బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు!

Publish Date:Feb 5, 2014

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ “బీజేపీ గనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముందుకు వస్తే, ఎన్నికల తరువాత దానికి మా పార్టీ మద్దతు ఇస్తుంది.” అని అన్నారు. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే షరతుపైనే జైలు నుండి విడుదల చేయబడ్డాడని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటే, ఇప్పుడు ఆయన బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. వారి ఆరోపణలు అసత్యమని భావించినప్పటికీ, బీజేపీ ప్రస్తుతం తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసినా, తాము అధికారంలోకి వస్తే ఇరుప్రాంతాలకి ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేస్తామని ముందే చెపుతున్నపుడు, రాష్ట్రాన్ని శాశ్వితంగా సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి మద్దతు ఇస్తానని ఏవిధంగా హామీ ఇస్తున్నారు? ఒకవేళ ఆయన కోరినట్లే బీజేపీ బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసినట్లయితే, ఎన్నికల తరువాత రాష్ట్ర విభజన చేయాలనుకొంటున్న ఆ పార్టీకి ఆయన మద్దతు ఇస్తారో ఇవ్వరో అనే సంగతి కూడా ఆయన ఇప్పుడే చెప్పగలిగితే, అయన హామీలో నిజాయితీ ఎంతో తెలుస్తుంది.

 

కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా తెలంగాణా ఏర్పాటుకి కట్టుబడి ఉన్నాయని ఆయనకీ తెలుసు. మరి అటువంటప్పుడు ఈవిధంగా హామీ ఇవ్వడం చూస్తే ఆయన అటు బీజేపీని, ఇటు సీమాంధ్ర ప్రజలని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

 

నిజానికి వైకాపా ఎప్పుడయితే తెలంగాణా వదులుకొని బయటపడిందో అప్పుడే అది మానసికంగా రాష్ట్ర విభజనకు అంగీకరించి సిద్దమయిందని అందరికీ తెలుసు. ఆపార్టీ చేస్తున్న సమైక్యవాదమంతా సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించి, జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికను నేరవేర్చుకోవడానికే తప్ప నిజంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కాదని అందరికీ తెలుసు. తన తెలంగాణా శాఖను పణంగా పెట్టి మరీ వైకాపా చేస్తున్నసమైక్యాంధ్ర పోరాటం యొక్క పూర్తి ఫలితం పొందాలంటే, ఎన్నికలలోగా ఖచ్చితంగా రాష్ట్ర విభజన జరిగితేనే సాధ్యం. తెలంగాణా ఏర్పాటునే పూర్తిగా వ్యతిరేఖిస్తూ సమైక్యాంధ్ర పోరాటం చేస్తున్న వైకాపాకు తెలంగాణాలో అడుగిడే పరిస్థితే లేదు. అటువంటప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని పోరాడవలసిన అవసరమే ఆపార్టీకి లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకు సహకరిస్తే బీజేపీకి మద్దతు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు! గతంలో ఆయన, ఆయన తల్లి విజయమ్మ, షర్మిల ముగ్గురూ కూడా వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు హటాత్తుగా మనసు మార్చుకొని బీజేపీకి మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెపుతున్నారు. ఆయన ఆలోచనలలో ఎంత అపరిపక్వత, అస్పష్టత ఉందో ఇది తెలియజేస్తోంది.

 

రానున్న ఎన్నికలలో మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి గనుక, తన సీబీఐ కేసుల నుండి విముక్తి పొందేందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇస్తే అది నమ్మశక్యంగా ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇస్తానని చెప్పడం మాత్రం అందరినీ మభ్యపెట్టడమే అవుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.