ఎన్నికలైన వెంటనే విదేశాలకు జగన్.. దేనికి సంకేతం?

Publish Date:May 9, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధంలో ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చి అస్త్ర సన్యాసం చేసేశారా? ఎన్నికలు నాలుగు రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. పోటీలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ.. ఈ నాలుగు రోజులూ విశ్రాంతి గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సాధ్యమైనంత మందిని కలిసి ఓటు అభ్యర్థించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇతరత్రా విషయాలను అసలు పట్టించుకోరు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం మధ్యలో విరామం తీసుకుంటున్నారు. ఎవరినీ కలవకుండా, పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయకుండా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమౌతున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ప్రచారం జోలికి వెళ్లకుండా ప్యాలెస్ కు పరిమితమైపోయారు. ఔను ఈ నెల 2, 3, 8 తేదీలలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. పోనీ ఎండల్లో తిరగడం వల్ల వచ్చిన అస్వస్థతతో విశ్రాంతి తీసుకున్నారా అంటే అలాంటి సంకేతాలేమీ లేవు. ఎన్నికల ప్రచారం కంటే ముఖ్యమైన పనులేవో ఆయన చక్కబెట్టుకుంటున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. 

అందుకు కారణాలు లేకపోలేదు. కొన్ని రోజుల కిందట.. తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద సీఐడీ సిబ్బంది కీలక ప త్రాలను దగ్ధం చేసిన సంగతి తెలసింది. జగన్ అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరించే సీఐడీ చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకే ఆ పత్రాల దగ్ధం జరిగిందని స్వయంగా సిట్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. నాడు దగ్ధం చేసిన పత్రాలలో హెరిటేజ్ కు చెందిన కీలక పత్రాలు, అలాగే చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పత్రాల దగ్ధం సమయంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొందరిని ఆ వీడియోలు, పొటోలు తమకు ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు ఒత్తిడి చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ను అధికారులు చట్ట విరుద్ధంగా పొందారని, వాటినే  దగ్ధం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినవచ్చాయి. అంటే అప్పటికే రాష్ట్రంలో ప్రజల మూడ్ వైసీపీకి వ్యతిరేకంగా ఉందనీ, ఎన్నికలలో ఓటమి ఖాయమనీ వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చేసి.. ఆ పత్రాల దగ్ధానికి సీఐడీ చీఫ్ ను పురిగొల్పి ఉంటుందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.

 అంతే కాకుండా ఎన్నికలలో వైసీపీ పరాజయం ఖాయమనీ, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు ఇప్పుడు సర్దుకునే పనిలో పడ్డారనీ అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇప్పుడు సిట్ కార్యాలయంలో పత్రాలు దగ్ధం సంఘటన జరిగిన నెల రోజులకు జగన్ ప్రచారంలో తరచూ విరామం తీసుకుంటూ.. ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపైనా అటువంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఓటమి ఎటూ తప్పదు.. కనీసం తప్పులు దొరకకుండా తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై ఆయన ప్యాలెస్ లో మంత్రాంగం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా మే 13న పోలింగ్ జరుగుతుంది. సరిగ్గా నాలుగు రోజుల తరువాత జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారు. భార్య భారతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థిస్తూ  పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్, స్విట్జర్ ల్యాండ్, ఫ్రాన్స్ లో పర్యటించనున్నట్లు తెలిపారు.  ఏపీలో పోలింగ్ పూర్తయిన వెంటనే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ విదేశీ పర్యటన అభ్యర్థనపై సీబీఐ కోర్టు గురువారం (మే9) విచారించనుంది.

ఓటమి భయంతో జగన్ కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయనకు స్వయానా సోదరి షర్మిల ఇప్పటికే ఆరోపించారు. అంతే కాకుండా వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనీ, ఈ ఎన్నికలలో ఓటమి పాలైతే అరెస్టు తథ్యమనే భయంతోనే ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపించారు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే పీక్ టైంలో ప్రచారాన్ని సైతం వదిలేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపై అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.   

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.