ఎదురుదాడికి జగన్ కు ఇక మిగిలింది ఎన్నికల సంఘమే!

Publish Date:May 8, 2024

Advertisement

ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు. పాపం ఆయనకు ఎన్నికలు తను అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకూ సన్నగిల్లిపోతోందట. 2019లోనే ఎన్నికలు కూడా ఆయన కోరుకున్న విధంగా సక్రమంగా జరిగాయి. అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతా తాననుకున్నట్లే, తనకు కావలసినట్లే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా తనకు కావలసిన విధంగా ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలో మెజారిటీ అధికారులు తాను చెప్పిందల్లా చేస్తుంటే.. ఈ ఎన్నికల సంఘానికి ఏం వచ్చింది. ఇష్టారీతిన అధికారులను మార్చేస్తోంది. అదీ విపక్ష కూటమి నేతల ఫిర్యాదులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ఆయనకు సుతరామూ నచ్చడం లేదు. అందుకే ఆయన ఎన్నికలలో విజయంపైనా నమ్మకం కోల్పోయారు. ఎన్నికలు సజావుగా జరుగవన్న నిశ్చయానికీ వచ్చేశారు. ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తోందంటూ విమర్శలకు దిగారు.  

తన ఐదేళ్ల పాలనలో తన విధానాలు వేలెత్తి చూపే, గొంతెత్తి ప్రశ్నించే వారిపై వేధింపులు, ఎదురుదాడే అస్త్రంగా సంధించి వారి గొంతులను అణిచివేసిన జగన్. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై కూడా ఎదురుదాడే అస్త్రంగా ముందుకు సాగారు. ఇప్పటి వరకూ ప్రత్యర్ధులపై ఎదురుదాడినే అస్త్రంగా నమ్ముకున్న జగన్..  ఇప్పుడు ఎన్నికల సంఘంపైనా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తనకు అనుకూలంగా వ్యవహరించే డీజీపీ, ఏడీజీ, ఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లు, డీఎస్పీలపై వేటుతో వణికిపోతున్న జగన్.. ఎన్నికల సంఘంపై రుసరుసలాడుతున్నారు. యథా నాయకా, తథా అనుచరులు అన్నట్లుగా జగన్ బాటలోనే  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు,  నేతలు నడుస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు, పథకాల నిలిపివేతపై జగన్ నుంచి ఎమ్మెల్సీల చేస్తున్న ఎదురుదాడి వారిలో విజయం పట్ల కొరవడిన నమ్మకానికి నిదర్శనంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

గత ఎన్నికల సమయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పటి అధికార పార్టీపై ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేశారు. ఆయన, ఆయన చేసిన ప్రతి ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలా ఆఘమేఘాల మీద స్పందించిదీ అన్నది గుర్తు చేస్తూ, చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు.  గత ఎన్నికల ముందు.. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అండ్‌కో  ఫిర్యాదుల మేరకు ఎలాంటి జాప్యం లేకుండా అప్పటి సర్కార్ లోని ఐఏఎస్, ఐపీఎస్ , డీఎస్పీలను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టిన సంగతి తెలిసిందే.   ప్రధానంగా నాటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా, డీజీపీ , ఇంటలిజన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు ఎస్పీ, కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆఘమేఘాల మీద మార్చేసింది.  ఈ విషయాలను ఇప్పడు అధికారంలో ఉన్న వైసీపీ కన్వీనియెంట్ గా మర్చిపోతే పోవచ్చు కానీ, జనానికి ఐదేళ్ల కిందటి సంగతులన్నీ ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి గుర్తుకు వచ్చేస్తున్నాయి. వైసీపీ తీరు గురువింద గింజ సామెతగా ఉందని ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పింఛన్ల పంపిణీ నుంచీ, ఎన్నికల వేళ నిధుల విడుదల కోసం అభ్యర్థనలు పంపడం వరకూ ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి జగన్ రెడ్డి పాలనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా, ఎన్నికల సంఘం ఇంకా ఆయనపై ఎందుకు వేటు వేయలేదని ఆశ్చర్యపోతున్నారు.  

ఏది ఏమైనా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్య వైసీపీ నేతలు, కేడర్, చివరాఖరికి అభ్యర్థులు కూడా ఓటమి ఖరారైపోయిందన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. దీంతో వారు సరిగ్గా ఎన్నికల వేళ కాడె వదిలేసినట్లు కనిపిస్తోంది. జగన్ సభలు జనం లేక వెలవెల బోతుండటమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగనే ఓటమి భయంతో వణికి పోతుంటే.. తామెంత అనుకుంటున్న వైసీపీ అభ్యర్థులు ఎన్నికలలో సొమ్ములు ఖర్చు పెట్టడం వృధా అన్న భావనకు వచ్చి జగన్ సభలకు కూడా జనసమీకరణ చేయడానికి ప్రయత్నించడం లేదు.  మొత్తంగా  ఎన్నికలు సక్రమంగా జరగవేమోనంటూ జగన్ చేసిన  వ్యాఖ్యలు, వైసీపీ అభ్యర్ధుల మనోస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. ఎ ఆ ప్రభావం వైసీపీ ప్రచారంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 

By
en-us Political News

  
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.