ఎట్ హోం లో జగన్ ఎక్కడా కనిపించలేదేం?

Publish Date:Aug 16, 2024

Advertisement

పంద్రాగస్టు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ గురువారం సాయంత్రం తన నివాసమైన రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, పద్మ పురస్కార గ్రహీతలంతా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం గైర్హాజరయ్యారు.

ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు. అయినా జగన్ హాజరు కాకపోవడానికి కారణాలేమిటన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ గైర్హాజరుకు ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. గవర్నర్ ఆహ్వానాన్ని మన్నించకుండా డుమ్మా కొట్టడానికి కారణం ఈ ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల హాజరు కావడమేనని అంటున్నారు. వీరిరువురినీ ఫేస్ చేసే ధైర్యం లేకే జగన్ ఎట్ హోం కార్యక్రమానికి ముఖం చాటేశారన్నది పరిశీలకుల విశ్లేషణ్. గవర్నర్ ఇచ్చిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే   ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు నారా లోకేష్‌, సిఎస్ నీరబ్ కుమార్, డిజిపి ద్వారకా తిరుమల రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్‌ ఠాకూర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అదే విధంగా రాష్టర  మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు  హాజరయ్యారు.

అహ్లాదపూర్వక వాతావరణం జరిగిన ఈ విందుకు హాజరైన వారంతా ఎలాంటి అరమరికలూ లేకుండా  పరస్పరం పలకరించుకొని మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్ద వైఎస్ షర్మిలని ఆప్యాయంగా పలకరించారు.   ఈ కార్యక్రమం సుమారు గంటసేపు సాగింది. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ విందుకు కనీసం ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ కూడా లేని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. కానీ ఆమె సోదరుడు, మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు మాత్రం గైర్హాజరయ్యారు. ఈ విందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిందో, వైసీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఇచ్చిందో కాదు. ఏటా పంద్రాగస్టు నాడు సాయంత్రం గవర్నర్ ఇచ్చే విందు.  పార్టీలూ, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ హాజరవ్వడం విధాయకం.

అయితే అటువంటి సంప్రదాయలు, ఆనవాయితీలను పట్టించుకోకుండా జగన్ గైర్హాజర్ కావడం ద్వారా తనను తాను తగ్గించుకున్నారు. తనను తాను అగౌరవ పరుచుకున్నారు. జగన్ తీరు చూస్తుంటే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి తెలంగాణ గవర్నర్ తో సరిపడటం లేదంటూ కేసీఆర్ కూడా ఎట్ హోంను బహిష్కరించేవారు.  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలని గౌరవించకపోవడంలో జగన్, కేసీఆర్ లు దొందూదొందేనని పరిశీలకులు అంటున్నారు. తమ తీరుద్వారా అదే నిజమని వీరిరువురూ పదే పదే రుజువు చేస్తున్నారు. 

By
en-us Political News

  
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.