ఆడలేక మద్దెలు ఓడు!

Publish Date:Jul 18, 2022

Advertisement

ఏపీలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైనా, జనం అష్టకష్టాలూ పడుతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదనీ, పట్టించుకోవడం లేదనీ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మంత్రి అంబటి మాత్రం తమ ప్రభుత్వం వరద సమయంలో అద్భుతంగా పని చేసిందనీ, ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందనీ చెబుతున్నారు. పోలవరం కాపర్ డ్యాం ఎత్తు పెంచి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత మాదేనని చెబుతున్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే వరద బాధితులకు రేషన్ తో పాటు రెండు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకూ తమది మాత్రమేనని చెప్పు కుంటున్నారు. ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రుల ప్రకటనల సంగతి ఎలా ఉన్నా క్షేత్ర స్థాయిలో ప్రజలు మాత్రం  వరద ముంపునకు గురైన  తమను ప్రభుత్వం తమ ఖర్మకు తమను వదిలేసిందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో  ప్రజల నిరసన సెగలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ప్రజా నిరసనల గురించి ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.

అసలు ఎమ్మెల్యేలు తాను ఆదేశించినా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓ 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే  ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారనీ, మిగిలిన వారు అసలు పట్టించుకోనే పట్టించుకోవడం లేదనీ ఆగ్రహవం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమంపై సోమవారం సమీక్షించిన జగన్ ఎమ్మెల్యేల తీరుపై తవ్ర అసహనం వ్యక్తం చేశారు.

గడప గడపకూ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లకు గడపగడపకూ కార్యక్రమమే గీటురాయని జగన్ స్పష్టం చేశారు. పని తీరు మార్చుకుని ప్రజల్లోకి వెళ్లిన వారికే టికెట్లని జగన్ స్పష్టం చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో జనం సమస్యలపై నిలదీస్తున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భంగానే చెప్పేశారు. అప్పట్లో రూ.2 కోట్లు విడుదల చేస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఇది జరిగి మూడు నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

అసలు లోపం తన దగ్గర పెట్టుకుని మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం లాభమని సమీక్షా సమావేశంలోనే పలువురు ఎమ్మెల్యేలు గొణుక్కున్నారని సమాచారం. ఆడలేక మద్దెలు ఓడు అన్న చందంగా నిధులు విడుదల చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేయండి అంటూ ఆదేశాలు జారీ చేసి.. మళ్లీ అవి పరిష్కారం కావడం లేదని చిటపటలాడటమేమిటని ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో మధన పడుతున్నారు. మీట నొక్కేసి అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నానని గప్పాలు కొట్టుకుంటే సరిపోదనీ, క్షేత్ర స్థాయిలో పథకాల కోతలపై జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాగ్నిని గమనించాలని ఎమ్మెల్యేలు అంటున్నారు. అయతే ఈ విషయాన్ని నేరుగా అధినేతకు చెప్పేదెలా అని మధన పడుతున్నారు. బెజవాడ కార్పొరేషన్ నిధుల గురించి కొందరు అడిగితే అవే వస్తాయిలే అని తేలిగ్గా కొట్టిపారేయడాన్ని ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

మంత్రి శంకరనారాయణను నిలదీసిన మహిళపై మద్యం కేసు పెట్టడమేమిటని కూడా పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సమస్యపై నిలదీసినప్పుడు దానిని పరిశీలించి పరిష్కరించాల్సినది పోయి కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలలో మరింత పలుచన కావడం ఖాయమని వారు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. జగన్ చెప్పినట్లు ఇంక 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికైనా అధినేత తీరు మారకపోతే.. ఆయన టిక్కెట్లు ఇవ్వకపోవడమే ఎమ్మెల్యేలే మహద్భాగ్యంగా భావించే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.