మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు నిరసనగా జగన్ ఢిల్లీ ధర్నా?.. సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనా?

Publish Date:Jul 30, 2025

Advertisement

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్టౌతున్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదుల వరకూ వెడుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కు అరెస్టు భయం పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో తనకు కూడా అరెస్టు తప్పదన్న భయంతో ఆయన హస్తినలో అండ కోసం పాకులాడుతున్నారు. అందుకే ఢిల్లీ యాత్రకు యోచిస్తున్నారు. జగన్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు వ్యతిరేకంగా ఢిల్లీలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీఎంతా జగన్ ఉన్న సమయంలో ఆయనకు కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సలహాదారు వాసుదేవరెడ్డి, ఈ కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి, ఇక జగన్ కుటుంబానికి సన్నిహితుడు, భారతీ సిమ్మెంట్స్ ఆడిటర్ గోవిందప్ప సహా పలువురు అరెస్టు కావడంతో.. దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ కు రావడానికి ఇంకెంతో కాలం పట్టదన్న భయంతో జగన్ హస్తినలో హడావుడి చేసి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

మద్యం కుంభకోణం పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందంటూ జగన్ హస్తినకు వెళ్ల ధర్నా చేసే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా హస్తినలో వివిధ జాతీయ పార్టీల మద్దతు కూడగట్టి ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు.  వాస్తవానికి ఆయన గత సోమవారమే హస్తిన పర్యటనకు బయలుదేరాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల వచ్చే నెలలో అంటే ఆగస్టులో హస్తినకేగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

అయితే మద్యం కుంభకోణం అరెస్టులకు నిరసనగా హస్తినలో ధర్నా చేస్తే జాతీయ స్థాయిలో జగన్ పరువు, వైసీపీ పరువు మసకబారుతుందని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టైన సంగతిని జగన్ గుర్తుంచుకోవాలని పరిశీలకులు విశ్లేషిస్లున్నారు.  అన్నిటికీ మింది జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించినా.. డిజిటల్ పేమెంట్స్ కు ఎందుకు నో చెప్పిందన్న ప్రశ్న జాతీయ మీడియా నుంచి వస్తే జగన్ సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఎదుర్కొనడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా మద్యం కుంభకోణం అరెస్టులకు వ్యతిరేకంగా జగన్ హస్తిన వెళ్లి యాగీ చేస్తే మాత్రం ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.