ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆరేళ్లుగా సా..గుతూనే ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగానే ఉంది. ఈ కేసు విషయంలో సీబీఐ తీరు కూడా పదేపదే ప్రశ్నార్థకంగానే ఉంటూ వస్తున్నది. తాజాగా సుప్రీం కోర్టులో ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యిందంటూ నివేదిక సమర్పించడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం ఆదేశిస్తే అదనపు దర్యాప్తు చేస్తామనడంపైనా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిలు మంజూరు కావడానికి, అలాగే మంజూరైన బెయిలు రద్దు కాకుండా ఉండేందుకే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యిందని చెబుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ.. గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తాను నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. హత్య అన్న ఆలోచనే ఎన్నడూ చేయలేదన్నారు.
వివేకా హత్య జరిగిన రోజున మీడియాను అనుమతించకుండా అడ్డుకున్నారనీ, గొడ్డలిపోటు అని స్పష్టంగా కనిపిస్తున్నా గుండెపోటు అంటూ ప్రకటనలు గుప్పించడంతోనే వివేకా హత్య కుట్రపూరితంగా జరిగిందని స్పష్టమౌతోందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కాగా కోడి కత్తి ఘటన, గులకరాయి దాడి సంఘటనా కూడా నాటకాలేనని అన్నారు. జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాట కం అని విమర్శించారు.
వివేకా హత్య సమయంలో తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని తాను మొదటి నుంచీ చెబుతున్నాన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు వాస్తవాలు తెలుసు కున్నారన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-and-avinash-behind-ysviveka-murder-39-203837.html
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.