ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆరేళ్లుగా సా..గుతూనే ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగానే ఉంది. ఈ కేసు విషయంలో సీబీఐ తీరు కూడా పదేపదే ప్రశ్నార్థకంగానే ఉంటూ వస్తున్నది. తాజాగా సుప్రీం కోర్టులో ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యిందంటూ నివేదిక సమర్పించడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం ఆదేశిస్తే అదనపు దర్యాప్తు చేస్తామనడంపైనా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిలు మంజూరు కావడానికి, అలాగే మంజూరైన బెయిలు రద్దు కాకుండా ఉండేందుకే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యిందని చెబుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ.. గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తాను నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. హత్య అన్న ఆలోచనే ఎన్నడూ చేయలేదన్నారు.
వివేకా హత్య జరిగిన రోజున మీడియాను అనుమతించకుండా అడ్డుకున్నారనీ, గొడ్డలిపోటు అని స్పష్టంగా కనిపిస్తున్నా గుండెపోటు అంటూ ప్రకటనలు గుప్పించడంతోనే వివేకా హత్య కుట్రపూరితంగా జరిగిందని స్పష్టమౌతోందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కాగా కోడి కత్తి ఘటన, గులకరాయి దాడి సంఘటనా కూడా నాటకాలేనని అన్నారు. జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాట కం అని విమర్శించారు.
వివేకా హత్య సమయంలో తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని తాను మొదటి నుంచీ చెబుతున్నాన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు వాస్తవాలు తెలుసు కున్నారన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-and-avinash-behind-ysviveka-murder-39-203837.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు