేసి చేసిందేమిటన్న ప్రశ్నకే సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్న జగన్, అలా అదనంగా రోడ్ల కోసం అంటూ వసూలు చేసిన సొమ్ములను కూడా అరకొర పందేరాల పేరిట వాడేశారు. అలాగే నిబంధనలను తుంగలోకి తొక్కి తీసుకువచ్చిన కోట్లకు కోట్ల రుణాలు, చెత్త నుంచి మొదలు పెట్టి అయిన దానికీ కాని దానికీ కూడా వసూలు చేసిన పన్నులు ఇలా అసలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సోమ్ముకూ, తీసుకువచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేకుండా చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గెలిస్తే రోడ్లను మరమ్మతు చేయిస్తానంటూ చెప్పడంపై నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. మళ్లీ జనాలను మోసం చేయగలరా అని సవాల్ సైతం చేస్తున్నారు.

రోడ్ల పేరు చెప్పి  బ్యాంకులు.. అంతర్జాతీయ. సంస్థల నుంచి దొరికినంత అప్పు చేసి ఆ సోమ్ములనూ దారి మళ్లించేశారు. దీంతో మరో సారి రోడ్ల పేరు చెబితే పైసా అప్పు కూడా పుట్టే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఎన్నికలకు సిద్ధం అన్న నోటితోనే ఆరు నెలల్లో రోడ్లను అద్దంగా మారుస్తామంటూ చెప్పడానికి సిద్ధం అయిపోతున్నారు జగన్.  

అసలు మౌలిక సదుపాయాల గురించి ఐదేళ్లలో ఏ మాత్రం పట్టించుకోని జగన్  సర్కార్ అదేమని అడిగిన వారికి మీకు ఉత్తినే డబ్బులు పంచుతున్నాం కదా అని ఎదురు ప్రశ్నించింది. వైసీపీ నేతలు అయితే జనం రోడ్ల కోసం నిలదీస్తే.. పధకాలు కావాలంటే మీకు సొమ్ములివ్వం జాగ్రత్త అంటూ బెదరించడానికి కూడా వెనుకాడలేదంటే వైసీపీ ఎంతగా బరితెగించేసిందో అర్ధమౌతోంది.  ఈ బరితెగింపును పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలోగా జగన్ ఆరునెలల్లో రోడ్లు వంటి ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ బరితెగింపుపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపేందుకు రెడీగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత సర్వేలతో సహా అన్ని సర్వేలూ అదే విషయాన్ని చెబుతున్నాయి. 

By
en-us Political News

  
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.