2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. సునీల్ కనుగోలు కోసం జగన్ ఆరాటం?!

Publish Date:Aug 23, 2024

Advertisement

ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో   వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. తెలుగుదేశం కూటమి సునామీలో వైసీపీ  కొ ట్టుకుపోయింది. ఆ పార్టీ నేతలు పరాజయం తరువాత ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలలోనూ అత్యధికులు జగన్ కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అధికారంలో ఉన్నంత వరకూ విపక్షంపై నోరెట్టుకు పడిపోయి.. నానా హడావుడీ చేసిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ కు కళ్లూ, నోరూ, చెవులుగా వ్యవహరించిన సజ్జల కలికానికి కూడా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఐదేళ్లలో వైసీపీ కనుమరుగౌతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రజారంజక పాలనతో జనానికి దగ్గరౌ తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ చెమటోడ్చి కష్టపడుతోంది. ఇటు వంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్తంలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలోనే పార్టీనీ, తన పట్టును కాపాడుకునేందుకు జగన్ ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి అప్పడు పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్టుగా పని చేసిన ప్రశాంత్ కిషోరే కర్త, కర్మ, క్రియా అని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ కోసం పని చేసే అవకాశాలు లేవు. పైపెచ్చు ప్రశాంత్ కిశోర్ సొంతంగా రాజకీయపార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇంకెంత మాత్రం ఎన్నికల వ్యూహకర్తగా వేరే పార్టీలకు పని చేసేది లేదని విస్పష్టంగా ప్రకటించేశారు. దీంతో జగన్ వైసీపీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమిం చుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సునీల్ కనుగోలు సామాన్యమైన వ్యక్తి కాదు. కర్నాటక, తెలంగాణ అసెంబ్లీలకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక ఉన్నది ఆయన వ్యూహాలే. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం ఆయన చేసిన కృషి ఎన్నదగ్గది. అభ్యర్థుల ప్రకటన నుంచి విజయం వరకూ కాంగ్రెస్ ను నడిపించింది సునీల్ కనుగోల్ వ్యూహాలే.  ఏది ఎలా చేయాలో.. ఏ లెక్కన చేయాలో.. ఎలా చెప్తే ప్రజలు వింటారో వెనకుండి నడిపించింది ఆయనే.  నిజానికి ఈ ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సునీల్ పేరు తెలిసింది.  ఇక తెలంగాణలో ఎన్నికల ఫలితాల తరువాత   తెలుగు రాష్ట్రాలలో సునీల్ కనుగోలు పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది.   అటు వంటి సునీల్ కనుగోలును  వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలు స్తోంది. 

సొంతంగా పార్టీని గాడిలో పెట్టడం అసంభవమని భావిస్తున్న జగన్ సునీల్ కనుగోలు సహాయం తీసు కోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలు స్తోంది. అయితే సునీల్ కనుగోలు వ్యూహాలు పీకే వ్యూహాలకు పూర్తి భిన్నమైనవి. విధ్వంసం, కుట్రలు పీకే స్టైల్ అయితే వాస్తవాల ఆవిష్కరణ సునీల్ కనుగోలు స్టైల్. కర్నాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను గమనిస్తే ఆ విషయం ఇట్టే అవగతమౌతుంది. 
ఏపీలో 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిశోర్  వైసీపీతో చేయించిన డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం, జగన్ తో పాదయాత్రలో చేయించిన ఫీట్లు, వివేకానందరెడ్డి హత్యను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం, తండ్రి, బాబాయ్ మరణాలపై జగన్ తో చేయించిన యాక్టింగ్ ఇవన్నీ తెలుగు ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు. అందుకే పీకే అంత ఫేమస్ అయ్యారు. జగన్ ఆ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే అటువంటి ఫీట్లకు, కుట్రలు, కుతంత్రాల వ్యూహాలకు   సునీల్ కనుగోలు  విరుద్ధం.  తెలంగాణ అసెంబ్లీకి గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పని చేసిన సునీల్  కనుగోలు ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతలను గెలుపుకోసం అడ్డదారులు తొక్కించలేదు. రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలిం చలేదు. మతం మత్తులో ముంచలేదు. తెలంగాణ సెంటిమెంటుకు ఆస్కారం ఉన్నా దాని జోలికి  వెళ్ళలేదు. మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి క్యాష్ చేసుకొనే ఛాన్స్ ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. ఏపీలో పీకే లాగా కోడికత్తుల్ని దించలేదు.. గొడ్డలితో గుండెపోట్లు రప్పించలేదు. చేసిందల్లా ఒక్కటే.. నిజాన్ని ప్రజ లకు అర్ధమయ్యేలా ఆవిష్కరించారు. అటువంటి సునీల్ కనుగోలు జగన్ పార్టీ కోసం పని చేస్తారా అంటే కచ్చితంగా చేయరు అనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.