ఏ బిడ్డా ఇది నా అడ్డా అనగలవా జగన్?.. పులివెందుల నడిబొడ్డున బాబు సవాల్

Publish Date:Aug 5, 2023

Advertisement

పులివెందుల.. ఈ పేరు చెబితే చాలు ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రైనా వైఎస్ఆర్‌ కుటుంబానికి కంచుకోట అని ఠక్కున చెప్పేస్తారు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల అండ‌దండ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించారు. వైఎస్ కుటుంబం ఏం చెబితే అక్క‌డి మెజార్టీ ప్ర‌జలు అదే ఫాలోఅయ్యేవారు. వైఎస్ఆర్ మృతి త‌రువాత కూడా వై.ఎస్‌. జ‌గ‌న్‌కు పులివెందుల ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించి సీఎంను చేశారు. వైఎస్ఆర్ బంతికున్న స‌మ‌యంలో పులివెందుల‌లో ప్ర‌తిప‌క్ష‌పార్టీల నేత‌లు అడుగుపెట్టి గ‌ర్జిద్దామ‌న్నా అక్క‌డి ప్రజ‌ల నుంచి స్పంద‌న క‌రవ‌య్యేది. దీంతో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌బాబుకు ఎలాగో..   పులివెందుల ప్ర‌జ‌లు వైఎస్ఆర్ కుటుంబానికి అలా అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. అయితే  ప్ర‌స్తుతం పులివెందుల‌లో ప‌రిస్థితులు మారుతున్నాయి. ఇందుకు నిద‌ర్శనం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పులివెందుల వెళ్లి సింహ‌గ‌ర్జ‌న చేయ‌డ‌మే. వైసీపీ శ్రేణుల్లో ఇన్నాళ్లూ ఒక గ‌ట్టి న‌మ్మ‌కం ఉండేది. చంద్ర‌బాబు రాష్ట్రంలో ఎక్క‌డికివెళ్లినా ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న వ‌స్తుందేమో కానీ..   జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అడ్డా పులివెందుల వెళితే ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నే భావ‌న‌లో ఉండేవారు. అయితే, రెండు రోజుల క్రితం చంద్ర‌బాబుకు పులివెందుల‌ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంతో  వైసీపీ శ్రేణుల నమ్మకం పటాపంచలైపోయింది. వారి వెన్నులో వణుకు పుట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్ర‌బాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల రాజ‌కీయాలు వేరుగా ఉండేవి. చంద్ర‌బాబుకు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌గా ఉండ‌గా.. రాజ‌శేఖ‌ర‌రెడ్డికి పులివెందుల కంచుకోట‌గా ఉంది. వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్థులైన‌ప్ప‌టికీ ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయించాల‌ని ఎప్పుడూ చూడ‌లేదు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వైసీపీ జెండా ఎగురేస్తామంటూ ప్ర‌క‌ట‌నలు చేస్తూ వ‌స్తున్నారు. దీనికి తోడు కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన స‌మ‌యంలో అనేక అడ్డంకులు సైతం సృష్టించారు. కానీ  ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే కుప్పంలో చంద్ర‌బాబు ఓడిపోవ‌టం అలా ఉంచితే.. పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌రువు పోయే ప‌రిస్థితి ఏర్ప‌డిందని పరిశీలకులు అంటున్నారు.

  జ‌గ‌న్ వ్యూహం రివర్స్ అయ్యిందని విశ్లేషిస్తున్నారు.  చంద్ర‌బాబు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో కాలుమోప‌డ‌మే త‌రువాయి అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీనికితోడు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని చూసిన వైసీపీ శ్రేణుల‌ను త‌రిమి కొట్టారు. ఈ విచిత్ర ప‌రిస్థితి చూసి ఇది పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ‌మేనా అనే అనుమానం విశ్లేష‌కుల నుంచిసైతం వ్య‌క్త‌మ‌వుతోంది. చంద్ర‌బాబుకు పూలుప‌రిచి పులివెందుల ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌ల‌క‌డంతో పాటు, చంద్ర‌బాబు మాట్లాడే ప్ర‌తీ మాట‌కు హ‌ర్ష‌ధ్వానాలు చేశారు. దీంతో పులివెందుల ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు ప‌లికిన స్వాగ‌తాన్ని చూసి వైసీపీ శ్రేణులు వ‌ణికిపోతున్నాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై పులివెందుల ప్ర‌జ‌ల్లో రోజురోజుకు ఆద‌ర‌ణ త‌గ్గిపోవ‌డానికి ప‌లు కార‌ణాల‌ను విశ్లేషకులు తెర‌పైకి తెస్తున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో, సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ పులివెందులకు ఎప్పుడో ఒక‌సారి వ‌చ్చేవారు. అక్క‌డ రాజ‌కీయాల‌న్నీ ఆయ‌న సోద‌రుడు వివేకానంద‌రెడ్డి చూసుకుంటూ ఉండేవారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వివేకానందరెడ్డే ప‌రిష్క‌రించేవారు. ఏదైనా పెద్ద స‌మ‌స్య అయితేనే వైఎస్ఆర్ వ‌ర‌కు వ‌చ్చేది. దీనికి తోడు పులివెందుల నుంచి త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన‌వారికి రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌యం కేటాయించి వారి స‌మ‌స్య‌ల‌ను వినేవారు.

వారి స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించేలా చూసేవారు. దీంతో పులివెందుల ప్ర‌జ‌ల‌కు వైఎస్ఆర్ అన్నా.. వివేకానంద రెడ్డి అన్నా ఎన‌లేని అభిమానం. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై సైతం పులివెందుల ప్ర‌జ‌లు అంతే అభిమానాన్ని చూపుతూ వ‌చ్చారు. అయితే, ఈ నాలుగేళ్ల కాలంలోజ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న భావన అక్క‌డ ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు పులివెందుల ప్ర‌జ‌ల‌కు జగన్ ద‌ర్శ‌న‌భాగ్య‌మే క‌రువ‌వుతోంద‌ట‌. ఒక‌వేళ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వెళ్లినా అవ‌కాశం ద‌క్క‌డం లేద‌ట‌. దీంతో రోజురోజుకు జ‌గ‌న్ అంటే అక్క‌డి ప్ర‌జ‌లు చీద‌రించుకొనే ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. 

చంద్ర‌బాబుకు పులివెందుల‌లో అద్భుత ఆద‌ర‌ణ ల‌భించ‌డానికి మ‌రోకార‌ణం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అదే.. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌. వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ‌లో సీఎం జ‌గ‌న్ తీరు పులివెందుల ప్ర‌జ‌లకు ఆగ్ర‌హాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. వివేకాను  అవినాశ్ రెడ్డి హ‌త్య‌చేశాడ‌ని రాష్ట్రం మొత్తం కోడైకూస్తున్నా జ‌గ‌న్ మాత్రం ఆయ‌న్ను కాపాడుకుంటూ వ‌స్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికితోడు వివేకా కుమార్తెను దూరం పెట్ట‌డం, సొంత చెల్లి ష‌ర్మిల‌ను దూరం పెట్ట‌డం కూడా పులివెందుల ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక భావం  నెల‌కొనడానికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు. సీఎంగా ఉండి, కేంద్ర ప్ర‌భుత్వం అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సొంత బాబుయిని హ‌త్య‌ చేసిన నిందితుల‌ను క‌ట‌క‌టాల్లోకి పంపించ‌లేక పోయాడ‌ని, ఇక మ‌న‌కేం న్యాయం చేస్తాడ‌నే భావ‌న‌కు పులివెందుల‌లోని మెజార్టీ ప్ర‌జ‌లు వ‌చ్చారంటున్నారు. ఇదే ప‌రిస్థితి ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో టీడీపీ జెండా ఎగిరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.