జగన్ ఢిల్లీకి అలా వెళ్లారు.. ఇలా వచ్చారు!

Publish Date:Aug 22, 2022

Advertisement

జగన్ హస్తిన పర్యటన అదేదో రియాల్టీ షోలో హోస్ట్ చెప్పినట్లు అలా వెళ్లి, ఇలా వచ్చేసినట్లు ముగిసిపోయింది. మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆఖరికి వైసీపీలో కూడా జగన్ పర్యటన గురించి పెద్దగా చర్చ లేదు. ప్రధాని నివాసంలో జగన్ గడిపింది ఓ అరగంట. అందులో జగన్- మోడీ మధ్య భేటీ ఎంత సేపు జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు.

అయితే సీఎంవో ప్రెస్ నోట్ ప్రకారం పోలవరం సహా పలు డిమాండ్లతో జగన్ ప్రధానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ తరువాత లాంఛనంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. మధ్యలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే ఉన్నారు. జగన్ అమిత్ షాతో కూడా భేటీ కానున్నారని వైసీపీ శ్రేణులు చెప్పారు. అయితే అమిత్ షా అప్పాయింట్ మెంట్ జగన్ కు లభించలేదని హస్తిన వర్గాల ద్వారా తెలిసింది.  జగన్ మోడీతో చర్చించిన విషయాలేమిటన్నది పక్కన పెడితే ఆయన పోలవరంపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారని మాత్రం సీఎంవో ఒక నోట్ విడుదల చేసింది.

గతంలో పలు మార్లు మోడీతో జగన్ భేటీ అయ్యారు. అలా భేటీ అయిన ప్రతి సారీ... వారిరువురి మధ్యా జరిగిన చర్చ ఏమిటన్నది ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడూ అంతే సీఎంవో నుంచి విడుదలైన ప్రకటన వినా.. జగన్ మీడియా సమావేశం పెట్టి ఏం మాట్లాడారో వివరించిన సందర్భం లేదు. ఇప్పుడూ అదే జరిగింది. ఇంత హఠాత్తుగా.. సిరికిం జెప్పడు అన్న చందంగా జగన్ హస్తిన ఎందుకు వెళ్లారు? ఎందుకు వచ్చారు? అంటే వైసీపీ సీనియర్లు కూడా చెప్పలేని పరిస్థితి. అయితే పరిశీలకులు మాత్రం కేవలం రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టుకురావడానికే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు.

రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాల సంకేతాల నేపథ్యంలోనే జగన్ హస్తినకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారని చెబుతున్నారు. ఇటీవల అంటే అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మోడీ కొద్ది నిముషాలసేపైనా ఆప్యాయంగా ముచ్చటించడం.. మరో సారి కలుద్దాం అంటూ ఆహ్వానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ హడావుడిగా హస్తిన వెళ్లారని చెబుతున్నారు. అలాగే ఢిల్లీ మద్యం స్కాం బయటపడిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏపీ లింకులు ప్రస్తావించడం కూడా జగన్ హస్తిన పర్యటనకు కారణమని అంటున్నారు.మొత్తం మీద జగన్ హస్తిన పర్యటన ఎవరికీ పట్టకుండా పోయింది.

మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఆఖరికి సొంత పార్టీ వారు కానీ జగన్ హస్తిన పర్యటనను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన హస్తిన వెళ్లడం, రావడం మామూలేగా అన్నట్లు నిర్లింప్తంగా ఉండిపోయారు. రాజకీయంగా లేదా కేసుల పరంగా ఏదైనా కొద్ది పాటి ఒత్తిడి వస్తే జగన్ హస్తిన వెళ్లి వస్తారని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సారి అదే జరిగిందని వారు అంటున్నారు.
  జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పటిలా ఎవరికీ ఆసక్తి కలిగించలేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జగన్ వెళ్తారు.. వస్తారు.. చివరికి లోపల ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఒకటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు. 

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.