Publish Date:Sep 25, 2025
జగన్ డిజిటల్ బుక్ తెరవడంతో ఆయనకు ఏదీ స్వయంగా తయారు చేయడం రాదని క్రిస్టల్ క్లియర్ గా అర్ధమై పోయింది. ఆయన పెద్ద సంక్షేమ రూపశిల్పి కూడా ఏమీ కాదు. గతంలో తన తండ్రి ప్రవేశ పెట్టిన వాటికే కాస్త సొబగులు అద్దారాయన. అది కూడా ఏమంత ఒరిజినల్ కాదు. ఇదంతా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రండ్. ఇప్పుడు చూస్తే జగన్ తన వెల్ఫేర్ ఇతరత్రా పథకాల సోర్స్ మొత్తం లోకేషే అనడంలో ఎలాంటి అనుమానమే లేదు..
ఔను నిజమే.. మీరు చదువుతున్నది నిజం. జగన్ కి కొత్త ఆలోచన ఏదీ రాదు. ఒకప్పుడు లోకేష్ కార్యకర్తలకు జీతాలు అనే కాన్సెప్ట్ నే తర్వాత జగన్ మక్కీకి మక్కీ కాపీ కొట్టి దాన్ని వాలంటీర్లుగా మార్చారు. కావాలంటే చూడండి.. ఆయన అపాయింట్ చేసిన చాలా మంది వాలంటీర్లలో అత్యధిక శాతం మంది రెడ్లే కనిపిస్తారు. ఇప్పుడు వాళ్లకు కూడా మొండి చేయి ఇచ్చారు. అదే లోకేష్ ఒక వైసీపీ కార్యకర్తను కూడా ఆదుకుంటూ.. ఆయన ఆరోగ్య ఖర్చులు మొత్తం తాము భరిస్తామన్న భరోసా ఇచ్చారు. మానవత్వం చాటుకున్నారు. తర్వాత డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్. ఇవి స్టాన్ ఫర్డ్ లో చదివి, వరల్డ్ బ్యాంక్ లో పని చేసిన అనుభవజ్ఞుడైన లోకేష్ బ్రైన్ చైల్డ్. ఈ కాన్సెప్ట్ ద్వారానే జగన్ చాలా వరకూ నేరుగా జనం ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. లోకేష్ కూడా ఇదంతా నాది అన్న కోణంలో ఏదీ చెప్పుకోరు.
ఇప్పుడు చూస్తే రెడ్ బుక్. మాములుగా ఒక మాట అంటుంటారు. నువ్వు చేసిన పనిని ఇతరులు కాపీ కొడితే నువ్వొక ట్రెండ్ సెట్టర్ అని. ఎగ్జాట్ గా లోకేష్ కూడా అంతే. ట్రెండ్ ఫాలో కాడాయన- సెట్ చేస్తారని అంటారు చాలా మంది. మీరు కావాలంటే చూడండి.. లోకేష్ రెడ్ బుక్ ఎంత ఫేమస్ అంటే, పొరుగు రాష్ట్రం నుంచి కవిత కూడా తాము పింక్ బుక్ రాస్తామని అన్నారు. ఇక జగన్ అయితే ఓడిపోయిన తొలి నాళ్లలోనే తాము బ్లూ బుక్ రాస్తామన్నారు.
ఇప్పుడు చూస్తే బ్లూ అంటే తనను కాపీ క్యాట్ అంటారని భావించారేమో.. దాన్ని డిజిటల్ బుక్ గా మార్చారు. కానీ కాపీ కాపీ కాకుండా పోతుందా? జగన్ ఏదీ ఒరిజినల్ కాదు. అంతా డూపే అన్న ముద్ర పడే తీరుతుందని అంటున్నారు చాలా మంది వైసీపీ వర్గాల వారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-copy-paste-story-39-206853.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!