దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పార్టీని నడిపిస్తోంది. జగన్ షర్మిలల మధ్య ఉన్న విభేదాలు జరిగిన ఎన్నికల్లో మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జగన్ పై ఆ ఎన్నికల్లో షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డి కూతురు సునీతను వెంటబెట్టుకొని బాబాయ్ హత్య గురించి ఎన్నికల్లో తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. ఆ ఎన్నికల నుండి ఇద్దరు మధ్య రాజకీయ, కుటుంబ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలులలో జరిగే తండ్రి వైయస్ జయంతి వేడుకల్లోగాని, వర్ధంతి వేడుకల్లో గాని వేరువేరుగానే పాల్గొంటూ నివాళులర్పిస్తూ వస్తున్నారు.
మంగళవారం (జులై 8) జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలల్లోనూ ఇదే తీరున ఎవరికి వారుగా తండ్రికి నివాళులర్పించారు. వారి తల్లి విజయం మాత్రం ఇద్దరితో కలిసి ఘాట్లో నివాళులు అర్పించారు .ఉదయం 7:30 కు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, తల్లి విజయమ్మ, బంధువులు, కుటుంబ సభ్యులు, వైసిపి నాయకులతో కలిసి ఉదయం 8 .45 గంటల నుంచి 9.54 గంటల వరకు నివాళులర్పించి ప్రార్థనలు చేసి జగన్ వెళ్ళిపోయారు.జగన్ వెళ్లిన తర్వాత ఆయన సోదరి షర్మిల వైయస్ ఘాట్ కు వచ్చి తండ్రికి నివాళులర్పించారు. తల్లి విజయమ్మ అటు జగన్ తోనూ ఆ తర్వాత షర్మిళ తోను నివాళులర్పించడం ఆమె లో భావోద్వేగాన్ని నింపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-and-sharmila-pay-tributes-to-father-ysr-39-201507.html
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుయడు కోసం కొత్త ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత రెండు వారాలుగా చంద్రబాబు ఈ కొత్త హెలికాప్టర్ లోనే పర్యటనలు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత ఉందని అంతా భావించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె అధ్యక్షత వహిస్తోన్న తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీ చేస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి.
భారత్ అంటే భగ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా ఇండియాపై యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అసలైనా సరే రాబట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ వస్తు,సేవల పన్ను విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అడ్డాలోనే ఆ పార్టీని మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్.. మూడు నెలల ముందు స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇసుమంతైనా వెనుకాడటం లేదు.
వైసీపిలో తిరుగుబాటు జరగనుందా? మరీ ముఖ్యంగా ఇప్పడు వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు జగన్ ను ధిక్కరించనున్నారా? త్వరలో అంటే ఈ నెలలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చ జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధకారంలో ఉన్న సమయంలో సజ్జల పార్టీనీ, ప్రభుత్వాన్నీ గుప్పిట పట్టి ఓ ఆటాడుకుంటే.. ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల.. అదే నండి సజ్జల్ బార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా పెత్తనం చెలయించారు.
కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా సంచలనంగా మారి, పార్టీలో సంక్షోభానికి కారణమైన కేసీఆర్ తనయ కథ ముగిసినట్లేనా? అంటే కాదు అన్న సమాధానమే వస్తోంది. పరిశీలకులు బీఆర్ఎస్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు.
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఆయన చాలా గ్యాప్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అయితే ఈ నెలాఖరులోగా స్థానక ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో మారు హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం వైసీపీ పునాదులనే కదిపేలా ఉండటంతో ఆ పార్టీలో కంగారు మొదలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టై జైలు పాలైన తమ పార్టీ నేతలను కలవడానికి కూడా వైసీపీ అధినేత జగన్ ముందువెనుకలాడుతున్నారు.
బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోందా? 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం, ఆ తరువాత గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా సాధించిన జీరో రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకున్నట్లు కనిపించదు.