వాలంటీర్లపైనే విశ్వాసం.. ఎన్నికల్లో గట్టెక్కిస్తారన్నదే జగన్ ధీమా

Publish Date:Apr 22, 2022

Advertisement

వైఎస్ జగన్మోహనరెడ్డి...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇప్పటి పాలన సంగతి పట్టించుకోకుండా మరో రెండేళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాలలో అసంతృప్తి గూడుకట్టుకుందన్న సంగతి ప్రస్ఫుటంగా తెలుస్తున్నా...రెండేళ్లలో జగన్మాయ చేయలేనా అన్న ధీమాతో ఉన్నారు. అందుకే పార్టీలో అసమ్మతినీ, ఉద్యోగులలో ఆగ్రహాన్నీ, సామాన్య జనంలో ఆవేదననీ దేనినీ అడ్రెస్ చేయడం లేదు...కనీసం చేద్దామని కూడా అనుకోవడం లేదు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆయన ధీమా ఏమిటి?

ఇందుకు ఆయనే సృష్టించిన సరికొత్త (అ)వ్యవస్థ ఉందిగా... అదే వాలంటీర్ల వ్యవస్థ. దానిపైనే ఆయన నమ్మకం...వాలంటీర్లు ఉన్నారన్నదే ఆయన ధీమా అంటున్నారు విశ్లేషకులు. సొంత గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగమంటూ ఘనంగా ప్రకటించుకుని పెద్ద ఎత్తున నామమాత్రపు వేతనాలకు ఆయన నియమించుకున్న ప్రైవేటు సైన్యమే వాలంటీర్లు. వచ్చే ఎన్నికలను వారి ద్వారానే గట్టెక్కాలన్నది ఆయన యోచన. వైకాపా ఎమ్మెల్యేలు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో జగన్ ధీమా ఇదేనని చెప్పుకొస్తున్నారు. 
వలంటీర్లతో ఎన్నికలు గెలవడమేమిటి? ఎన్నికలలో విజయం సాధించాలంటే అభివృద్ధి పనులు చేయాలి. ప్రజా సంక్షేమం కుంటుపడకుండా కార్యక్రమాలు చేయాల. తద్వారా ప్రజా విశ్వాసం చూరగొనాలి. అప్పుడు కదా, జనం మెచ్చి ఒట్లేసేది? కానీ వైకాపా అధినేతకు అటువంటి వాటిపై నమ్మకం లేదు. ప్రజల వద్దకు నేరుగా ప్రభుత్వం అంటే వాలంటీర్లు వెళ్లి సేవలందిస్తున్నారు కదా! ఇంకేం చేయాలి? అన్న ధీమాలో ఉన్నారు. వాలంటీర్లనే బూతు స్థాయి అధికారులుగా నియమించేస్తే.. కాగల కార్యం వారే చూసుకుంటారన్న దీమా ఆయనది. అందుకే ఊరూరా, వాడ వాడలా వాలంటీర్లకు సన్మానం చేసే కార్యక్రమానికి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టారు. అది ఇంకా కొనసాగుతోంది. 

వారి మీద ఎంత విశ్వాసం అంటే స్థానిక ప్రజాప్రతినిథుల అధికారాలలో కోత పెట్ట మరీ వారికి కట్టబెట్టారు. స్థానికంగా ఎమ్మెల్యేలను మించిన పెత్తనం వారి చేతికే ఇచ్చేశారు. అధికారికంగా కాదు...  మీ అంతటి వారు లేరంటూ భుజకీర్తులు తగలించడం ద్వారా. ఇంతకీ వాళ్లు చేయాల్సిన పనేమిటి? వైకాపా కార్యకర్తల్లా పని చేయాలి. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మోయాలి.
అయితే స్థానిక ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల మితిమీరిన జోక్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక దశలో వాలంటీర్ల జోక్యాన్ని అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. వారి ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. తరువాత బద్వేలు, తిరుపతి ఎన్నికలలో కూడా వారి తీరు, శైలి వివాదాస్పదం అయ్యింది. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పబ్బం గడిచేతి వారి చలువతోనే అని జగన్ నమ్మతున్న నేపధ్యంలో గతంలో వారి ప్రమేయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం ఈ సారి ఊరుకుంటుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ త‌న దైన స్టైల్‌లో ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూట‌మికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ స‌ర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజ‌కీయంగా సీనియ‌ర్ కూడా అయిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి త‌న మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ ఆయ‌న నేర్పుగా ముందుకు సాగుతార‌నే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
Publish Date:May 8, 2024
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.