Publish Date:Apr 27, 2022
కొన్నాళ్లుగా వైసీపీలో హోల్ అండ్ సోల్ సజ్జలనే. జగన్ తర్వాత నెంబర్ 2 పొజిషన్. మొదట్లో విజయసాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉత్తరాంధ్రకు సామంతరాజును చేశారు. ఆయనేమో రాజ్యం మొత్తం నాదేనంటూ విర్రవీగారు. బాగా ఓవర్ చేశారు. వరుస ఫిర్యాదులతో సాయిరెడ్డి కోరలు కట్ చేశారు సీఎం జగన్. విశాఖ నుంచి తీసుకొచ్చి.. తన తాడేపల్లి ప్యాలెస్లో బంధించేశారు. పార్టీ అనుబంధ సంఘాల సమన్వయ బాధ్యతలంటూ ఏదో చిన్న పోస్టు పడేసి.. ఇకపై ఇక్కడే పడుండంటూ ఆదేశించారు. ఇక విజయసాయి పని ఖతం అనుకున్నారంతా. హవా అంతా సజ్జలదేనంటూ చర్చ జరిగింది. కానీ, నెల రోజుల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. ప్రయారిటీ తారుమారు అయింది. సజ్జల పవర్స్కు కోత పెట్టారు. విజయసాయికి ఆ పదవులు కట్టబెట్టారు. ఎవరికి ఏ పనులు అప్పగించాలో.. బహుషా జగన్కే క్లారిటీ లేనట్టుంది.
సలహాదారు తానే.. పార్టీ బాధ్యతలూ తనకే.. తానే నెంబర్ 2 అనుకుంటూ గాల్లో తేలిపోతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని.. తీసుకొచ్చి నేల మీద నిలబెట్టేశారు జగనన్న. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డికి.. వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని.. రీజనల్ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఇచ్చారు. దాదాపు పార్టీ అంతా సజ్జల చేతిలో పెట్టినంత పని చేశారు. అంతలోనే ఏమైందో ఏమో.. ఆ వెంటనే మళ్లీ నిర్ణయాన్ని సవరించుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్ల సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం కేవలం ఎమ్మెల్యేల బాధ్యతలకే పరిమితం చేసి.. ప్రాధాన్యం తగ్గించేశారు. ఎప్పటిలానే మీడియా కోఆర్డినేషన్ను ఆయన దగ్గరే ఉంచేశారు.
ఎందుకు? సడెన్గా జగన్మోహన్రెడ్డి ఎందుకిలా సజ్జల పవర్స్కు కోత వేశారు? విజయసాయిరెడ్డికి మళ్లీ ఎందుకు ప్రాధాన్యం పెంచారు? అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నెంబర్ 2 అనే పదమే జగన్లో భయానికి కారణం అంటున్నారు. పార్టీ అంటే తానొక్కడి పేరు మాత్రమే వినిపించాలని.. తన తర్వాత మరెవరూ నెంబర్ 2గా ఉండకూడదనేది జగన్ లెక్క అంటున్నారు. అందుకే, సొంత చెల్లి షర్మిలను సైతం పక్కనపెట్టేశారని గుర్తు చేస్తున్నారు. ఇటీవల సజ్జల పేరు పార్టీలో మారుమోగుతుండటం.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఆయన సలహాలు, సూచనల మేరకే జరిగిందంటూ పార్టీ నేతలంతా సజ్జల చుట్టూ తిరుగుతుండటం జగన్కు నచ్చలేదని తెలుస్తోంది. అందుకే, పార్టీలో సజ్జల స్థాయిని అమాంతం తగ్గించేశారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డిని ఇప్పటికే పార్టీ నేతలంతా దూరం పెట్టేశారు కాబట్టి.. సజ్జలను కాదని సాయిరెడ్డిని ఎంచుకున్నారని అంటున్నారు. ఇలా వైసీపీలో ఎవరికీ ప్రాధాన్యం ఉండదని.. ఎవరూ సూపర్ పవర్ కాదని.. తాను మాత్రమే సుప్రీం అనే మెసేజ్ పార్టీ వర్గాలకు ఇవ్వడానికే.. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-action-on-sajjala-25-135050.html
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.
తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు.
ఇప్పటి వరకూ మస్క్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా జరిగిన పరిణామ క్రమం వేరు. 2024 ఎన్నికల్లో సుమారు 30 కోట్ల డాలర్లు.. (ఇండియన్ కరెన్సీలో 2500 కోట్లు) విరాళం ఇచ్చి మరీ రాజకీయాల్లోకి దిగిన మస్క్ కి జరిగిన శాస్తి ఏంటంటే.. ఆయన టెస్లా అమ్మకాలు భారీగా పడిపోవడం, షేర్ ధరలు యాభై శాతం డౌన్ కావడం, వంద బిలియన్ డాలర్ల మేర తన సంపద ఆవిరి కావడం.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులైన తరువాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరయ్యారు . అదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు అటెండ్ అయ్యారు.
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి.
ఆర్సీబీ విజయంతో బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక హక్కులను ఉల్లంఘిస్తున్న పుష్ మై కార్ట్ సంస్థ కు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఒక్క పుష్ మై కర్డ్ సంస్థకే కాకుండా ఇలా లడ్డూ ప్రసాదం పేరును, పవిత్రతను అనధికారికంగా ఉపయోగించుకుంటున్న పలు ఇతర సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమై లీగల్ నోటీసులు జారీ చేసింది.