Publish Date:Jul 21, 2022
వెనకటికి ఓ పెద్దాయన మోకాలు నొప్పిగా ఉంది ఇంటికి తీసికెళ్లమని అడిగితే ఓ పోలీసాయన బండి మీద ఎక్కించుకుని మరీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపాడు. దిగిన వెంటనే చిరునవ్వు నవ్వి శభాష్ అని బుజం తట్టి మామూలుగానే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. పోలీసాయనకు కోపంరాలేదు. నవ్వుకున్నాడు. పెద్దాయనలోనూ మహా నటుడు ఉన్నాడని. అదుగో అలా ఉంది జగన్ సర్కారు నిర్ణయం. ఉగాది పురస్కా రంలో భాగంగా వారికి ఇచ్చే నగదు బహుమతిని రూ.500 నుంచి రూ.150కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వర్షాలు, వరదలొచ్చి ఇల్లు మునిగిపోతున్నా, కుర్రకారు సెల్ఫీ వ్యామోహంలో ఏ నదిలోనో కొట్టుకు పోతు న్నా, పోనీ ఏ ఇల్లు తగలడుతున్నా పరుగున వచ్చి కాపాడేది, కనీసం వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లేది పోలీ సులు, అగ్నిమాపకదళంవారే. వారికి తన, పర తేడాలుండవు. వారి దృష్టిలో అందరూ సమానమే. ఎవరిక యినా అవసరమై పిలిస్తే సేవచేస్తారు. అది వారి వృత్తి ధర్మంగా భావిస్తారు. కానీ వారి సేవలకు తగిన పత కాలతో పాటు ఇచ్చేపారితోషికం కూడా కాస్తంత జేబు నిండేలా అన్నా ఇవ్వరు. పైగా ఇప్పుడు జగన్ ప్రభు త్వం కేవలం పతకానికే అధిక ప్రాధాన్యతనిస్తూ ఇచ్చే కాస్తింత నగదులోనూ కోత విధించడం దారుణం.
ఊళ్లో గొడవలు, ధర్నాలు, రౌడీల దాడులు జరుగుతున్నా అడ్డుకోవడానికి ఈల వేస్తే వచ్చేది పోలీసు బలగాలే. మరీ అవసరమైతే అగ్నిమాపక దళాలూ వచ్చేస్తాయి. వారి శిక్షణ అలా ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ అనే తత్వం ఇమిడి ఉంటుంది. వారి శిక్షణకు, వారి కష్టానికి ప్రభుత్వాలు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కేవలం వారు చనిపోయిన తర్వాత ఇంటికి పెన్సన్ డబ్బో, కాయితాలో పంపడం కాదు.
ఉగాది పురాస్కారాల పేరిట చేసే గౌరవ మర్యాదలూ మరింత గౌరవ ప్రదంగా ఉండాలి. కానీ జగన్ సర్కార్ మాత్రం ఈసారి నుంచి ఉగాది పురస్కారాలు ప్రత్యేకంగా పోలీసులు, అగ్నిమాపకదళాల వారికి ఇచ్చే పురస్కారంలో భాగంగా కేవలం పథకం, 150 రూపాయల నగదు మాత్రమే ఇవ్వాలని నిర్ణయిం చింది. గతంలో ఈ నగదు 500 రూపాయలు ఉండేది. దాన్ని రూ.150కి తగ్గించడం విని నవ్వాలో, ఏడ వాలో అర్ధంగావడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-government-reduces-ugadi-cash-reward-for-police-25-140252.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.