సింహాచలం గోడ కూలిన ఘటనలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరు?
వైసీపీ ప్రశ్నలకు సమాధానమేంటి?
వేళ్లన్నీ గత పాలకుల పాపాలవైపే
సింహాచలం గోడ కూలిన ఘటనలో అసలు ద్రోహి కూటమి ప్రభుత్వం అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అంతే కాదు ఇటు తిరుమల తొక్కిసలాట, అటు సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలడం వంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించడం లేదన్నది వీరి ఆరోపణ.
ఇక్కడ జరిగిన అసలు వాస్తవాలేంటని చూస్తే.. సింహాచలం గోడ లక్ష్మణ రావు అనే కాంట్రాక్టర్ కి రూ. 54 కోట్ల రూపాయలతో ఇచ్చింది 2023లో. అది కూడా జగన్ హయాంలో. కానీ ఆ గోడ కూలింది కూటమి ప్రభుత్వంలో. కాబట్టి ఆ పాపమంతా కూటమిదే అంటుంది వైసీపీ. మరి నాసిరకం ఇటుకలు, నాణ్యత లేని సిమెంటు ద్వారా కట్టే కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇచ్చిన తప్పిదం వల్లే కదా ఇదంతా జరిగిందన్నది కూటమి నేతలు వేస్తోన్న రివర్స్ కౌంటర్.
ఒక్క పవనే కాదు.. కూటమి తరఫున ఎవరు మాట్లాడాల్సి వచ్చినా సరిగ్గా ఈ పాయింట్ దగ్గర్నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు నేడు శాపాల రూపంలో ఆంధ్రులను వెంటాడుతున్నాయనే చెప్పాల్సి వస్తుంది. తిరుమలలో కూడా అంతే! కేవలం దేశీ ఆవుల మాత్రమే(అంటే ప్రాంతీయ ఆవులు) ఉండాల్సిన గోశాలలో ఎక్కడెక్కడి నుంచో ఆవులు తెచ్చింది వాళ్లే. గోవుల మరణాల సంఖ్య లెక్కకు మించి చూపించిందీ వాళ్లే.. అంతే కాకుండా ఫేక్ ఇమేజీలతో ట్రోల్ చేసింది కూడా వాళ్లే. ఇలాంటి దుష్ప్రచారాలపై ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ దిశగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీస్కోవాలన్న డిమాండ్ వినవస్తోంది. ఇక తొక్కిసలాట ఘటన వెనక ఎవరున్నారో.. వారిపై కఠిన చర్యలు తీసుకున్నందుకు గోమరణాలనే వ్యవహారం ఉన్నట్టుండి ఎందుకు బయట పడిందో అందరికీ తెలిసిందే. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా కనిపించేది గత పాలకుల తాలూకూ తప్పిదాలే. ఒక వేళ కూటమి నేతలు నిలదీయాల్సి వస్తే గత పాలక పక్షమైన వైసీపీని నిలదీయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినా వైసీపీ కావాలని కూటమిని టార్గెట్ చేసి తానిలా బుక్ అయిపోతోంది. సింహాచలంలో నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లకు టెండర్ ఇచ్చింది చాలక ఆ తప్పు కూడా మీదే అనడం.. లాజిక్కులు లాగటం పైకి బాగానే ఉన్నా.. అది దైవ ద్రోహం కిందకు వస్తుంది. ఇప్పటికే ఎన్నో దైవ ద్రోహాల ఘటనల్లో అడ్డంగా బుక్కయిన జగన్ అండ్ కోకి దేవుడితో పెట్టుకుంటే పంగనామాలే అని సీట్ల రూపంలో తెలిసివచ్చినా ఇంకా అదే దుర్బుద్ధి. అదేమంటే మాజీ మంత్రి రోజా వెంకన్నతో పెట్టుకుని పవన్ కి బాగా తెలిసి వచ్చిందంటున్నారు. ఈ విషయంలో ఫస్ట్ తెలుసుకోవల్సిందే వారు. వైసీపీ దేవుడితో అన్నేసి సయ్యాటలాడ్డం వల్లే అంత అడ్డంగా ఓడామని గుర్తించాలి.
ఇప్పటికే టీటీడీ వంటి హిందూ ధార్మిక ప్రాంతాల నిండా భారతమ్మ సైన్యం అలుపెరుగక పని చేస్తోంది. ఇలాంటి కుట్రలకు పాల్పడ్డానికి వారు చేయని పాపం లేదన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ టీటీడీలో వీరి సంఖ్య 2 వేల వరకూ ఉండొచ్చని అంచనా. మరి వీరందరి చేతా చేయించాల్సింనదంతా చేయించి.. ఆ పాపం తీస్కొచ్చి కూటమి ప్రభుత్వం మీద వేయడం ఎంత వరకూ సమంజసం? అన్నది వారికి వారే ఆత్మావలోకనం చేస్కోవాలంటున్నారు సామాన్యులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-behind-simhachalan-wall-collapse-39-197476.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.