కాంగ్రెస్ హస్తరేఖల్లో జగన్ జాతకం!

Publish Date:Dec 13, 2012

Advertisement

 

తన బెయిలాశలన్నీ ఒకటొకటిగా అడియాసలవుతుంటే, క్రమంగా చంచల్ గూడా జైల్లో స్థిరపడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నవ్వాలో బాధపడాలో తెలియని పరిస్తితి నెలకొంది. ఒక వైపు జైలునుండి బయటపడలేని దీనస్థితి. మరోవైపు తనపార్టీలోకి జేరెందుకు జైల్లోకి బారులు తీరి వస్తున్న రాజకీయనాయకులూ! తానూ జైల్లోఉన్నపటికీ అంతగా ప్రభావం చూపగలుగుతున్నందుకు సంతోషించాలా? లేక జైలే తన కార్యాలయం అయిపొయినందుకు బాధపడాలా అతను? మొత్తంమీద అతనిప్పుడు ఒక త్రిశంకు స్వర్గంలో వ్రేలాడుతున్నాడు.

 

ఇక, ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ కీలకతరుణంలో, ఈ విధంగా నిస్సహాయంగా జైలుగోడల మద్యన ఇర్రుకుపోవడం మరో దురదృష్టమేనని చెప్పాలి. ఎప్పటికయినా, తను బయటకి వస్తాడా? లేక కలకాలం సి.బి.ఐ. కేసులతో నలిగిపోతూ చంచల్ గూడా జైలులోనే భారంగా బ్రతకలా?రేపు ఎన్నికలు వచ్చేనాటికయినా తానూ బయట పడకపోతే పార్టీకి దిక్కెవరు?పార్టీలోకి వస్తున్న లేదా ఇప్పటికే వచ్చినవారిని నిలుపుకోనేదేలా?తానూ జైల్లో ఉంటే తనపార్టీ ఇంతే పటిష్టంగా ఉంటూ రేపు ఎన్నికలని దైర్యంగా ఎదుర్కొనగలదా? లేక ఒకప్పుడు ప్రజారాజ్యం లాగానే కుప్పకూలిపోయి చివరకి ఆ కాంగ్రెసులోనే కలిసిపోక తప్పదా? జైల్లో ఉండి తానూ పార్టీని గెలిపించుకొని ఆ పార్టీ అండతోనే జైల్లోంచి బయట పడతాడా? లేక తన తల్లీ చెల్లీ ప్రజలకి చెపుతున్న విదంగా తానూ నిర్దోషిగా జైలునుండి విముక్తుడయి హుందాగా ఎన్నికలలో పాల్గొని రాజ్యదికారం హస్తగతం చేసుకొంటాడా? కాంగ్రెస్ అతనిని మళ్ళీ పార్టీలోకి స్వాగతించి కేసులనీ రద్దు చేసేసి, ముఖ్యమంత్రిగా అతనికి పట్టంకడుతుందా లేక అతనిపై మరిన్ని కేసులు నడిపించి శేషజీవితం జైల్లోనే గడిపేలా చేస్తుందా? సమాధానం దొరకని ఇటువంటి బేతాళ ప్రశ్నలు ఎన్నెనో జగన్ మనసుని దోలిచేస్తూ ఉండవచ్చును. బహుశః ఇటువంటి జీవితాన్ని కలలో కూడా అతను ఊహించి ఉండడు.

 

అతని జాతకం అతని బవిష్యత్ గురించి  ఏమి చెపుతోందో తెలుసుకోవాలంటే చూడవలసింది అతని హస్త రేఖలు మాత్రం కాదు. కాంగ్రెస్ ‘హస్తరేఖలు’ అతని జాతకం వివరించబోతున్నాయి. సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రేసు పార్టీ మున్ముందు మరింత బలహీన పడితే తప్ప అతనికి స్వేచ్చ లబించే అవకాశం లేకపోవచ్చు. ఒక వేళ, కాంగ్రెస్ మరింత బలహీనపడినప్పుడు, అది సహజంగా జగన్ వంటి ఆకర్షణగల నాయకుడికోసం తన ద్వారాలు తెరవకతప్పదు. రానున్న ఎన్నికలలో బలంగా ఉన్న తె.రా.స.ను డ్డీ కొనడం, మంచి కార్యకర్తల బలం కలిగి రాబోయే ఎన్నికలలో చావో రేవో తెల్చుకోబోయే తే.దే.ప.ఇచ్చే గట్టి పోటీని తట్టుకోవడం, పార్టీలో అంతర్గతకుమ్ములాటలకు ముక్కుతాడు వేయడం వంటి క్లిష్టమయిన సవాళ్లు ముందున్న కాంగ్రెస్ పార్టీ, వాటిని దైర్యంగా అదిగమించగలనని భావిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి విముక్తి ఉండకపోవచ్చును. ఒకవేళ, కాంగ్రేసు పార్టీ బలంగా ఉంటే ఆ తరుణంలో జగన్ వంటిబలవంతుడయిన, ప్రభావంతుడయిన విరోదిని కోరుండి అది జైలు నుంచి బయటకి రానిచ్చి కొరివితో తల ఎందుకు గోక్కోవాలని ఎందుకు ఆలోచిస్తుంది? గనుక, వీలయితే అతనిని మరిన్ని కేసులలో ఇరికించి కనీసం ఎన్నికలయ్యేవరకయినా, తన విజయానికి అడ్డుగోడగా నిలువగల అతనిని జైలుగోడలకే పరిమితం చేయవచ్చును. అందువల్ల, కాంగ్రెస్ మరింత బలహీనపడితే తప్ప జగన్కి జైలు విముక్తి లంబించకపోవచ్చును. కాంగ్రేసుకి కష్టం అనుకొంటే మాత్రం అతను రేపు ‘తల్లి కాంగ్రేసు’ ఒడిలో ఒదిగిపోయి మనకి కనిపించినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, జగన్ ఇప్పుడు కోర్టుతీర్పులకన్నా కాంగ్రెస్ బలహీన పడటం కోసమే చకోర పక్షిలా ఎదురు చూపులు చూస్తూ చంచల్ గూడా జైల్లో వేచి ఉండక తప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.