Publish Date:Dec 26, 2024
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం నుంచీ, గతంలో తాను చేసిన తప్పుల నుంచీ గుణపాఠం నేర్చుకోలేదు. అత్యంత అవమాన కరరీతిలో జనం ఆయన పార్టీని ఎన్నికలలో ఓడించిన తరువాత కూడా గతంలో చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు. దీంతో సొంత పార్టీ క్యాడర్ కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. నిరసన వ్యక్తం చేస్తున్నది. పులివెందులలో గురువారం (డిసెంబర్ 26) ఆయన నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన సొంత క్యాడర్ నుంచే నిరసన ఎదుర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో ఆయన పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు.
జగన్ పార్టీ కార్యకర్తలను విస్మరించడమే ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమని వైసీపీ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాన్ని ఓటమి తరువాత ఆయన దృష్టికీ తీసుకువెళ్లారు. అయితే జగన్ మాత్రం పార్టీ ఓటమికి తెలుగుదేశం కూటమి అసత్య ప్రచారం, ఈవీఎంల టాంపరింగే కారణమంటూ అస్మదీయుల హితవచనాలను పక్కన పెట్టేశారు. పార్టీ అధికారంలో ఉండగా ప్రజల దృష్టిలో భ్రష్టులుగా ముద్రపడిన గోరంట్ల మాధవ్ వంటి వారికి ఇప్పుడు పార్టీ పదవులు కట్టబెడుతూ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు పార్టీకి క్యాడర్ ను దూరం చేస్తున్నది. ఇందుకు రుజువుగా గురువారం (డిసెంబర్ 26) పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో పార్టీ క్యాడర్ ను కూడా జగన్ కలవడానికి సుముఖంగా లేరంటూ వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
జగన్ కు కలిసేందుకు పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఉదయం ఏడు గంటలకే పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వారికి ఆయన దర్శన భాగ్యం దక్కలేదు. వర్షాన్ని లెక్క చేయకుండా జగన్ ను కలసేందుకు తిండితిప్పలను కూడా విస్మరించి క్యూలైన్ లో వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ క్యాడర్ లో అసహనం పెల్లుబికింది. జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వైసీపీ కార్యకర్త జగన్ తీరుపై విమర్శలు గుప్పించడం పార్టీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఎంత అసహనంతో ఉన్నారో తేటతెల్లం చేసంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-ignore-party-cadre-39-190372.html
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.