జగన్ వేట.. టీడీపీ నేతలకు గాలం..?
Publish Date:Aug 27, 2022
.webp)
Advertisement
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో వైసీసీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారట.. వివిధ సర్వే నివేది కలను సమీక్షించిన తర్వాత ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లోని అధిక శాతం మందికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న టీడీపీ నేతలకు గాలం వేయడానికి జగన్ స్కెచ్ వేశారట. తన ఇమేజ్ తోనే ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని కలలు గన్న జగన్ ఇలా ఎందుకు టీడీపీ నేతల వైపు చూస్తున్నారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఫ్యాన్ గాలికి తిరుగే లేదని ఇంతకాలం ఊహల్లో విహరించిన జగన్.. ఇప్పుడు వాస్తవ పరిస్థితిని గుర్తించక తప్పలేదంటున్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే రీతిలో కళ్లు ఆకాశం వైపు చూసిన వైసీపీ అధి నేతకు ఇప్పుడు బొమ్మ కనిపించి.. దిమ్మదిరిగి.. అవే కళ్లు బైర్లు కమ్మి.. టీడీపీ నేతలకు ఎర వేయడానికి రెడీ అయ్యారంటున్నారు.
ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జనంలో మంచి పట్టు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతలను జిల్లాకు ముగ్గురు, నలుగురు చొప్పున వైసీపీలో చేర్చుకోవాలని జగన్ తహతహలాడుతున్నారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగితే.. వారికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా.. తాను చూసుకుంటానని తన పార్టీలో చేరితే చాలని టీడీపీ నేతలకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమా చారం. అయితే.. ఈ పనికి చేసేందుకు వైసీపీ నేతలను కాకుండా తనకు వ్యక్తిగత పరిచయాలున్న ఇతర నేతలను జగన్ ప్రయోగిస్తుండడం గమనార్హం. ఏమాత్రం ఈ సమాచారం లీకైనా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని.. జగన్ తానే స్వయంగా ఈ పని చేసుకుంటున్నారట.
జగన్ చేయించుకున్న సర్వేలో వైసీపీ మునిగిపోతున్నదని, ఇప్పుడున్న సీట్లలో సుమారు వందకు పైనే అడ్రస్ గల్లంతవుతాయని నివేదికల సారాంశంగా ఉందంటున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చేటపుడు స్థానికంగా తప్పకుండా గెలిచే టీడీపీ నేతలను తెచ్చుకోవాలని ప్రశాంత్ కిశోర్ టీమ్ జగన్ కు సలహా ఇచ్చిందట. అందుకోసం జగనే స్వయంగా టీడీపీ నుంచి నేతల ఆకర్ష్ ప్రారంభించారట. జగన్ నేరుగా రంగంలోకి దిగి, ‘క్యాష్ ఫ్రీ టిక్కెట్ పక్కా’ అంటూ హామీలు ఇస్తున్నారని సమాచారం.
కరోనా అనంతరం జగన్ బండారాన్బి ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్క.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో పక్కన చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్లడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే సొంత పార్టీ నేతలకు తెలియకుండా తానే స్వయంగా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న టీడీపీ నేతలను నేరుగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఈ మధ్యనే కొందరు రాయలసీమ టీడీపీ నేతలను జగన్ టచ్ చేశారని సమాచారం.
నిజానికి రాయలసీమ ప్రాంతతో పాటు ప్రకాశంజిల్లా వరకు వైసీపీకి మంచి పట్టే ఉంది. అయితే ఇక్కడ చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం పసిగట్టిన జగన్ ముందు రాయలసీమలో, ప్రకాశంజిల్లాల్లో చక్కదిద్దితే ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా పడుతుం దని స్కెచ్ వేశారట. అయితే జగన్ ప్రతిపాదనపై కొందరు టీడీపీ నేతలు సరిగా స్పందించ లేదట. దీంతో ఆ టీడీపీ నేతల వారసుల నుండి వత్తిడి తెచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాలనపై దృష్టి సారించకుండా ఇలా విపక్షంలోని నేతల కోసం పరుగులు తీయడాన్ని చూస్తుంటే.. జగన్ కు ఓటమి భయం పట్టుకుందనే అంచనాలు వస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-hunt-for-tdp-leaders-25-142745.html












