అప్పుల కోసం చట్టాలకు తూట్లు   జగన్ సర్కార్ కొత్త ఎత్తులు

Publish Date:Nov 27, 2021

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్  ప్రభుత్వం అన్ని  గీతలు  దారేసింది. ఆర్హతకు, ఆదాయానికి  మించి అప్పులు చేసింది. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి మిగల కుండా అన్ని అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకుంది. అలా అప్పుపుట్టే దారులన్నీ ఇంచుమించుగా మూసుకు పోయాయి . మరో వంక అప్పు లేకుండా పూట గడిచే మార్గం లేదు.ఇలాంటి పరిస్థితిలో మాములుగా అయితే ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క మార్గం చేతులు ఎత్తేయడం.అంతకు మించి మరో మార్గం లేదని ఆర్థిక నిపుణులు ఎప్పుడోనే ఒక నిర్ణయానికి వచ్చారు.  అవును కేవలం ఆర్ధిక శాస్త్రం మాత్రమే చదువుకున్న,ఆర్థిక రంగ నిపుణులకు, చట్టాలు మాత్రమే తెలిసి వాటి ఉల్లంఘన మార్గాలు తెలియని అధికారులకు చేతులు ఎత్తేయడం సహజం. వారికి అది మినహా మరో మార్గం కనిపించక పోవచ్చును.  కానీ, రవి గాంచనిచో కవి గాంచున్’ అన్నట్లుగా ఆర్థిక రంగ నిపుణలకు కనిపించని ఆప్పు దారులు,అక్రమ మార్గాలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వారి బృందం దివ్య నేత్రాలకు కనిపిస్తాయి కావచ్చును.. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పుకు మరో కొత్త మార్గాన్ని కనుగొంది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీల పరిమితిని ఏకంగా రెట్టింపు చేసుకుంటూ చట్టాన్ని సవరించింది.  

అదికూడా ఓ వంక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర సర్కారు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని లెక్క తేల్చిన రోజునే మరో లక్ష కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు ‘కల్పించుకుంటూ’ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.నిజానికి ‘కాగ్’ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభ నియంత్రన దాటిపోయే, స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు అడ్డదారులు తొక్కాయని తప్పు పట్టింది. బడ్జెట్’లో చూపకుండా చేస్తున్నఖర్చులు, అందుకోసం చేస్తున్న అప్పులు కొండలా పెరిగిపోతున్నాయని అక్షింతలు వేసింది.వచ్చే ఏడేళ్లలో ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పు చెల్లించవలసి ఉంటుందన్న కాగ్, అప్పు తీర్చడానికి కొత్త అప్పులు చేయడం ఏమిటని విస్మయాన్ని ప్రకటించింది. 

అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం కాగ్’ ఏమి చెప్పిందన్న విషయాన్ని పక్కన పెట్టి కొత్త కొత్త ఇన్నోవేటివ్ పద్దతుల్లో అప్పులు చేస్తోంది. కేంద్రంతో సంబంధం లేకుండానే,చట్టాలను  సవరించి కొత్త అప్పులకు సిద్దమవుతోంది. నిజానికి కేంద్రం రూపొందించిన గ్యారెంటీ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం  రూ.5600 కోట్ల రుణానికి మాత్రమే హామీ ఇవ్వగలదు. కానీ... ఇప్పటికే ఇంచుమించుగా అంతకు రెట్టింపు రూ.1,10,000 కోట్లకు గ్యారెంటీ ఇచ్చింది .ఇది కూడా సరిపోదని ఇప్పుడు చట్టాన్ని సవరించింది. మరో రూ.లక్ష కోట్లకు హామీ చ్చేందుకు వీలుగా ప్రభుత్వం సభలో ఉన్నబలంతో చట్టాని సవరించింది. అయితే, ఇలా సవరించిన చట్టం చెల్లుతుందా, అంటే, ప్రభుత్వ వైఖరి  నిండా మునిగిన వణికి చలేమిటి అన్నట్లుగా ఉందని అధికారులు అంటున్నారు. 

అయితే ఇలా వంద రూపాయల విలువైన వస్తువును కుదువ పెట్టి రూ.200 అప్పు తీసుకోవడం మాములుగా అయితే కుదిరే వ్యవహారం కాదు. కానీ, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.3,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చిన జగన్‌ ప్రభుత్వానికి మాత్రం సాధ్యం కావచ్చని, అయితే ఇలా అడ్డ దారుల్లో తెచ్చిన అప్పులు  చివరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను  ఏ అధః పాతాళానికి తీసుకుపోతాయో మాత్రం చెప్పలేమని ఇటు అధికారులు, అటు ఆర్థిక రంగ నిపుణులు  అంటున్నారు.

By
en-us Political News

  
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.