జగన్, కేటీఆర్ నోట ఉమ్మడి రాజధాని మాట.. వ్యూహత్మకమా.. కాకతాళీయమా?

Publish Date:Apr 29, 2024

Advertisement

ఎన్నికల వేళ  ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఏపీలో అయితే ఐదేళ్ల అస్తవ్యస్థ పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అర్ధం కాక మల్లగుల్లాలు పడుతోంది. 
ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాజధాని విషయంపై అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ గళమెత్తుతున్నాయి. ఇది కాకతాళీయమా లేక ఉమ్మడి వ్యూహమా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఎన్నికల అంశంగా తెరమీదకు తేవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిల్చి ప్రజల మనస్సులను గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మరో వైపు ఇదే ఉమ్మడి రాజధాని అంశాన్ని వైసీపీ లేవనెత్తడం ద్వారా రాజధాని లేని  రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడానికి జగన్ సర్కార్ కారణమన్న విమర్శ నుంచి బయటపడవచ్చన్నది వైసీపీ భావనగా కనిపిస్తోంది. రెండూ పార్టీల నుంచీ ఒకే వాదన ఒకే సారి తెరమీదకు రావడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది.

ఎందుకంటే వైసీపీ, బీఆర్ఎస్ లు రెండూ ఫ్రెండ్లీ పార్టీలు. పరస్పరం సహకారం అందిం చుకుం టుంటాయి. గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  ఏపీ సీఎం జగన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ కోసం సరిగ్గా పోలింగ్ తేదీకి ముందు రోజు అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యాం వద్దకు ఏపీ పోలీసులను పంపించారు. అది కేసీఆర్ కు పెద్దగా ఉపయోగపడలేదు అది వేరే విషయం. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ లబ్ధి కోసం కేసీఆర్, కేటీఆర్ లు ఏపీలో మళ్లీ జగన్ సర్కారే కొలువుదీరనున్నదని జోస్యాలు చెబుతున్నారు. ఇది జగన్ కు ఎంత వరకూ ఉపయోగపడుతుందన్నది వేరే సంగతి. పరస్పర సహకారం కోసం రెండు పార్టీలూ, రెండు పార్టీల అధినేతల తహతహలాడుతున్నాయన్నది మాత్రం వాస్తవం. కారణమేమిటంటే రెండు రాష్ట్రాలలోనూ ఏకకాలంలో ఇాద్దరు శత్రువులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు) ముఖ్యమంత్రులుగా ఉండటం ఇరువురికీ ఇబ్బంది కరమైన విషయమే అనడంలో సందేహం లేదు. ఆ కారణంగానే  వేములవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆదివారం (ఏప్రిల్ 28) మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండటం తెలంగాణకు అవసరం అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే నిలువరించగలదని అన్నారు. 

మరో వైపు సోమవారం (ఏప్రిల్ 29)చోడవరంలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను చంద్రబాబు కారణంగా దూరం చేసుకున్నామని పేర్కొన్నారు. అసలు ఉమ్మడి రాజధాని ముగిసిన అంశం. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్, వైసీపీలు ఈ అంశాన్ని లేవనెత్తడం కాకతాళీయమేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2, 2024తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో  బీఆర్ఎస్, వైసీపీలు కూడబలుక్కునే ఉమ్మడి రాజధాని అంశాన్ని వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చాయని అటున్నారు. 

ఏకకాలంలో అటు బీఆర్ఎస్ కూ, ఇటు వైసీపీకీ ఉమ్మడి రాజధాని అంశం గుర్తుకురావడంపై అటూ ఇటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి రాజధానిని ఆపగలిగేది బీఆర్ఎస్ మాత్రమే అం టూ బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణలో  తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలేమిటన్న విమర్శలు వస్తుంటే.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానులంటూ ఒక్క రాజధానిని కూడా కట్టలేకపోయిన జగన్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడడమేమిటని నిలదీస్తున్నారు. మొత్తం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్, వైసీపీలు  వ్యూహాత్మకంగానే ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హింస చెలరేగింది. పోలింగ్ పూర్తి కాకముందే పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల,తాడిపత్రి,చంద్రగిరి,నరసరావుపేటలో చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో వైసీపీకి ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫలితాలు వెలువడకుండానే ఓటమి ఖాయమైందని వైసీపీ నేతలు తలలు పట్టుకునేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఒటేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక, కక్షపూరిత పాలనను కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీశారు.
ఓటమి భయంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నాని పులివర్తి నాని అన్నారు.  టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పులివర్తి నాని చెప్పారు.
రాష్ట్రమంతటా ఒకెత్తు.. పాలకొల్లు ఒక్కటీ ఒకెత్తు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామబానాయుడి విజయంపై విపక్ష వైసీపీ అభ్యర్థికి కూడా ఎలాంటి అనుమానం లేదు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన పోలింగ్ వివ‌రాల‌ను సీఈవో ముఖేష్ కుమార్ బుధ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదైంద‌ని తెలిపారు. పోలింగ్ శాతంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, భ‌ద్ర‌తా ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. హింస చోటుచేసుకున్న చోట వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు.
పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని పెద్దాయన మాటిచ్చారు. ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకుంది. కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, కాకపోతే మీ ఉప్మా, కాఫీలు మీరే తెచ్చుకోవాలంటూ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన మరునాటి నుంచి వైసీపీ నేతల స్వరం మారిపోయింది. పరోక్షంగా ఓటమిని ఒప్పకుంటూ, వారికి మాత్రమే సాధ్యమైన విధంగా తమ ఓటమికి కారణం తెలుగుదేశం కారణమని చెప్పుకుంటున్నారు.
తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఏడు కొండల్లోని అడవుల్లో ఉండే చిరుతలు కొంత కాలంగా నడక మార్గం వద్దకు వచ్చేస్తున్నాయి. గత ఏడాది భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురి చేశాయి. తాజాగా మరోసారి చిరుత కలకలం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతను వెంటనే పట్టుకోవాలని అధికారులను భక్తులు కోరుతున్నారు.
బాబు సీఎం.. ఫిక్సయిపోండి!
జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
 ఎపిలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి  రిలీఫ్ అయ్యింది. మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.
ఏపీలో పోలింగ్ భారీగా జరిగింది. ఎన్నికల సంఘం కూడా దీనిని అధికారికంగా ధృవీకరించింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు ఓటెత్తారు. అనూహ్యమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కనబరిచారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.