జగన్ దీక్షతో వైకాపాకు మీడియా కవరేజ్

Publish Date:Aug 30, 2013

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా చంచల్ గూడా జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను నిన్న రాత్రి పోలీసులు భగ్నం చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఆసుపత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారని అతని తల్లి విజయమ్మ మీడియాకు తెలిపారు. అతని బీపీ, షుగర్ స్థాయి పడిపోవడం, కీటోన్స్ కూడా తగ్గడంతో ఇంకా దీక్ష కొనసాగించడం ప్రమాదమని చెప్పినప్పటికీ ఆయన దీక్ష విరమించేందుకు అంగీకరించట్లేదని ఆమె తెలిపారు.

 

అందువల్ల బలవంతంగానయినా వైద్యులు అతనికి గ్లూకోజ్ ఎక్కేంచే అవకాశముంది. జగన్ మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించబోతున్నారనే వార్తలు వినగానే షరా మామూలుగానే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణుల, నేతల హడావుడి మొదలయిపోయింది. నిన్నటి నుండి పార్టీ నేతలు, కార్యకర్తలు చంచల్ గూడా జైలు, ఉస్మానియా ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున చేరుకొంటున్నారు. తమ నేత దీక్ష భగ్నం చేసినందుకు తీవ్ర ఆగ్రహం ప్రకటిస్తూ పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తమ నేతను చూసేందుకు పోలీసులు అనుమతించనందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసారని మండిపడుతున్న సదరు నేతలు, కార్యకర్తలు మళ్ళీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందడం విడ్డూరం. అతని ఆరోగ్యపరిస్థితి రోజురోజుకి దిగజారుతున్నందున, అతని ఆరోగ్యం మరింత దెబ్బతినకూదడనే ఆలోచనతోనే పోలీసులు అతని దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అటువంటప్పుడు వైకాపా పోలీసులను నిందించడం అనుచితం. ఒకవేళ పోలీసులు అతనిని దీక్ష కొనసాగించనిచ్చినా రేపు అతని ఆరోగ్యం మరింత దెబ్బ తింటే, అప్పుడు కూడా వారు పోలీసులనే నిందిస్తారు.

 

నేడు  రాజకీయ నేతలుఏదో ఒక కారణంతో నిరాహార దీక్షలకు కూర్చోవడం, వారి దీక్షలను పోలీసులు భగ్నం చేస్తే, చేసారని నిందించడం, ఒకవేళ చేయకపోతే సదరు నేతల ఆరోగ్యం విషమిస్తున్నాకూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించడం పరిపాటయిపోయింది. దీక్షకు కూర్చొన్నప్రతీ ఒక్కరి డిమాండు ఏ ప్రభుత్వమయినా తీర్చగలదా? అనే ఆలోచన లేకుండా మీడియా కవరేజ్ కోసం, పార్టీకి ప్రజలలో గుర్తింపు తీసుకు రావడం కోసం ఈవిధంగా నిరాహార దీక్షల పేరుతో ప్రభుత్వాన్నిబ్లాక్ మెయిల్ చేయడం రాజకీయ నేతలకు పరిపాటయిపోయింది.

 

ఇంతకాలంగా జగన్ మోహన్ రెడ్డిని అతని పార్టీని వెలివేసిన మీడియా, అతను దీక్షకు దిగడంతో నేడు మళ్ళీ మంచి కవరేజ్ ఇస్తోంది. బహుశః జగన్ మోహన్ రెడ్డి అదే కోరుకొని దీక్షకు దిగి ఉండవచ్చును.

 

మొన్న విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షకు దిగినప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి ఆమెకు ఫోన్ చేసి ఆమెను దీక్ష విరమించుకోమని కోరడం, మళ్ళీ నేడు అతని ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే విజయమ్మ అతనిని దీక్ష విరమించుకోమని కోరడం, అందుకు అతను నిరాకరించాడని ఆమె బయటకి వచ్చి మీడియాకు చెప్పడం అంతా నాటకీయంగా ఉంది.

 

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ మోహన్ రెడ్డిని ప్రజల దృష్టిలో పెద్ద హీరోగా నిలబెట్టేందుకే వైకాపా ఈ డ్రామా నడిపిస్తోంది. సమైక్యాంధ్ర నినాదంతో సీమంధ్రలో పట్టు సాధించాలని తిప్పలు పడుతున్న వైకాపా, ప్రజలను ఆకట్టుకొనేందుకు వరుసపెట్టి ఇటువంటి తాత్కాలిక ఉపాయాలతో కధ నడిపిస్తోంది. పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ఆ పార్టీ ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోంది తప్ప పార్టీని బలపరచుకొని ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.

By
en-us Political News

  
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.