అప్పులు అయిపోయాయి.. ఇక, విరాళాల వేట.. జగన్ సర్కారు కొత్త ఎత్తు!

Publish Date:Jan 22, 2022

Advertisement

అప్పుల ఊబిలో కురుకు పోయి , ఇక అప్పులు పుట్టని స్థితికి చ్రుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కసులకోసం  కొత్త ఎత్తులు వేస్తోందా,అంటే అవుననే అంటున్నారు లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషకులు. ఏపీ ప్రభుత్వం పేరు చెపితే ఎక్కడా పైసా అప్పు పుట్టడం లేదు. అవకాశం  ఉన్న వరకు అప్పు పాత్రలు అన్నింటినీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడోనే పూర్తిగా తుడిచేసింది.(గిట్టని వాళ్ళు అయితే నాకేసిందని అంటారనుకోండి అది వేరే విషయం,)  ఇక ఎక్కడా రూపాయి కాదు కదా, హాఫ్ రూపీ అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదనేది అందరికి తెలిసిన విషయమే.  రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్లమెంట్ ఉభయ సభలలో  వైసేపీ  నాయకులు ఒకటికి రెండు సార్లు గోడు వెళ్ళబోసుకున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక  స్థితి అధ్వాన్నంగా ఉందని కానీ, అప్పులు పుట్టని దుస్థితి ఉందని గానీ , వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. 

అందుకే, ఇక ఇలా కాదని, ఏపీ ప్రభుత్వం కాసు కొత్త ఎత్తులు వేస్తోందని విస్వవసనీయ వర్గాల సమాచారం. అప్పులు ఇవ్వకపోతే ఇవ్వక పోయారు, విరాళాలు అయినా ఇవ్వండని, దేశీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థలను వేడుకునేందుకు, ఏపీ ప్రభుత్వం సిద్డంవుతోందని అధికార వర్గాల సామాచారం.  ప్రస్తుతానికి, నాడు – నేడు పేరుతొ అమలవుతున్న పాఠశాల భవనాల రంగులు, హంగులు కార్యక్రమానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి దాతలనుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పాఠశాలలో ఆవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.6321 కోట్లు అవసరమని గుర్తించి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలుసేకరించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన విధివిధానాలు, ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయని, అదికార వర్గాలు అంటున్నాయి. 

అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం వెనక చాల పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ విరాళాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంక్షలను కఠినతరం చేసింది. దేశంలో ఇంచుమించుగా ఆరు వేల వరకు స్వచ్చంద సంస్థల లైసెన్సులను కేంద్రహోమ్ శాఖ రద్దు చేసింది. అంటే ఆ సంస్థలకు ఇక విదేశాల నుంచి విరాళాలు రావు. ఇందులో టీటీడీ సహ, ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం వంటి సంస్థలు ఉన్నా, సేవా కార్యక్రమాల ముసుగులో మతమార్పిడులకు పాల్పడే, క్రైస్తవ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా, ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో వేరే చెప్పనక్కరలేదు. ఈ నేపధ్యంలోనే నాడు – నేడు పేరిట విదీశీ మిషనరీలకు బ్యాక్ డోర్ ఎంట్రీ కలిపించేందుకు, జగన్ రెడ్డి ఈ ఎత్తు వేశారా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు సంబందించిన విధివిధానాలు వెలువడితేనే గానీ, అసలు కుట్ర ఏమిటన్నది తేలదు. స్వచ్చంద సంస్థలు ఇచ్చే విరాళాలను ప్రభుత్వం నేరుగా సేకరిస్తుందా, లేక అప్పుల కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట,ఒక సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేసిన విధంగా విరాళాల సేకరణకు మరో సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేస్తుందా, అనేది తేలితే గానే, విరాళాల అసలు రంగు బయట పడదని అంటున్నారు. అయితే, అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలతో వైఎస్సార్ కుటుంబానికి ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు.

By
en-us Political News

  
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.