సుప్రీం నోటీసులు..మంత్రులు, ఐఏఎస్లలో కలవరం
Publish Date:Mar 14, 2012
Advertisement
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్లకు నోటీసులు జారీ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు కలకలం సృష్టిస్తున్నాయి. 'ఆ 26 జీవోలు' జారీ చేసిన మంత్రులు, అధికారపక్ష నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... లోలోపల మాత్రం ఆందోళన కనిపిస్తోంది. 'ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో!? ఇది ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో?' అనే చర్చ మొదలైంది. ఆస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కడప లోక్సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డికి సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలం కానుందా? సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లో పిటిషన్దారుడు పేర్కొన్న ఇరవై ఆరు జీవోలను అప్పటి సంబంధిత మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుందా? లేక తప్పు జరిగినట్టు అంగీకరిస్తారా? అన్న దానిపై జగన్ ఆక్రమ ఆస్తుల కేసులో సిబిఐ జరుపుతున్న విచారణపై ప్రభావం చూపించవచ్చునని భావిస్తున్నారు.
ఆ జీవోలు సక్రమమే అని వాదించే పక్షంలో జగన్ మీద చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టమవుతుంది. ఫలితంగా జగన్కు ఊరట లభిస్తుంది. ఒకవేళ జీవోలు సక్రమం కాదని చెప్పిన పక్షంలో సంబంధిత మంత్రులపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఈ నేపథ్యంలో... మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఇతర నేతలు సుప్రీం నోటీసులపైనే చర్చించుకోవడం కనిపించింది. డాక్టర్ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ప్రభుత్వం కొందరికి ప్రయోజనం కలిగించేలా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జగన్ సంస్థల్లో పెట్టుబడులు వచ్చాయన్నది ఆరోపణ.
దివంగత వైఎస్ ప్రభుత్వం ‘ఇచ్చి పుచ్చుకునే విధానం ’ (క్విడ్ ప్రో క్యూ) అనుసరించడం వల్లే జగన్కు అక్రమంగా ఆస్తులు సమకూరాయన్నది అభియోగం. దీనిమీదనే ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతోంది. వైఎస్ హయాంలో ఇరవై జీవోలు అక్రమంగా జారీ అయ్యాయని, జీవోల జారీకి బాధ్యులుగా పేర్కొంటూ ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఒకవేళ మంత్రులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసే పక్షంలో వ్యక్తిగతంగా జారీ చేస్తుందా? లేక ప్రస్తుత మంత్రులుగా జారీ చేస్తుందా? అన్న చర్చ కూడా మంత్రుల్లో జరిగింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో ‘అప్పటి మంత్రులు (ది దెన్ది మినిస్టర్స్) అని పేర్కొన్నారు కాబట్టి, వ్యక్తిగత హోదాలోనే వారికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయవచ్చని, ప్రభుత్వానికి ఇందులో సంబంధం ఉండదని గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. అందువల్ల సుప్రీం నోటీసులకు ప్రస్తుత మంత్రులు వ్యక్తిగత హోదాలోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదని వారికి ఆయన చెప్పారు.
http://www.teluguone.com/news/content/jagan-asserts-case-24-12621.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





