జగన్ కోవర్ట్ రాజకీయాలు ఫలిస్తున్నాయా?.. ఒంగోలు కూటమిలో బీటలు అందుకేనా?

Publish Date:Sep 23, 2024

Advertisement

ఏపీలో ఎన్డీయే కూట‌మికి బీట‌లు వారుతున్నాయా.. జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య విబేధాలు పొడ‌చూపుతున్నాయా.. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోవర్ట్ రాజకీయ వ్యూహంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిక్కుకుంటున్నారా? జ‌న‌సైనికులు, టీడీపీ శ్రేణులు అప్ర‌మ‌త్తం కాకుంటే త్వ‌ర‌లో ఎన్డీయే కూట‌మిలో   లుకలుకలు తార స్థాయికి చేరుకోవ‌టం ఖాయ‌మా?  అంటే అవున‌నే స‌మాధానమే  వినిపిస్తోంది. కూట‌మి నేత‌లు ఏ మాత్రం తొంద‌ర‌పాటుగా వ్యవహరించినా, టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పూడ్చ‌లేని అగాధం ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నిక‌ల ముందు   తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా జ‌ట్టు క‌ట్టాయి.   ఐదేళ్ల‌లో వైసీపీ  అరాచ‌క పాల‌న‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మూడు పార్టీలూ ఏక‌మ‌య్యాయి. ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌క, దోపిడీ పాల‌న‌తో విసిగిపోయారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మికి భారీ మెజార్టీ  క‌ట్ట‌బెట్టారు. వైసీపీని కేవ‌లం 11 స్థానాల‌కే ప్ర‌జ‌లు ప‌రిమితం చేశారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో సీఎంగా చంద్ర‌బాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలను జనసేనాని పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అప్పగించారు.  కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి100 రోజులు పూర్తి అయ్యింది.   వంద రోజుల్లో గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల వ‌ల్ల ఎదురైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటూ, రాష్ట్ర  అభివృద్ధిని సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రుగులు పెట్టిస్తున్నారు. ప్ర‌జ‌లుసైతం ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జీవ‌నం సాగిస్తున్నారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన అధికారులు, వైసీపీ నేత‌ల‌పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా ముంబై న‌టి జ‌త్వానీ కేసులో ముగ్గురు పోలీస్ ఉన్న‌తాధికారుల‌ను స‌స్పెండ్ చేశారు. ఆ కేసులో కీలక నిందితుడు, వైసీపీ నాయకుడు అయిన కుక్కల విద్యాసాగర్ అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 4 వరకూ రిమాండ్ విధించింది. అలాగే వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లుగా వ్యవహరించిన అధికారులను  చంద్ర‌బాబు నిర్దాక్ష్యిణ్యంగా ప‌క్క‌న పెట్టారు.  వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో అవినీతి అక్ర‌మాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం వెలికి తీస్తుండ‌టంతో వైసీపీ నేత‌ల్లో ద‌డ‌పుడుతోంది. ఎప్పుడు ఎవ‌రు జైలు కెళ్లాల్సి వ‌స్తుందోన‌న్న ఆందోళ‌న వైసీపీ నేత‌ల్లో నెల‌కొంది. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం తాడేపల్లికి చుట్టపు చూపుగానే వస్తున్నారు. ఎక్కువ‌గా ఆయన బెంగ‌ళూరులోనే మకాం వేస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి నిర్ణ‌యాలు తీసుకుంటూ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. ఒక‌రినొక‌రు గౌర‌వించుకుంటూ ప్ర‌భుత్వం, కూట‌మిలో పార్టీల నేత‌ల మ‌ధ్య విబేధాలు త‌లెత్తకుండా అవసరమైన అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నారు. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు మ‌ధ్య స‌ఖ్య‌త‌ను చూసి వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. వీ రిద్ద‌రూ క‌లిసి ఉంటే  తన పార్టీ ఉనికికే ప్రమాదం అని గ్రహించిన  మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు సృష్టించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీలో తన సన్నిహితులుగా ఉన్న నేతలను కోవర్టులుగా కూటమి పార్టీలలోకి పంపాలన్నదే ఆ ప్రాణాళిక అంటున్నారు. 

సీఎం చంద్ర‌బాబు నాయుడు దూకుడైన పాల‌న‌తో రాబోయే కాలంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని జ‌గ‌న్ స‌హా, వైసీపీ నేత‌లు ఆందోళ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ఉంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు రాబోయే కాలంలో వైసీపీ ప‌ట్టు కోల్పోవడం ఖాయమనీ, అదే జరిగితే పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం మాట అటుంచి వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశం ఉండదనీ   జ‌గ‌న్ ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది. కూట‌మిలో చీలిక‌లు తెస్తే త‌ప్ప రాబోయేకాలంలో రాజ‌కీయంగా మ‌నుగ‌డ సాగించ‌లేమ‌ని భావిస్తున్న జగన్  కూట‌మిలోని పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు సృష్టించేలా జ‌గ‌న్ ప‌క్కా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ప‌లువురు నేత‌లు జ‌న‌సేనలో చేర‌బోతున్నారు.  ఇప్ప‌టికే బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి,  సామినేని ఉదయభాను, కిలారు రోశ‌య్య వంటి నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. వారు ఈనెల 26న జ‌న‌సేన పార్టీలో చేరే అవ‌కాశం ఉంది. వీరితోపాటు మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు జ‌న‌సేన పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వీరంద‌రి చేరిక‌ల వెనుక జ‌గ‌న్ వ్యూహం ఉంద‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. దాదాపు ప‌ది మంది వ‌ర‌కు వైసీపీ కీలక నేత‌ల‌ను జ‌న‌సేన‌లోకి పంపించ‌డం ద్వారా.. టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు సృష్టించ‌డంతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించ‌డం జ‌గ‌న్ ప్లాన్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జ‌గ‌న్ వ్యూహంలో ప‌వ‌న్ చిక్కుకున్నార‌ని, కూట‌మి  బీట‌లు వారుతోందనీ, మ‌రికొద్ది నెల‌ల్లోనే టీడీపీ, జ‌న‌సేన పార్టీలు విడిపోవ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వైసీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. 

ఇప్ప‌టికే ఒంగోలులో రాజ‌కీయ ర‌చ్చ మొద‌లైంది. బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి జ‌న‌సేన పార్టీలో చేరుతున్నారు. ఆయ‌న చేరిక‌ను స్థానికంగా కొంద‌రు జ‌న‌సేన నేత‌ల‌తో పాటు, టీడీపీ నేత‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్ర‌మంలోనే బాలినేని ఒంగోలుకు వస్తుండటంతో ఆయ‌న అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీల్లో టీడీపీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌తోపాటు తెలుగుదేశం ఎంపీ మాగుంటి శ్రీ‌నివాసులు ఫొటోల‌ను కూడా ఉంచారు. దీంతో  తెలుగుదేశం నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆ ప్లెక్సీల‌ను తొల‌గించారు. ఫ‌లితంగా ఒంగోలులో మ‌రోసారి బాలినేని వర్సెస్ దామచర్ల అన్నట్లుగా రాజకీయాలు మారాయి. బాలినేని జ‌న‌సేన పార్టీకి వ‌స్తే ఆ పార్టీ నేత‌లు త‌ప్ప‌నిస‌రిగా బాలినేనికి స‌పోర్ట్ చేస్తారు. తెలుగుదేశం నేత‌లు దామ‌చ‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటారు. దీంతో జ‌న‌సేన‌,తెలుగుదేశం శ్రేణుల మ‌ధ్య విబేధాలు తార స్థాయికి చేరుతాయి. ఈ రెండు పార్టీల మ‌ధ్య విబేధాల‌ను వైసీపీ స‌ద్వినియోగం చేసుకుంటుందన్నది  రాజ‌కీయ  పరిశీలకుల విశ్లేషణ. జ‌గ‌న్ వ్యూహంలో భాగంగానే బాలినేని జ‌న‌సేన‌లోకి వ‌స్తున్నారని, రెండు పార్టీల మ‌ధ్య పూడ్చ‌లేని అగాధాన్ని ఏర్ప‌ర్చి.. ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌ద్ద‌కే బాలినేని వెళ్తార‌ని ప‌లువురు తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. జ‌న‌సేన పార్టీలో చేరుతున్న వారిలో అధిక‌శాతం మంది వైసీపీ నేత‌లు జ‌గ‌న్ సూచ‌న‌ల‌తోనే పార్టీని వీడుతున్నార‌ని.. వీరిప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ జాగ్ర‌త్త‌గా ఉండ‌కుంటే కూట‌మి ప్ర‌భుత్వంలో చీల‌క రావ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. 

By
en-us Political News

  
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.