జగన్ హస్తిన ధర్నా అట్టర్ ఫ్లాప్

Publish Date:Jul 25, 2024

Advertisement

జగన్ హస్తిన ధర్నా ఘోరంగా విఫలమైంది. ఎంత ప్రయత్నించినా ఆయన ధర్నాకు జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్  పెద్దగా లేదు. ఎంతో కష్టపడి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల పార్టీల నేతలను ధర్నాకు తీసుకురాగలిగినా.. వారెవరూ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న మాట పొరపాటున కూడా నోటి వెంట రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఏదో మొహమాటానికి వచ్చినట్లుగా వచ్చి ధర్నాలో కూర్చుని వెళ్లిపోయినట్లుగా వారి తీరు కనిపించింది. 

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ జగన్ హస్తినలో ధర్నా చేస్తున్న సమయంలోనే.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అదే ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. జగన్ ధర్నా కంటే ఆయన నిరసనకే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.  అయితే పరిశీలకులు మాత్రం జగన్ ధర్నా ఒక సాకు మాత్రమేననీ, ఆయన హస్తిన టూర్ అసలు ఉద్దేశం వేరే ఉందని అంటున్నారు. అఖిలేష్ ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో టచ్ లోకి వెళ్లాలన్నది ఒక ప్లాన్ కాగా, ఎలాగో అలా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ సాధించి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం కాకుండా చూసుకోవాలన్నది మరో ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు అఖిలేష్ ను అతి కష్టమ్మీద ధర్నాకు తీసుకువచ్చారని అంటున్నారు. ఆయన ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానంతో టచ్ లోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు.

పనిలో పనిగా బీజేపీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కూడా కోరానని చెబుతున్నారు. ఆ కారణంగానే హస్తినలో ధర్నా అయిపోయినా జగన్ ఇంకా అక్కడే మకాం వేశారని చెబుతున్నారు. 
ఇది పక్కన పెడితే ధర్నా ముందూ, తరువాత కూడా మీడియాతో మాట్లాడిన జగన్ ఆవు కథ చెప్పడానికే పరిమితమయ్యారు.  జాతీయ మీడియా ప్రశ్నలకు బదులివ్వడానికి అస్సలు ఇష్ట పడలేదు.  తెలుగుదేశం కూటమి ఏపీలో అధికారం చేపట్టిన అనంతరం జరిగిన హింసాకాండలో మరణించిన వారి పేర్లు చెప్పమన్న మీడియా ప్రశ్నకు ఇక్కడ ఫొటో ఎగ్జిబిషన్ చూడండి, టాపిక్ ను డైవర్ట్ చేయకండి అంటూ అసహనం చేశారు. జగన్ మీడియాతో మాట్లాడిన రెండు సార్లూ కూడా స్వోత్కర్ష్, పర నిందకే ప్రాధాన్యత ఇచ్చారు. తన హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉందనీ, ఎక్కడా కక్ష సాధింపు ధోరణి, హింసాకాండా లేదనీ చెప్పుకుని తన భుజాలను తానే చరిచేసుకున్నారు.

అదే  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నిండా 45 రోజులు కూడా కాకుండానే రాష్ట్రం అగ్ని గుండంలా మారిందనీ, రాజకీయ హింస ప్రజ్వరిల్లిందనీ, వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయనీ గగ్గోలు పెట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జగన్ ధోరణితో వైసీపీ నేతలే నివ్వెర పోయారు. జగన్ తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి అన్నిదారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది.
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలకి ఎదురుగానే అన్యమతస్థుడు నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు.
కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2017 లో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం, గుర్తురులో ఝాన్సీ రెడ్డి రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్ లోని బికనూర్ లో గురువారం (మే 22) ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు (జీఎన్ రావు) బుధవారం (మే 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. హైదరాబాద్ కుందన్ బాగ్ లోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారని అనుమానం వస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశంపార్టీ ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడులో తెలంగాణ పార్టీ నేతలకు సముచిత స్థానం ఇచ్చింది. మహానాడు కోసం వేసిన 19 కమిటీలలోనూ తెలంగాణ తెలుగుదేశం నేతలకు స్థానం కల్పించింది.
సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు.
నూతన రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్ సర్టిఫికెట్ గానీ, పెళ్లి పత్రిక గానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలు గానీ అవసరం లేదని ఆయన తెలిపారు
వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సర్వం తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కర్మఫలం అనుభవించడానికి రెడీ కాక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్ర మంత్రిగా కిష‌న్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంట‌న్న‌ది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లు పెడితే టీపీసీసీ  చీఫ్ మ‌హేష్ గౌడ్ వ‌ర‌కూ అంద‌రూ అడిగి చూశారు. నో ఆన్స‌ర్. ఇక రాజాసింగ్ ని అడిగితే కిష‌న్ రెడ్డి కిరికిరిల‌న్నీ ఇట్టే బ‌య‌ట పెట్టేస్తారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ సర్వోత్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని జస్టిస్ గవాయి మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.