Publish Date:May 11, 2022
మాట తప్పను..మడమ తిప్పను అంటూ గోప్పగా చెప్పుకునే ఏపీ సీఎం.. వరుసగా మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. ఏపీ రాజధాని అమరావతే అన్న వాగ్దానం నుంచి ఈ మూడేళ్ల కాలంలో ఆయన మాట తిప్పని, మడమ తిప్పని సందర్భం ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలకు ముందు, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేస్తున్నట్లే కనిపిస్తూ.. ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తూ వచ్చారు. వృద్ధాప్య పింఛన్ల విషయంలోనూ ఆయన మాట తిప్పి మడమ తిప్పి తాతా అవ్వలను నిలువునా మోసం చేశారు. ఇలా ఏ విషయం చూసుకున్నా చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటోంది.
ఇప్పుడు తాజాగా ఆయన వాలంటీర్ల ప్రొబేషన్ విషయంలో మళ్లీ మాట తప్పి మడమ తిప్పారు. వాలంటీర్ వ్యవస్థ తన మానస పుత్రికగా గొప్పగా చెప్పుకునే జగన్ వారికి ప్రొబేషన్ ఇచ్చే విషయంలో ముందు వెనుకలాడుతున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. వారి జీవితాలను చిందర వందర చేసేదిగా ఉంది. ప్రొబేషన్ ఇవ్వడానికి అనధికారికంగా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొని..అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ ప్రొబేషన్ స్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. అయితే నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా జూన్ నుంచి అందరికీ ప్రొబేషన్ ఇస్తామని అన్నారు. వాలంటీర్లు నమ్మారు. అయితే ఇప్పుడు ప్రొబేషన్ కు అర్హులు ఎవరో చెప్పాలంటూ జిల్లా యంత్రాంగాలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంటే గతలో అనధికారికంగా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణతే అర్హతగా వాలంటీర్లకు ప్రొబేషన్ ఇస్తారన్న మాట.
అంటే వాలంటీర్లందరికీ ప్రోబేషన్ ఇస్తామన్న మాటను జగన్ తప్పారు. ఇచ్చిన హామీ విషయంలో మడమ తిప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలు రాసే ఉద్యోగంలోకి వచ్చారు. వారి సర్వీస్ రికార్డులో కానీ..జాయినింగ్ రిపోర్టులో కానీ రెండేళ్ల తర్వాత మరోసారి పరీక్షలు పెడతాం… అందులో పాసయితేనే ప్రొబేషన్ ఇస్తామనే షరతు ఎక్కడా పెట్టలేదు. పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగంలో చేరే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారనే ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా అప్పాయింట్ మెంట్ కూడా ఇచ్చింది. కానీ రెండేళ్లు గడిచాయో లేదో.. వారికి ఉద్యోగ భద్రత లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది.
పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఫెయిలయ్యారంటూ వాలంటీర్లలో కనీసం ముఫ్పై శాతం మందిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వాన్ని నమ్మి మంచి భవిష్యత్ను వదులుకుని సొంత ఊరిగా ఉద్యోగం అన్న ఆశతో గ్రామ, వార్డు సచివాలయాల్లో కేవలం పదిహేను వేలరూపాయల జీతానికి పని చేస్తున్న వాలంటీర్లను నిలువునా ముంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-decieve-valunteers-25-135737.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.