ఎక్కడయినా బావ కానీ... వంగతోట కాడ కాదు

Publish Date:Nov 13, 2013

Advertisement

 

జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో మిగిలిన వారినందరినీ విడిచి పెట్టేసి, తనలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గట్టిగా కృషి చేస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు టార్గెట్ చేసుకొంటున్నారు? రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకొని, రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు వచ్చితనతో చేతులు కలపమని తన బద్ధశత్రువయిన తెదేపాని కూడా కోరుతున్నపుడు, మరి తన సమైక్యబాటలోనే పయనిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డితో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిసి నడవడానికి ఇష్టపడటం లేదు?

 

వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వానికి మద్దతి ఇస్తామని చెపుతున్నపుడు, ‘సేమ్ టు సేమ్ డీ.యన్.ఏ.’ కలిగి ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జగన్ ఎందుకు మండిపడుతున్నట్లు? ఇటువంటి ధర్మ సందేహాలు ప్రజలకు చాలానే ఉన్నాయి. అయితే ఇవి సమాధానాలు దొరకని భేతాళ ప్రశ్నలు కావు.

 

పరుగు పందెంలోనయితేనేమి సమైక్య చాంపియన్ రేసులోనయితేనేమి ఎవరూ కూడా తమ పోటీదారులతో చేతులు కలిపి పరిగెత్తాలనుకోరు కదా? ఇదీ అంతే! అదీకాక అన్నివిధాల సమాన, మ్యాచింగ్ డీ.యన్.ఏ.కలిగి ఉన్నవాడిని ప్రోత్సహించడం అంటే మొదటి స్థానం కోసం కాక రెండో స్థానం కోసం పరుగెడుతున్నట్లే లెక్క.

 

ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే అంటిపెట్టుకొని ఉంటే, ఎన్నికల సమయంలోనే కాక ఆ తరువాత కూడా రెండు కత్తులు ఒకటే ఒరలో ఇమడవన్నట్లు, ఆ ఇద్దరు రెడ్లు ఒకే పార్టీలో, ప్రభుత్వంలో ఇమడలేరు. అలాకాక కిరణ్ పార్టీ నుండి బయటపడి వేరే కుంపటి పెట్టుకొన్నప్పటికీ, ఆ పొగ, ఆ సెగ ఎన్నికలలో తనకి తగలక మానవు. ఎక్కడయినా బావ కానీ వంగ తోట కాడ మాత్రం కాదన్నట్లు తనకి అన్ని చోట్ల పోటీగా నిలుస్తున్న కిరణ్ కుమార్ అంటే అందుకే జగన్కి అంత ప్రత్యేకమయిన ఆ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీలో మిగిలినవారినెవరినీ అతను తనతో సమానులుగా భావించడం లేదు గనుకనే వారు బ్రతికిపోయారు. లేకుంటే వారు కూడా పోయేవారే.

 

ఇక చంద్రబాబు రాజకీయ అనుభవమంతా వయసు కూడా లేని జగన్ ఆయనని లేఖ వెనక్కి తీసుకొని, వచ్చి తన వెనుక నడువమని చెప్పడం అతితెలివి, అహంకారమే తప్ప మరొకటి కాదు. తన దూకుడు వల్ల ఇప్పటికే అనేక తప్పుడు నిర్ణయాలు, ‘యూ టర్నులు’ తీసుకొని, చివరికి ఆ తెదేపాను చూసే తన తప్పుని గ్రహించి మళ్ళీ తెలంగాణాలో పార్టీని కాపాడుకోవాలని ప్రాకులాట మొదలుపెట్టిన అతను, తను వేసిన ఎత్తుకి చంద్రబాబు, అతని పార్టీ పడిపోతుందని భావించడం అవివేకమే.

 

By
en-us Political News

  
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.