ముంపు బాధితులను పట్టించుకోని జగన్ సర్కార్.. చింతమనేని

Publish Date:Jul 20, 2022

Advertisement

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు, కక్కునూరు గ్రామాలతోపాటు గోదావరికి అవతల ఒడ్డున ఉన్న విలీన గ్రామాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం సహాయ చర్యల్లో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్న విషయాన్ని గుర్తించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే  తెలుగుదేశం నాయకుడు చింతమనేని ప్రభాకర్  నేరుగా రంగంలోకి దిగారు. ఆ క్రమంలో పోలవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో.. గోదావరి   ముంపునకు గురై పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్న వారికి అందుతున్న సహాయక చర్యలను  స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా వరద బాధితులతో  నేరుగా మాట్లాడారు. అయితే తమకు ప్రభుత్వం అందిస్తున్నానని చెబుతోన్న కనీస నిత్యవసర వస్తువులు   అందడం లేదని బాధితులు చింతమనేని వద్ద వాపోయారు. అదీకాక.. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించినవి ఏవీ తమకు అందడం లేదని చెప్పడంతో  చింతమనేని ప్రభాకర్.. స్థానిక అధికారులను బాధితుల ఎదుటే నిలదీశారు. అంతే కాకుండా వరద బాధితుల కోసం టీడీపీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలను ఆయన కొనుగోలు చేశారు. ఆ క్రమంలో వేలేరుపాడు మండలంలోని వరద బాధిత కుటుంబాలకు ప్రతి రోజు పాల ప్యాకేట్స్ పంపిణీ చేయిస్తున్నారు. ఈ సందర్బంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా... లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతమని స్పష్టం చేశారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో  జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  గత 4 రోజులుగా భాదితులకు కడుపు నిండా అన్నం పెట్టలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.  తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారనీ, అందుకే ప్రభుత్వం ఈ మాత్రమైనా సాయం అందించడానికి ముందుకు వచ్చిందనీ, లేకుంటే  బాధితులను   జగన్ ప్రభుత్వం పట్టించుకునేది కాదని ఆయన పేర్కొన్నారు.  గోదావరి ఉగ్రరూపంతో జిల్లాలోని కుక్కునూరు, వేలూరుపాడు మండలాల్లో 80 శాతం కుటుంబాలు నిర్వాసితులయ్యారని ఆయన చెప్పారు. మరోవైపు .. వరద బాధితులు చాలా కష్టాల్లో ఉన్నారని వారిని దయచేసి ఆదుకోవాలంటూ ఏలూరు జిల్లాలో వరదలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్‌ను కలిసి   చింతమనేని ప్రభాకర్ విజ్జప్తి చేశారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.