మౌనమేలనోయి.. జగన్ ను నిలదీస్తున్న వైసీపీ క్యాడర్

Publish Date:May 16, 2024

Advertisement

ఏపీలో పోలింగ్ పూర్తయ్యింది. ఓటరు తీర్పు సురక్షితంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలు మరింత భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నాయి. పోలింగ్ పూర్తై మూడు రోజులు గడిచినా రాష్ట్రంలో మాత్రం ఇంకా హై టెన్షన్ వాతావరణం అలాగే ఉంది. రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో రగిలిపోతున్నాయి. సాధారణంగా పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొనడం ఆ తరువాత చల్లారిపోవడం సహజమే. అయితే ఈ సారి మాత్రం పోస్ట్ పోల్ హింస పెచ్చరిల్లుతోంది. 

గత ఎన్నికల కంటే రెండు శాతానికి మించి అధికంగా పోలింగ్ జరగడం అధికార వైసీపీలో ఆందోళనకు కారణమైంది. అందుకే ఉదయం చెదురుమదురు సంఘటనలు వినా ప్రశాంతంగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి వైసీపీ మూకలు చెలరేగిపోవడంతో  హింసాత్మకంగా మారింది. పోలింగ్ సరళిని బట్టి ఆందోళనకు గురైన వైసీపీ అధినాయకత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే వైసీపీ మూకలు పోలింగ్ సజావుగా జరగకుండా, ఓటర్లు ధైర్యంగా క్యూలలో నిలబడి ఓటు వేసే పరిస్థితి లేకుండా చేయడానికి ప్రయత్నించాయన్నది పరిశీలకులు విశ్లేషణ. సరే మళ్లీ అదే పరిశీలకులు హింసాకాండకు బెదరకుండా ఓటర్లు ధైర్యంగా, ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనీ, ఇదే వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలియజేస్తోందని కూడా చెప్పారు.

. అదే పోలింగ్ సరళి తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసిం ది. ఇక అధికార పార్టీ ఆగడాలను మౌనంగా భరించనవసరం లేదన్న ధైర్యాన్ని నింపింది. పోలింగ్ తరువాత పల్నాడు, రాయల సీమలో  వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో తెలుగుదేశం శ్రేణులు నిర్భీతిగా ముందుకు కదలడానికి అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అదే సమయంలో పోలింగ్ తమకు వ్యతిరేకంగా జరిగిందని వైసీపీ కీలక నేతలు, కొందరు అభ్యర్థులూ మీడియా ముందు అంగీకరిస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం కూటమికి అన్నివిధాలుగా మద్దతుగా నిలిచారనీ, తమను మాత్రం ఎక్కడికక్కడ నియంత్రించారనీ అంబటి, సజ్జల వంటి వారు ఆరోపణలు గుప్పించారు. సజ్జల అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పని చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మాటలన్నీ వైసీపీలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతున్నాయి. అలాగే వైసీపీ అడ్డాలుగా చెప్పబడే ప్రాంతాలలో పోలింగ్ అనంతర హింసాకాండను నిలువరించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినా తెలుగుదేశం కేడర్ ధైర్యంగా నిలబడి అడ్డుకోవడం ఆయా ప్రాంతాలలో మారిన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వైసీపీ కంచుకోటలను ఓటర్లు బీటలు వారేగా చేశాయనడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక ఎన్నికల తరువాత ఆ పార్టీ అధినేత జగన్ తీరు క్యాడర్ లో ఉత్సాహాన్ని చంపేసింది. ఆయన పూర్తిగా మౌనముద్రలోకి వెళ్లిపోవడం, రేపో మాపో విదేశీ పర్యటనకు రెడీ అయిపోవడంతో క్యాడర్ లో విశ్వాసం సన్నిగిల్లింది.  ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో హింసాకాండను ఖండించాల్సిన బాధ్యత కలిగిన హోదాలో ఉన్నారు. అయినా ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకీ మౌనం అంటూ జగన్ ను వైసీపీ క్యాడర్ నిలదీస్తోంది. ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన క్యాడర్ కు ఓదార్పు కలిగేలా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమేమిటన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.  మరోవైపు విపక్ష నేత చంద్రబాబు ఎన్నికల హింసను ఖండిస్తూ.. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్నిలక సంఘానికి లేఖ రాశారు. కానీ జగన్ వైపు నుంచి అటువంటిదేమీ లేదు.  ఇదే ఆయనలోని నైరాశ్యానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం క్యాడర్ లో ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నింపడానికైనా విజయం మనదే అన్న భరోసా ఇవ్వడానికి కూడా జగన్ ముందుకు రాలేదంటే ఫలితంపై ఆయన అభిప్రాయం ఏమిటన్నది అవగతమైపోతోందంటున్నారు.  ఇక జగన్ మౌత్ పీస్ లాంటి సజ్జల బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోకండి అంటూ వైసీపీ క్యాడర్ కు  సలహాలిస్తూ మన సీన్ అయిపోయిందన్న సంకేతాలిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ వైసీపీ అపశకునపు పక్షులని ఎదురుగా పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం కూడా రాష్ట్రానికి అంత మంచిది కాదు.
అమరావతి మహానగరాన్ని పురిట్లోనే చంపేయాలని అనుకున్న యముడు జగన్ పోయాడు... అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ఆ మయబ్రహ్మకు ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఫోన్ ట్యాపింగ్ తెరమీదకు తెచ్చింది. 
హ్యాట్రిక్ కొట్టన ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించనుందన్న వార్తలు వెలువుడుతుందన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పార్లమెంట్ సమావేశాల తేదీలు కన్ఫర్మ్ అయ్యాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే
మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసి కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. బీజేపీకి 240 స్థానాలు మాత్రమే రావడంతో మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 32 స్థానాలు అవసరమయ్యాయి. ఫలితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరమయ్యింది. ముఖ్యంగా తెలుగుదేశం,జేడీయు సహకారంతో పాటు 21పార్టీల మద్దతు తప్పని సరి అయింది.
ఈరోజు కోసమే.. ఈ శుభవార్తని రాజధాని ప్రాంత రైతులందరూ వినడం కోసమే ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు. ఏ లక్ష్యాన్ని ఆశించి ఆయన ఆ సినిమా రూపొందించారో, ఈరోజు చంద్రబాబు నాయుడి ప్రకటనతో ఆ లక్ష్యం నెరవేరిందని భావించవచ్చు.
చరిత్ర కనీవినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఇక ఓటమికి సాకులు వెతకడం మానేసింది. చేతులెత్తేసింది. జనాలకు ముఖం చూపలేక నానా యాతనా పడుతోంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్) టాప్ ర్యాంక్ సాధించినప్పటికీ, దేశంలోని టాప్ మెడికల్ కాలేజీ ఎయిమ్స్(ఏఐఐఎంఎస్)లో సీటు రావడం కష్టమే. ఎందుకంటే, ఈసారి టాప్ 1 ర్యాంక్ 67 మందికి వచ్చింది.
కేసీఆర్‌కి కరెంట్ షాక్ తగిలింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నోటీసులు జారీ చేసినట్టు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.
తెలంగాణలో నాలుగు స్థానాలు ఉన్న బిజెపి రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను గెలిచినప్పటికీ  హైదరాబాద్ పరాజయానికి గల కారణాలను అన్వేషించ పనిలో అధిష్టానం ఉంది.
ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ ను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి ఆకాశానికెత్తేసిన వారు ఇప్పుడు పార్టీ పతనానికి, తమ ఓటమికి కారణం జగనే అంటూ వేలెత్తి చూపుతున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ ను నిందించారు. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణా అదే బాట పట్టారు.
ఇంతకాలం తెలుగుదేశం, జనసేన నాయకుల మీద బూతుపురాణం విప్పుతూ, అందరూ చెవుల్లో దూది పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన అచ్చతెలుగు మహిళామణి శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ నాయకుల మీద తన ప్రతాపం చూపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలలో విజయానికి సోపానంగా దోహదం చేస్తుందన్న ఆశతో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఎన్నికలకు ముందే అంటే ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ప్రారంభించి ఆ ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసింది మోడీ ప్రభుత్వం. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.