హాజరు కోసమే సభకు జగన్!?

Publish Date:Feb 11, 2026

Advertisement

ప్రతిపక్ష హోదా ఇస్తేనే  అసెంబ్లీకి వస్తానంటూ మంకుపట్టు పట్టి ఇంత కాలం అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన జగన్.. ఎట్టకేలకు తన పట్టు వీడి అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో ఆయన సభలో అధికారపక్షాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తారని అంతా భావించారు. అయితే  పరిశీలకులు  మాత్రం జగన్ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నది కేవలం హాజరు కోసమేననీ, హాజరు వేయించుకోవడం ద్వారా తన, తన పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వానికి ఎటువంటి ఇబ్బందీ కలగదన్న భావనతోనే ఆయన అసెంబ్లీకి హాజరవ్వడానికి నిర్ణయించుకున్నారని విశ్లేషించారు.

తీరా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున జగన్ అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. తన పార్టీ సభ్యులతో కలిసి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్న జగన్.. అసెంబ్లీలో తన పార్టీ సభ్యుల సంఖ్యను బట్టి ఒక్కో సభ్యుడికీ ఒక్కో నిముషం అన్నట్లుగా కేవలం 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు.  ఆ ఉన్న కాసేపూ కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి దారుణం అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. తమ నినాదాలతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగానికి గౌరవమిచ్చి తమతమ స్థానాలలో కూర్చోవాలని తెలుగుదేశం కూటమి సభ్యులు పలుమార్లు కోరినా వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. వైసీపీ సభ్యుల నినాదాలను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం ఇంకా పూర్తి కాకుండానే.. తిరుమల లడ్డూ ప్రసాదంలో  కల్తీ నెయ్యి అంశం, మెడికల్ కాలేజీల పీపీపీ అంశాలకు నిరసనగా వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యులూ కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మిత్రమే సభకు హాజరయ్యారని రాజకీయవర్గాలలో చర్చ మొదలైంది.

 ఆరు నెలల గైర్హాజర్ నిబంధన పరిధిలోకి రాకుండా ఉండేందుకు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  స్పీకర్ అయ్యన్న పాత్రుడు  అసెంబ్లీ చరిత్రలో తొలిసారి డిజిటల్ అటెండెన్స్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గతంలోలా   అసెంబ్లీ అటెం డెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్లియే అవకాశం , వైసీపీ సభ్యులకు లేకుండా పోయింది.  ఇప్పుడిక ఆ అవకాశం లేదు. అది పక్కన పెడితే.. సభలోకి అడుగుపెట్టడానికి ముందు కూడా అసెంబ్లీ ప్రాంగ ణంలో జగన్ తో పాటు వైసీపీ సభ్యులంతా ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.