ఇంతకీ జగన్ డిల్లీ వెళ్లి ఏమి సాధించినట్లో

Publish Date:Nov 16, 2013

Advertisement

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంత దూరమయినా వెళ్లేందుకు సిద్దమంటున్నజగన్ బాబు ఈరోజు ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసేందుకు డిల్లీకి వెళ్ళారు. అయితే ఆయన కలుస్తున్న పార్టీల్లో దాదాపు అన్నీ కూడా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నవేనని తెలిసి ఉన్నప్పటికీ, వాటిని కలిసి మద్దతు కూడగట్టుకోవాలను కోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుని సమర్దిస్తున్నసీపీఐ పార్టీ నేతలనే జగన్ మొట్ట మొదట కలవడం కాకతాళీయమే కావచ్చు. గానీ, ఊహించినట్లే వారు తెలంగాణాపై తమ వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని మొహం మీదనే చెప్పేశారు. అయితే సీమాంధ్రకు అన్యాయం జరుగకుండా తమ పార్టీ శ్రద్ద వహిస్తుందని అభయం ఇచ్చిసాగనంపారు.

 

ఇక తరువాత ఆయన కలువబోయే సీపీయం, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నపటికీ ఇటీవల జరిగిన అఖిల పక్షసమావేశంలో విభజన అనివార్యమయితే ఏమి చేయాలో చెప్పడంతో ఆ పార్టీ కూడా విభజనకు అంగీకరించినట్లే అయింది. కానీ మున్ముందు జగన్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్న ఆ పార్టీ బహుశః అతనికి సానుకూలంగానే స్పందించవచ్చును. ఆ పార్టీ కూడా సీమాంద్రకు అన్యాయం జరుగకుండా చూస్తామని హామీ ఇచ్చి సాగానంపవచ్చును.

 

ఇక రేపు జగన్ కలువబోయే బీజేపీ మొదటి నుండి తెలంగాణాకు మద్దతు పలుకుతోంది. అయితే సీమాంధ్ర, తెలంగాణాలలో తన పార్టీ ప్రయోజనాలను, భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఇటీవల తన వైఖరి మార్చుకొంటున్నట్లుగా సంకేతాలు ఇస్తోంది. రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలని కోరుకొంటోంది గనుక మున్ముందు జగన్ మద్దతు అవసరం ఉంటుంది గనుక, అతను తన మద్దతు గురించి కన్ఫర్మ్ చేస్తేనే సానుకూలంగా స్పందించవచ్చును.

 

ఇక బహుజన్ సమాజ్ వాది పార్టీ తన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్నేనాలుగు ముక్కలు చేయాలని డిమాండ్ చేస్తోంది. గనుక జగన్ కోరికను మన్నించడం కష్టం. కానీ, ములాయం సింగ్ నేతృత్వంలో సమాజ్ వాది పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుని వ్యతిరేఖిస్తున్న కారణంగా జగన్ కి మద్దతు పలుకవచ్చును. కానీ కాంగ్రెస్ అధిష్టానం ములాయం కుటుంబ సభ్యులందరిపై తన సీబీఐ చిలుకలను ప్రయోగించి, వారినందరినీ తన అదుపులో ఉంచుకొంది. ఈ విషయాన్ని గతంలో స్వయంగా ములాయం సింగే చెప్పారు కూడా. అందువల్ల ములాయంకి మద్దతు ఈయలని ఉన్నపటికీ అతనికీ జగన్మోహన్ రెడ్డికీ మధ్య సీబీఐ అడ్డుగోడ ఉంది. గనుక దానిని దాటే సాహసం చేయకపోవచ్చును.

 

అంటే జగన్ కలిసిన పార్టీలలో ఏ ఒక్కటీ కూడా అతనికి బేషరతుగా మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని అర్ధం అవుతోంది.

By
en-us Political News

  
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.