Publish Date:Nov 22, 2021
జగన్రెడ్డి తగ్గారు. అయినా, తగ్గేదే లే అన్నారు. సీఆర్డీఏ బిల్లు రద్దును రద్దు చేశారు. వికేంద్రీకరణ బిల్లలనూ వెనక్కి తీసుకున్నారు. అయినా, మళ్లీ మూడు రాజధానుల పాటే పాడారు. మరోసారి మెరుగైన, బలమైన బిల్లుతో ముందుకొస్తామని చెప్పేశారు. జగన్లో ఇంత ధీమా ఎందుకు? ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా.. అమరావతి రైతులు 700 రోజులుగా ఉద్యమిస్తున్నా.. మహా పాదయాత్రతో నిరసన తెలుపుతున్నా ఏమాత్రం తలవంచని జగన్రెడ్డి.. ఇప్పుడే ఎందుకిలా స్టాండ్ మార్చారు. తగ్గడం వెనుకున్న నెగ్గే వ్యూహమేంటి? అనేది ఆసక్తికరం.
వారం రోజులుగా హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది. జగన్ సర్కారును ప్రశ్నలతో కుళ్లబొడుస్తోంది. అంతా డొల్ల బిల్లులే. టెక్నికల్గా అనేక లోటుపాట్లే. అందుకే.. డైలీ హైకోర్టు తలంటుతోంది. రాజధాని బిల్లులపై విచారణలో భాగంగా.. చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. అమరావతి రైతులది మాత్రమే కాదని.. ప్రజలందరిదనీ వ్యాఖ్యానించారు. కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్కు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు అనుమతి ఉందా? అని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమైనా.. అందులోని చట్టబద్దతను మాత్రం తాము విచారించి తీర్పు చెబుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇలా, న్యాయస్థానంలో విచారణ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లులోని లూప్పోల్స్ అన్నీ బయటకొచ్చాయి. ఆ కేసులు కోర్టులో వీగిపోవడం ఖాయమని అర్థమైపోయింది. అలా పరువు పోకముందే.. బిల్లులన్నీ రద్దు కాకముందే.. జగన్ ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు. అలా, హైకోర్టు తీర్పు రాకముందే సర్కారు సర్దుకుందని చెబుతున్నారు.
మరోవైపు, మండలి వ్యవహారం. సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు మండలి ఛైర్మన్. అయితే, ఆ బిల్లును అలా సెలెక్ట్ కమిటీకి పంపించే అధికారం ఛైర్మన్కు లేదంటూ.. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మండలి ఉద్యోగి తిరస్కరించడం కలకలం రేపింది. ప్రభుత్వ ఒత్తిడితోనే ఆ ఉన్నతోద్యోగి అలా కొర్రీ పెట్టారని ప్రతిపక్షం విమర్శించింది. సీఆర్డీఏ బిల్లు రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందని టీడీపీ అంటుంటే.. వెళ్లలేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీకే మెజార్టీ ఉండగా.. త్వరలో వైసీపీకి మరో 14మంది ఎమ్మెల్సీలు కొత్తగా ఎన్నిక కానుండటంతో మండలిలో అధికార పార్టీ ఆధిపత్యంలోకి రానుంది. ఆ తర్వాత ఏ బిల్లు తీసుకొచ్చినా.. ఇటు అసెంబ్లీలోనైనా, అటు మండలిలోనైనా ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని భావిస్తోంది. అందుకు మరికాస్త సమయం పట్టనుండటం.. ఆ లోగా ఉన్న బిల్లును వెనక్కి తీసుకొచ్చి.. కొత్తగా, మరింత బలంగా మరో బిల్లు తీసుకురావలే అనేది జగన్రెడ్డి వ్యూహమని తెలుస్తోంది. ఏది, ఏమైనా అమరావతిని కాలరాయడమే జగన్ లక్ష్యమని మరోసారి తేలిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-fear-about-high-court-and-mandali-mejority-on-crda-bill-25-126895.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.