అందరూ ఆయన వెనుక ఎందుకు నడవాలిట?

Publish Date:Jul 23, 2014

Advertisement

 

రేపటి నుండి రుణమాఫీ అంశంపై వైకాపా తలపెట్టిన మూడురోజుల ఆందోళన కార్యక్రమాలలో వామపక్షాలను , ప్రజలను, మీడియాను తనతో కలిసిరావాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే తనకు నిత్యం బాకా ఊదుతూ, నీడలా వెన్నంటి ఉంటూ, తను మాట్లాడే ప్రతీ మాటను, కార్యక్రమాన్ని గొప్ప ఘనకార్యంలా చాటి చెప్పే సాక్షి మీడియాను, ఎన్నికలలో ఓడిపోవడానికి అదే కారణమని వైకాప నేతలే స్వయంగా నిందిస్తున్నపుడు, ఇతర మీడియా ఛానళ్ళు ఆయన వెనుక ఎందుకు నడుస్తాయి? కొన్ని న్యూస్ పేపర్లు, మీడియా ఛాన్నళ్ళు తమ శత్రువులని జగన్మోహన్ రెడ్డి స్వయంగా అభివర్ణించిన తరువాత వాటిని తన రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి చేస్తున్న ఈ ఆందోళనా కార్యక్రమాలకు మద్దతు ఇమ్మని జగన్ కోరడం హాస్యాస్పదం. అవి తనతో కలిసి రాకపోతే ప్రజా సమస్యలపై పోరాడేందుకు వాటికి ఆసక్తి లేదని నిందించవచ్చును. వచ్చినట్లయితే వాటి వలన తన కార్యక్రమాలకు మరింత మంచి కవరేజి దొరుకుతుందని జగన్ అత్యాశ కావచ్చును.

 

గతంలో జగన్ ఒట్టొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాలు నడుపుతున్నపుడు కూడా తెదేపాతో సహా ప్రతిపక్షాలు, ఎన్జీవోలని కూడా తన వెంట నడవాలని హుకూం జారీ చేసారు. అలా నడవకపోతే ప్రజలను మోసం చేసినట్లేనని ఒక సిద్ధాంతం కనిపెట్టారు. కానీ ఆయన రాజకీయంగా ఎదగడానికీ, ఆయన రాజకీయ మైలేజీ పెరగడం కోసం చేస్తున్న ఆ ఉద్యమాలకి తెదేపా, మీడియా, యన్జీవోలు ఎందుకు మద్దతు ఇస్తారు? అని జగన్ ఎన్నడూ ఆలోచించినట్లు లేదు. ప్రభుత్వం రుణమాఫీలు చేస్తూ అధికారికంగా క్యాబినెట్ చేత ఆమోద ముద్ర వేసిన తరువాత కూడా రుణమాఫీ అంశం ద్వారా రాజకీయ మైలేజీ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న తన వెనుక అందరూ నడవాలని జగన్ ఆశించడం హాస్యాస్పదం. దాదాపు తెలుగు మీడియా మొత్తం ఆయనను ఎందుకు దూరంగా పెడుతోందో ఇంతవరకు గ్రహించలేకపోయారు. రాజకీయ పార్టీలేవీ ఆయనను ఎందుకు విశ్వసించడంలేదో తెలుసుకోలేకపోతున్నారు. కానీ తను వ్యతిరేఖిస్తున్నవారు, తనను వ్యతిరేఖిస్తున్నారు కూడా తన వెనుక నడిచి తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాలని జగన్మోహన్ రెడ్డి ఆశించడం హాస్యాస్పదం.అయినా ఆయనకు తన రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి మెరుపులాంటి ఆలోచన వస్తే, అందుకు స్వంత పార్టీని, మీడియాని ఉపయోగించుకోవచ్చును కానీ ఇతర పార్టీలను ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయని ఆయన ఆరోపిస్తున్న మీడియాను కూడా వాడేసుకొందామంటే ఎవరు అంగీకరిస్తారు?      

By
en-us Political News

  
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.