డాక్టర్ ప్రియాంక.. గొర్రెల కాపరి దానయ్య.. రాజకీయం కోసం జగన్ ద్వంద్వ వైఖరి?

Publish Date:Aug 10, 2026

Advertisement

రాజ మహూంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ను  కారుతో ఢీకొట్టి దారుణ హత్యకు గురి చేసిన సంఘటన   రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి విదిమే.   ఈ కేసును ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిండానికి వైసీసీ అధినేత చేస్తున్న ప్రయత్నం వెనుక ఉన్న  ఈ కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకడైన న ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఒక పాపస్టర్ కుమారుడు కావడమేనంటున్నారు.వాస్తవానికి విషయంతో సంబంధం లేకుండాప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం వైసీపీ ఎకోసిస్టమ్లో భాగంగా మారిపోయింది. 

రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో  నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది. రెండుసంఘటనల్లోనూ ఆయన   స్పందన వేరువేరుగా ఉంది. కాశీబుగ్గ ఘటనలో నిందితులకు అనుకూలంగా, రాజమహేంద్రవరం సంఘటనలో మరోలా మాట్లాడుతున్నారు.

ఆయన మాటల్లోని వైరుధ్యాన్నీ, ప్రభుత్వంపై నిందలు మోపుతున్న తీరునూ గమనిస్తే.. జగన్ నిందితులకు  మద్దతుగా మాట్లాడుతూ, రాజకీయంతోనూ, ప్రభుత్వంతోనూ ఏమాత్రం సంబంధం లేని సంఘటనలకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని చెప్పకతప్పదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ రెండుసంఘటనల్లోనూ కూడా నిదితులు మద్యం మత్తు, నిర్లక్ష్యం, అహంకారంతో వాహనం నిర్లక్ష్యంగా నడిపి నిండు ప్రాణం బలితీసుకున్నారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ఇసుమంతైనా లేదు.  

ముందుగా కాశీబుగ్గ సమీపంలో సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయానికి వస్తే..  ఆ సంఘటనలో ఒక పేద గొర్రెల కాపరి దానయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ సందర్భంగా  వైసీపీ అధినేత జగన్  వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. తొలుత  సొంత పార్టీ నేత కుమారుడిని రక్షించేందుకు వేరొక అనామకుడిపై నింద మోపే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో నడిరోడ్డుపై పడి ఉన్న దానయ్యను కాపాడే ప్రయత్నం చేయలేదు. దానయ్య కుటుంబాన్ని ఆదుకోలేదు. కుమారుడిని కాపాడేందుకు, కేసును తప్పుదోవపట్టిచేందుకు ప్రయత్నించిన   సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే..  దాన్ని రాజకీయ కక్ష సాధింపు గా జగన్ రెడ్డి  అభివర్ణించి విమర్శల పాలయ్యారు.  బాధితుడైన గొర్రెల కాపరి కుటుంబం ఆవేదనను పక్కనపెట్టి, కేవలం తమ పార్టీ నేత, కుల సమీకరణాలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. సీదిరి అప్పలరాజు, అతడి కుమారుడిపై కేసు పెట్టడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా, మత్స్యకార నాయకుడ్ని వేధించడంగా  అభివర్ణించారుర. 

ఇక తాజాగా రాజమహేంద్రవరం ఘటనలో డాక్టర్ ప్రియాంక మరణానికి కారణమైన  వారిలో ఒక నిందితుడు..  తనకు కీలకమైన  ఓటు బ్యాంకువర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఈ ఘటనలో మరణించిన ప్రియాంక వైద్య విద్యార్థిని కావడంతో  ఏం మాట్లాడాలో తెలియక డైలమాలో పడిన జగన్ చివరికి ప్రభుత్వాన్నినిందిస్తూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు.  జోసెఫ్ ఎడ్వర్డ్స్ కుటుంబం సామాజికంగా, మతపరంగా వైసీపీకి సాంప్రదాయకంగా మద్దతు ఇచ్చే వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో రాజమమేంద్రవరం కేసులో  నిందితులకు కఠిన శిక్ష పడాలని, వైసీపీ చేస్తున్న డిమాండ్లు మాటవరసేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే..  కాశిబుగ్గ కేసులో అప్పలరాజు కొడుకుపై చట్టం చర్యలు తీసుకుంటే వ్యతిరేకించిన జగన్.. ప్రియాంక విషయంలో  అందుకు భిన్నంగా స్పందిస్తారని ఎలా భావించగలమని అంటున్నారు.  

 ప్రియాంక తండ్రి కడుపు కోతతో మాట్లాడుతున్న మాటలను  రాజకీయం చేసి లబ్ధి కోసం పాకులాడుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు, ఒక నిందితుడు తమ పార్టీ నేత కొడుకైనా, లేక ఓటు బ్యాంకుకు చెందిన ప్రముఖుడి కొడుకైనా శిక్ష ఒకేలా ఉండాలి.. జగన్ డిమాండ్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి కదా అంటున్నారు.   బాధితురాలైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్ ఏపీవ్యాప్తంగా మిన్నంటుతున్న వేళ, వైసీపీ ద్వంద్వ వైఖరి ఆ పార్టీ విశ్వసనీయతను మరింత మరింత మసకబారుస్తోందనడంలో సందేహం లేదు. సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో బాధితుడికి ఒక న్యాయం, రాజమహేంద్రవరం ప్రియాంక కేసులో మరో న్యాయం అన్నట్లుగా జగన్ రాజకీయాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Jagan double standards, Politics, Hit and Run, Sidiri Appalaraju Son, Doctor Priyanka

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.