సజ్జల ప‌వ‌ర్స్‌ పీకేసిన జ‌గ‌న్‌!.. విజయసాయికి ప్ర‌మోష‌న్‌.. లెక్క మారింది..

Publish Date:Apr 27, 2022

Advertisement

కొన్నాళ్లుగా వైసీపీలో హోల్ అండ్ సోల్ స‌జ్జ‌ల‌నే. జ‌గ‌న్ త‌ర్వాత నెంబ‌ర్ 2 పొజిష‌న్‌. మొద‌ట్లో విజ‌య‌సాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉత్త‌రాంధ్ర‌కు సామంత‌రాజును చేశారు. ఆయ‌నేమో రాజ్యం మొత్తం నాదేనంటూ విర్ర‌వీగారు. బాగా ఓవ‌ర్ చేశారు. వ‌రుస ఫిర్యాదుల‌తో సాయిరెడ్డి కోర‌లు క‌ట్ చేశారు సీఎం జ‌గ‌న్‌. విశాఖ నుంచి తీసుకొచ్చి.. త‌న తాడేప‌ల్లి ప్యాలెస్‌లో బంధించేశారు. పార్టీ అనుబంధ సంఘాల స‌మ‌న్వ‌య బాధ్య‌త‌లంటూ ఏదో చిన్న పోస్టు ప‌డేసి.. ఇకపై ఇక్క‌డే ప‌డుండంటూ ఆదేశించారు. ఇక విజ‌య‌సాయి ప‌ని ఖ‌తం అనుకున్నారంతా. హ‌వా అంతా స‌జ్జ‌ల‌దేనంటూ చ‌ర్చ జ‌రిగింది. కానీ, నెల రోజుల వ్య‌వ‌ధిలోనే సీన్ మారిపోయింది. ప్ర‌యారిటీ తారుమారు అయింది. స‌జ్జ‌ల ప‌వ‌ర్స్‌కు కోత పెట్టారు. విజ‌య‌సాయికి ఆ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఎవ‌రికి ఏ ప‌నులు అప్ప‌గించాలో.. బ‌హుషా జ‌గ‌న్‌కే క్లారిటీ లేన‌ట్టుంది.

స‌ల‌హాదారు తానే.. పార్టీ బాధ్య‌త‌లూ త‌న‌కే.. తానే నెంబ‌ర్ 2 అనుకుంటూ గాల్లో తేలిపోతున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని.. తీసుకొచ్చి నేల మీద నిల‌బెట్టేశారు జ‌గ‌న‌న్న‌. ఇటీవ‌ల సజ్జల రామకృష్ణారెడ్డికి.. వైసీపీ జిల్లా అధ్యక్షుల్ని.. రీజనల్ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఇచ్చారు. దాదాపు పార్టీ అంతా స‌జ్జ‌ల చేతిలో పెట్టినంత ప‌ని చేశారు. అంత‌లోనే ఏమైందో ఏమో.. ఆ వెంట‌నే మ‌ళ్లీ నిర్ణ‌యాన్ని స‌వ‌రించుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్ల స‌మ‌న్వ‌య బాధ్య‌త‌ల‌ను విజయసాయిరెడ్డికి అప్పగించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం కేవలం ఎమ్మెల్యేల బాధ్య‌త‌ల‌కే ప‌రిమితం చేసి.. ప్రాధాన్యం త‌గ్గించేశారు. ఎప్ప‌టిలానే మీడియా కోఆర్డినేష‌న్‌ను ఆయ‌న ద‌గ్గ‌రే ఉంచేశారు. 

ఎందుకు? స‌డెన్‌గా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎందుకిలా స‌జ్జ‌ల ప‌వ‌ర్స్‌కు కోత వేశారు?  విజ‌య‌సాయిరెడ్డికి మ‌ళ్లీ ఎందుకు ప్రాధాన్యం పెంచారు? అనే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. నెంబ‌ర్ 2 అనే ప‌ద‌మే జ‌గ‌న్‌లో భ‌యానికి కార‌ణం అంటున్నారు. పార్టీ అంటే తానొక్క‌డి పేరు మాత్ర‌మే వినిపించాల‌ని.. తన త‌ర్వాత మ‌రెవ‌రూ నెంబ‌ర్ 2గా ఉండ‌కూడ‌ద‌నేది జ‌గ‌న్ లెక్క అంటున్నారు. అందుకే, సొంత చెల్లి ష‌ర్మిల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టేశార‌ని గుర్తు చేస్తున్నారు. ఇటీవ‌ల స‌జ్జ‌ల పేరు పార్టీలో మారుమోగుతుండ‌టం.. కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కే జ‌రిగిందంటూ పార్టీ నేత‌లంతా స‌జ్జ‌ల చుట్టూ తిరుగుతుండ‌టం జ‌గ‌న్‌కు న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. అందుకే, పార్టీలో స‌జ్జ‌ల స్థాయిని అమాంతం త‌గ్గించేశార‌ని చెబుతున్నారు. విజ‌య‌సాయిరెడ్డిని ఇప్ప‌టికే పార్టీ నేత‌లంతా దూరం పెట్టేశారు కాబ‌ట్టి.. స‌జ్జ‌ల‌ను కాద‌ని సాయిరెడ్డిని ఎంచుకున్నార‌ని అంటున్నారు. ఇలా వైసీపీలో ఎవ‌రికీ ప్రాధాన్యం ఉండ‌ద‌ని.. ఎవ‌రూ సూప‌ర్ ప‌వ‌ర్ కాద‌ని.. తాను మాత్ర‌మే సుప్రీం అనే మెసేజ్ పార్టీ వ‌ర్గాలకు ఇవ్వ‌డానికే.. జ‌గ‌న్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని విశ్లేషిస్తున్నారు. 


 

By
en-us Political News

  
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వెనుపోటు దినంలో భాగంగా చీపురుపల్లిలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల కవిత.. సర్వం తానై నడిపిస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇంతవరకు సైలెంట్ స్పేక్టేటర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, తొలి సారిగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం స్పందించారు.
తుని కేసు.. అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు.
ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్ లో యశ్వంత్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఫైనల్ లో 191 పరుగుల స్కోరు డిఫెండ్ చేసుకోవడమంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు.
ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ అది సాధించిన అనంతరం ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకున్నాడు.
ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆహ్మదాబాద్ వేదికగా మంగళవారం (జూన్ 3)న జరిగిన ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల ఆధిక్యతతో గెలిచి విజేతగా నిలిచింది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్.. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మధుర ఫలం మామిడిని పండించే రైతు ధర లేక కుదేలవుతున్నాడు. ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వాన్నంగా ఉండడంతో ఢీలా డ్డారు. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడి కి రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.