ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్ ఫండ్స్  కూడా హాంఫట్ 

Publish Date:Dec 20, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్ను ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి (పీఎఫ్) ఫై పడింది. ఒకసారి ప్రభుత్వం కన్నుపడింది అంటే ఇంకేముంది, అంతే సంగతులు. అందుకు నడుస్తున్న చరిత్రే సాక్ష్యం. అందుకే కావచ్చు, ఆర్టీసీ పీఫ్ ఖాతాలోని రూ.1600 కోట్లను, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని ప్రభుత్వం కోరినా ఆర్టీసీ యాజమాన్యం నడుకు అందుకు అంగీకరించ లేదని సమాచారం. 

నిజానికి, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నిదులను సర్కార్ ఖాతాలో వేసుకునే కత్తిరింపు కార్యక్రమం  ఒక్క ఎపీఎస్ ఆర్టీసీకి పరిమితం అయిన కార్యక్రమం కాదు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల డిపాజిట్లు ఏ బ్యాంకులో ఉన్నా, తక్షణం  స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని ఎప్పుడోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రక్రియలో భాగంగా  ఇప్పుడు ఎపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల ఖాతా మీద సర్కార్ నజర్ పడినట్లు తెలుస్తోంది. అయితే, పీఎఫ్ నిధులను దారి మళ్లించడం కుదరదని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దేశిత పథకాలు, సంస్థల్లో మాత్రమే వీటిని పెట్టుబడులు పెట్టాలని, వాటిలోనే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. వీటికి లాక్‌ పీరియడ్‌ ఉంటుందని, మధ్యలో తీసేందుకు వీలుండదని యాజమాన్యం  స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  కానీ, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, ఎఫ్ఆర్బీఎం నిబంధనలనే మార్చేసిన, జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఎపీఎస్ ఆర్టీసీ పీఫ్ ఖాతా నిబంధనలను పక్కకు నేట్టేయడం పెద్ద పనా? అని ప్రభుత్వ అధికారులే ప్రశ్నిస్తున్నారు. పాటించే వారికి నిబంధనలు కానీ, పక్కన పెట్టే వారిని నిబంధనలు ఏమిచేస్తాయని, అంటున్నారు. 

ఉద్యోగుల పీఎఫ్‌ను సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా ట్రస్టు ఏర్పాటుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గతంలో మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (బేసిక్‌, డీఏ) నుంచి 12 శాతం ప్రతి నెలా రికవరీ చేస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం (ప్రస్తుతం ప్రభుత్వం) వాటాగా ఇస్తుంది. యాజమాన్య వాటా నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎఫ్‌-95 పింఛను పథకం కోసం ఈపీఎఫ్‌వోకు ఇస్తారు. మిగిలినదంతా ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టులోనే ఉంటుంది. ఇలా ట్రస్టులో ప్రస్తుతం పద్దుల ప్రకారం దాదాపు రూ.2 వేల కోట్లు ఉండాలి. గతంలో ఆర్టీసీ యాజమాన్యం జీతాల సర్దుబాటు సమయంలో పీఎఫ్‌ వాటాను ట్రస్టుకు సకాలంలో జమ చేయలేదు. వీటిని ఆర్టీసీ వాడుకుంది. ఈ మొత్తం రూ.850 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో కొంత కాలం కిందట ఆర్టీసీ రూ.450 కోట్లు ట్రస్టుకు జమ చేయగా, ఇంకా రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పీఎఫ్‌ ట్రస్టులో ప్రస్తుతం రూ.1,600 కోట్లు ఉన్నాయి. ఈ రూ.1,600కోట్లపైనే, ప్రభుత్వం కన్ను పడింది. ఆ మొత్తాని ఎదో ఓకే విధంగా స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయగలిగితే, ఇక ఆ తర్వాత కథ తర్వాత అన్నట్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

అయితే, ఇలా ముందు వెనకా చూసుకోకుండా, పభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నిధులను దారి మళ్లించడం వలన, భవిష్యత్ లో చాలా చాలా చిక్కు సమస్యలు ఎదుర్కోనవలసి వస్తుందని, అధికార వర్గాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అయినా నిండా మునిగిన వరికి చలేమిటి?

By
en-us Political News

  
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు.
జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
చివరాఖరికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.