వైకాపాకు జగనే శత్రువా?

Publish Date:Nov 20, 2013

Advertisement

 

ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నకారణంగా ఎప్పటికప్పుడు పార్టీ అనుసరించవలసిన రాజకీయ వ్యూహాలను చర్చించే వీలుండేది కాదు. పార్టీలో మైసూర, అంబటి, కొణతాల, పిల్లి సుభాష్, వాసిరెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు చాలా మందే ఉన్నపటికీ వారు పార్టీకి దిశానిర్దేశం చేసే అంతటి అధికారం, స్వేచ్చ లేనందున వారి రాజకీయ అనుభవమంతా కేవలం తెదేపా, కాంగ్రెస్ పార్టీలను, ప్రభుత్వాన్నిదుయ్యబట్టేందుకే పరిమితమయింది. జగన్ అందరిపై చలాయించే కర్ర పెత్తనమే అందుకు కారణమని చెప్పవచ్చును.

 

అందువల్ల జగన్ జైలులో ఉన్నంత కాలం, వైకాపా గుడ్డిగా తెదేపా వ్యూహలనే అనుసరించక తప్పలేదు. తెదేపా విద్యుత్ సమస్యలపై చేసిన ధర్నాలు, రైతుల సమస్యలపై పోరాటాలు, నిరాహార దీక్షలను వైకాపా కూడా నీటుగా ఫాలో అయిపోయింది. చివరికి చంద్రబాబు పాదయాత్ర చేస్తే, పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తే బస్సు యాత్రలు చేస్తూ వైకాపా ఎలాగో భారంగా రోజులు దొర్లించేసింది.

 

జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయితే ఈ పరిస్థితుల్లో మార్పువస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ నేటికీ ఆ పరిస్థితిలో మార్పులేదు. కారణం జగన్ జైల్లో ఉన్నా, బయట ఉన్నాతన కర్ర పెత్తనం అలవాటును మానుకోకపోవడమే.

 

ఇటీవల అతను హైదరాబాదులో నిర్వహించిన సమైక్య శంఖారావమే ఒక చక్కటి ఉదాహరణ. జోరుగా కురుస్తున్న జడివానల మధ్య సభ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా అతను సభ నిర్వహించాలనుకోవడమే అతని కర్ర పెత్తనానికి ఒక ఉదాహరణ. కానీ అదృష్టవశాత్తు ఆరోజు భారీ వర్షాలు పడలేదు. పడిఉంటే సభ పరిస్థితి ఏమిటో అతనికే తెలియాలి.

 

సమైక్య రాష్ట్రం కోరుతూ పూరించిన సమైక్యశంఖారవం సభలో వేలాది ప్రజల సమక్షంలో తనకి ముప్పై లోక్ సభ స్థానాలు వస్తే డిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించడం అతని దురాలోచనలకి అద్దం పడితే, అతను రాష్ట్ర విభజన అనివార్యమని అప్పటికే బలంగా నమ్ముతున్నందునే, కేవలం సీమాంధ్రలో సీట్ల గురించి మాట్లాడినట్లు స్పష్టం అయింది.

 

జగన్ తనకి తగిన రాజకీయ అనుభవము లేనప్పుడు కనీసం పార్టీలో సీనియర్స్ సలహా సంప్రదింపులు చేసినా ఇటువంటి పరిస్థితి దాపురించేది కాదు. కానీ, ఒక హీరోకి ‘దూకుడు’ గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెడితే ఆ దూకుడే వైకాపా కొంప ముంచుతోంది.

 

పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా, తెదేపాను చూసి జగన్ కూడా రాష్ట్ర విభజనకు లేఖ అయితే ఇచ్చేశారు. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలు జగన్ రాజకీయ అపరికత్వతని,దుందుడుకు స్వభావాన్ని ప్రస్పుటంగా పట్టి చూపాయి.

 

అందరి కంటే ముందే సమైక్యరాగం ఆలపించేసి, సమైక్య చాంపియన్ అయిపోదామని రాత్రికి రాత్రే తెలంగాణాలో దుఖాణo బంద్ చేసేసుకొని సీమాంధ్రలోకి దూకేసిన తరువాత, తెదేపా నేటికీ తన లేఖకే కట్టుబడి ఉండటం, తెలంగాణాలో కూడా పార్టీని యధాతధంగా నిలబెట్టుకొని ఉండటం చూసి కంగు తిన్నారు. అందుకే మళ్ళీ తెలంగాణా నేతలని మంచి చేసుకొనే ప్రయత్నాలు ఆరంభించారు.

 

అయితే దానివల్ల అతనికి తెలంగాణా ప్రజల నుండి అవమానాలు, చీదరింపులే మిగిలాయి చివరికి. అది స్వయంకృతాపరాధమే కనుక పార్టీలో ఎవరినీ నిందించవలసిన పనిలేదు.

 

ఇక నిత్యం కాంగ్రెస్, తెదేపాలను తిట్టిపోసే జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ఆ పార్టీల అడుగుజాడలలోనే తన రాజకీయ జీవితం నిర్మించుకోబూనడం విచిత్రం. పార్టీ రాజకీయ కార్యక్రమాలకు తెదేపాను అనుసరించే జగన్, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కాంగ్రెస్ విభజన రాజకీయాలను చక్కగా అనుసరిస్తున్నారు. కనీసం ఇప్పటికయినా తన పద్దతులు మార్చుకొని పార్టీలో సీనియర్స్ సలహా సంప్రదింపులు చేసి ఉంటే, నేడు తెదేపా చేపడుతున్న’ఇంటింటికీ తెదేపా’వంటి కార్యక్రమాలను గుడ్డిగా అనుసరించవలసిన దుస్థితి ఉండేది కాదు.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.