జగన్ హస్తిన ధర్నా అట్టర్ ఫ్లాప్

Publish Date:Jul 25, 2024

Advertisement

జగన్ హస్తిన ధర్నా ఘోరంగా విఫలమైంది. ఎంత ప్రయత్నించినా ఆయన ధర్నాకు జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్  పెద్దగా లేదు. ఎంతో కష్టపడి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలను ధర్నాకు తీసుకురాగలిగినా.. వారెవరూ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న మాట పొరపాటున కూడా నోటి వెంట రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఏదో మొహమాటానికి వచ్చినట్లుగా వచ్చి ధర్నాలో కూర్చుని వెళ్లిపోయినట్లుగా వారి తీరు కనిపించింది. 

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ జగన్ హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అదే ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ధర్నా కంటే ఆయన నిరసనకే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.  అయితే పరిశీలకులు మాత్రం జగన్ ధర్నా ఒక సాకు మాత్రమేననీ, ఆయన హస్తిన టూర్ అసలు ఉద్దేశం వేరే ఉందని అంటున్నారు. అఖిలేష్ ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లాలన్నది ఒక ప్లాన్ కాగా, ఎలాగో అలా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ సాధించి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం కాకుండా చూసుకోవాలన్నది మరో ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు అఖిలేష్ ను అతి కష్టమ్మీద ధర్నాకు తీసుకువచ్చారని అంటున్నారు. ఆయన ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానంతో టచ్ లోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు.

పనిలో పనిగా బీజేపీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కూడా కోరానని చెబుతున్నారు. ఆ కారణంగానే హస్తినలో ధర్నా అయిపోయినా జగన్ ఇంకా అక్కడే మకాం వేశారని చెబుతున్నారు. 
ఇది పక్కన పెడితే ధర్నా ముందూ, తరువాత కూడా మీడియాతో మాట్లాడిన జగన్ ఆవు కథ చెప్పడానికే పరిమితమయ్యారు.  జాతీయ మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి అస్సలు ఇష్ట పడలేదు.  తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం చేపట్టిన అనంతరం జరిగిన హింసాకాండలో మరణించిన వారి పేర్లు చెప్పమన్న మీడియా ప్రశ్నకు ఇక్కడ ఫొటో ఎగ్జిబిషన్ చూడండి, టాపిక్ ను డైవర్ట్ చేయకండి అంటూ అసహనం చేశారు. జగన్ మీడియాతో మాట్లాడిన రెండు సార్లూ కూడా స్వోత్కర్ష్, పర నిందకే ప్రాధాన్యత ఇచ్చారు. తన హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉందనీ, ఎక్కడా కక్ష సాధింపు ధోరణి, హింసాకాండా లేదనీ చెప్పుకుని తన భుజాలను తానే చరిచేసుకున్నారు.

అదే  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నిండా 45 రోజులు కూడా కాకుండానే రాష్ట్రం అగ్ని గుండంలా మారిందనీ, రాజకీయ హింస ప్రజ్వరిల్లిందనీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయనీ గగ్గోలు పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జగన్ ధోరణితో వైసీపీ నేతలే నివ్వెర పోయారు. జగన్ తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.